Wednesday, June 10, 2026
23.8 C
Hyderabad

ఎల్ఐసీపై మోదీ-అదానీ ప్రై‘వేటు’!?|EDITORIAL

1956 సెప్టెంబర్ 1న 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థగా ఏర్పడిన ఎల్ఐసి, లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం.
భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?

1956సెప్టెంబర్ 1న దేశంలోని 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేశారు. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం. హౌసింగ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ లి., కార్డ్స్ సర్వీసెస్ లి., మ్యూచువల్ ఫండ్ లి., పెంషన్ ఫండ్ లి., ఐడిబిఐ బ్యాంకుగా లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. 2024లో బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం, ఎల్‌ఐసీ ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకారం 2022 నాటికి నాలుగవది. ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు ఓ ప్రైవేట్ వ్యక్తి పరం కాబోతోందా?

అదానీతో ప్రధాని మోదీ బంధం బలమైంది. అదానీ కంపెనీపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఏ చర్యా తీసుకోలేదు. కనీసం ఖండించలేదు. అదానీ వ్యవహారంపై గతంలో పార్లమెంట్‌ స్తంభించింది. ఆర్థిక అవతవకలు, అమెరికా సంస్థ ఆరోపణలు అలా ఉండగానే తాజగా ఆ కంపెనీకి ఎల్‌ఐసి మొత్తాన్ని ధార పోశారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసిని అదానీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం బలి పెట్టడంపై వస్తున్న విమర్శలను సైతం పట్టించుకోవడం లేదు. కోట్లాదిమంది పాలసీదారుల, ఉద్యోగుల, అధికారుల ప్రయోజనాలను అదానీకి బలివ్వడం అసమంజసం.

గతంలోనే ఎల్‌ఐసిని ప్రైవేటీకరించాలని చూసినప్పుడు, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎల్‌ఐసి మొత్తాలను అదానికి అప్పుగా బదిలీ చేయడంపై దేశంలో మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లెఫ్ట్‌ నేతలు కూనంనేని సాంబశివరావు, బివి రాఘవులు, మరికొందరు వ్యతిరేకతను చాటారు.

అమెరికా నుండి వెలువడే ’వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో ఎల్ఐసీపై ప్రత్యేక కథనం వచ్చింది. అంతర్జాతీయంగా విత్త సంస్థలు అదానీకి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 3.9 మిలియన్‌ డాలర్లు అంటే 33 వేల కోట్ల రూపాయలను అదానీ గ్రూపునకు మళ్లించడానికి సిద్ధమైందననే ఆ వార్త సారాంశం. ఇందులో భాగంగానే అదానీ పోర్ట్స్‌ అనుబంధ సంస్థ రుణాల రీఫైనాన్స్‌ కోసం జారీ చేసిన 585 బిలియన్‌ డాలర్ల దాదాపు రూ.5,000 కోట్ల బాండ్లను ఎల్‌ఐసి కొనుగోలు చేసింది. అదానీపై ‘లంచం, మోసం ఆరోపణలపై అమెరికా కోర్టుల్లో కేసులు నమోదైన నేపథ్యంలో అమెరికా, యూరోపియన్‌ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడాతున్న తరుణంలో భారత ప్రభుత్వం అదానీ కోసం ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రణాళికను రూపొందించిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్‌ఎస్‌), ఎల్‌ఐసి నుండి పొందిన అంతర్గత పత్రాలు సహా అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధుల మళ్లింపునకు ఏ విధంగా పాల్పడిందో గుర్తించామని ఆ పత్రిక పేర్కొంది.

రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో అదానీ పోర్ట్సు విడుదల చేసిన మొత్తం బాండ్లను 2025 మే 30న ఒక్క ఎల్‌ఐసి కొనేసింది. అదానీ గ్రూపునకు విశ్వసనీయత కల్పించడమన్నది అసలు కుట్ర. అందుకే అంతకు ముందు ససేమిరా అన్న అమెరికా ఏథెన్‌ ఇన్సూరెన్స్‌ అదానీలో జూన్‌లో 750 మిలియన్‌ డాలర్లు అంటే రూ.6,650 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

ఆదానీ ఆర్థిక అక్రమాలు, అవినీతిపై 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వరుస రిపోర్టులను విడుదల చేసింది. అదానీ కృత్రిమంగా తన కంపెనీల షేర్లను పెంచుకుంటున్నారని, డొల్ల కంపెనీలతో పన్నులు ఎగ్గొడుతున్నారని విశ్లేషించింది. అదానీ కంపెనీలు ప్రమాదకర అప్పుల్లో కూరుకుపోయాయని కూడా వెల్లడించింది. ఇప్పుడు వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ ప్రభుత్వ వర్గాలు, ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

అయితే అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని ఎల్‌ఐసి పేర్కొంది. బోర్డు ఆమోదించిన విధి విధానాల మేరకే తాము పెట్టుబడులు పెడతామని, వాటిపై తమదే తుది నిర్ణయమని బుకాయించింది. ఇంతకీ ఎల్‌ఐసిలో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు తెలపడం ప్రభుత్వ బాధ్యత. వెంటనే పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి. ఇంతపెద్ద మొత్తంలో వ్యవహారం గుంభనంగా సాగడాన్ని అడ్డుకోవాలి. ఎల్‌ఐసిని ప్రైవేట్‌ పరం చేస్తున్నారా? అయితే, ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెంచాలి. పాలకుల కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలపై నిలదీయాలి. విపక్ష కాంగ్రెస్‌ గట్టిగా నిలబడాలి. ఎల్‌ఐసిని రక్షించే పోరాటానికి దిగాలి. అందుకు దేశంలోని ప్రజలు కూడా అవగాహనతో అడుగులు వేయాలి.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News