Friday, July 17, 2026
24.5 C
Hyderabad

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే వివాదాలే ఎక్కువగా వార్తల్లో నిలిచే పరిస్థితి కొనసాగుతుంది. యూజీసీ తరహాలో ‘నీట్’ని నీట్ గా నిర్వహించలేమా?

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతదేశంలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఒకే జాతీయ ప్రమాణాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో నీట్ పరీక్షను 2013లో ప్రారంభించినప్పటికీ, రాష్ట్రాల వ్యతిరేకతల మధ్య 2017 నుంచి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా సమాన అవకాశాలు కల్పించడం, మెడికల్ సీట్ల కేటాయింపులో పారదర్శకత పెంచడం, కోచింగ్ మాఫియా ప్రభావాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలు దీనికి మూలం. అయితే ఆశించిన ఫలితాల కంటే వివాదాలు, పేపర్ లీకులు, పరీక్షల రద్దులు, రీ-ఎగ్జామ్స్, సాంకేతిక లోపాలు ఎక్కువగా నీట్ ని నీట్ గా చుట్టుముట్టాయి. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.

ప్రస్తుతం దేశంలో వైద్య విద్యకు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతి ఏడాది 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్-యూజీ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో చిన్న పొరపాటు కూడా లక్షలాది కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో నీట్ నిర్వహణ విషయంలో వరుసగా వివాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పేపర్ లీకేజీల ఆరోపణలు, పరీక్షా కేంద్రాల నిర్వహణలో లోపాలు, ఫలితాలపై వివాదాలు, కోర్టు కేసులు సాధారణమైపోయాయి.

ఇటీవల రీ-ఎగ్జామ్ నిర్వహణ నిర్ణయం మరోసారి నీట్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థులు మళ్లీ సన్నద్ధం కావాల్సి రావడం మానసికంగా వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెలల తరబడి శ్రమించి పరీక్ష పూర్తి చేసిన తర్వాత మళ్లీ అదే ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులపై కూడా ఆర్థిక, మానసిక భారం పెరుగుతోంది.

గతంలో రాష్ట్రాల వారీగా నిర్వహించిన ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో జాతీయ వివాదాలు అరుదుగా కనిపించేవి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో పరీక్షలను నిర్వహించేవి. మెడికల్ అడ్మిషన్లు కూడా నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం పూర్తయ్యేవి. కానీ కేంద్ర స్థాయిలో నిర్వహిస్తున్న నీట్‌లో ప్రతి సంవత్సరం ఏదో ఒక వివాదం తలెత్తడం వ్యవస్థాపరమైన లోపాలకు సంకేతంగా కనిపిస్తోంది.

పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్‌టీఏ పనితీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. పరీక్షల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల తయారీదారులను రహస్య ప్రాంతాల్లో ఉంచడం, సీఆర్‌పీఎఫ్ భద్రత, ఉన్నతస్థాయి పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోవడం పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో తెలియజేస్తోంది. ఒక ప్రవేశ పరీక్ష నిర్వహణకు హెలికాప్టర్లు, భారీ భద్రతా బలగాలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే అది విజయానికి కాకుండా వ్యవస్థ వైఫల్యానికే సూచనగా పరిగణించాల్సి ఉంటుంది.

అదే సమయంలో సాంకేతిక సమస్యలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ సమయంలో వెబ్‌సైట్ నిలిచిపోవడం, టైమ్‌అవుట్ సమస్యలు, ఫీజు రిఫండ్ ప్రక్రియలో గందరగోళం వంటి అంశాలు పరీక్షా సంస్థ సామర్థ్యంపై సందేహాలు కలిగిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి పోర్టల్‌ను వినియోగిస్తారని ముందుగానే తెలిసినప్పటికీ, తగిన సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించడంలో లోపాలు కనిపించాయి.

ఇక సైబర్ నేరాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. రిఫండ్ మొత్తాలను అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్లించడం, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నపత్రాలు అమ్ముతామంటూ మోసాలు జరగడం విద్యార్థుల ఆందోళనను పెంచుతోంది. పరీక్షా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, వైఫల్యాలకు బాధ్యులైన వ్యవస్థలపై చర్యలు పరిమితంగానే ఉండగా, దాని భారం మాత్రం విద్యార్థులే మోయాల్సి వస్తోంది. పరీక్ష రద్దు అయితే మళ్లీ చదవాల్సింది విద్యార్థులే! అడ్మిషన్లు ఆలస్యం అయితే భవిష్యత్తు అనిశ్చితిలో పడేది కూడా వారిదే. కానీ, నిర్వాహక వ్యవస్థలో జవాబుదారీతనం కనిపించడం లేదు.

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ నిర్వహణను పరిశీలిస్తే క్రమశిక్షణ, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యం కనిపిస్తుంది. అదే స్థాయి ప్రమాణాలను నీట్ నిర్వహణలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రశ్నపత్రాల భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి.

నీట్ లక్ష్యం సరైనదే కావచ్చు. దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణంతో వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించాలనే ఉద్దేశాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ విశ్వసనీయంగా లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ సమగ్ర సమీక్ష చేపట్టి లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి సంవత్సరం పరీక్షల కంటే వివాదాలే ఎక్కువగా వార్తల్లో నిలిచే పరిస్థితి కొనసాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేసే వ్యవస్థకు సంస్కరణలు అత్యవసరం. నీట్‌ను కాపాడాలంటే ముందు విద్యార్థుల నమ్మకాన్ని కాపాడాలి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News