Friday, June 5, 2026
27 C
Hyderabad

ఎల్ఐసీపై మోదీ-అదానీ ప్రై‘వేటు’!?|EDITORIAL

1956 సెప్టెంబర్ 1న 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థగా ఏర్పడిన ఎల్ఐసి, లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం.
భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?

1956సెప్టెంబర్ 1న దేశంలోని 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేశారు. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం. హౌసింగ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ లి., కార్డ్స్ సర్వీసెస్ లి., మ్యూచువల్ ఫండ్ లి., పెంషన్ ఫండ్ లి., ఐడిబిఐ బ్యాంకుగా లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. 2024లో బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం, ఎల్‌ఐసీ ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకారం 2022 నాటికి నాలుగవది. ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు ఓ ప్రైవేట్ వ్యక్తి పరం కాబోతోందా?

అదానీతో ప్రధాని మోదీ బంధం బలమైంది. అదానీ కంపెనీపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఏ చర్యా తీసుకోలేదు. కనీసం ఖండించలేదు. అదానీ వ్యవహారంపై గతంలో పార్లమెంట్‌ స్తంభించింది. ఆర్థిక అవతవకలు, అమెరికా సంస్థ ఆరోపణలు అలా ఉండగానే తాజగా ఆ కంపెనీకి ఎల్‌ఐసి మొత్తాన్ని ధార పోశారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసిని అదానీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం బలి పెట్టడంపై వస్తున్న విమర్శలను సైతం పట్టించుకోవడం లేదు. కోట్లాదిమంది పాలసీదారుల, ఉద్యోగుల, అధికారుల ప్రయోజనాలను అదానీకి బలివ్వడం అసమంజసం.

గతంలోనే ఎల్‌ఐసిని ప్రైవేటీకరించాలని చూసినప్పుడు, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎల్‌ఐసి మొత్తాలను అదానికి అప్పుగా బదిలీ చేయడంపై దేశంలో మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లెఫ్ట్‌ నేతలు కూనంనేని సాంబశివరావు, బివి రాఘవులు, మరికొందరు వ్యతిరేకతను చాటారు.

అమెరికా నుండి వెలువడే ’వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో ఎల్ఐసీపై ప్రత్యేక కథనం వచ్చింది. అంతర్జాతీయంగా విత్త సంస్థలు అదానీకి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 3.9 మిలియన్‌ డాలర్లు అంటే 33 వేల కోట్ల రూపాయలను అదానీ గ్రూపునకు మళ్లించడానికి సిద్ధమైందననే ఆ వార్త సారాంశం. ఇందులో భాగంగానే అదానీ పోర్ట్స్‌ అనుబంధ సంస్థ రుణాల రీఫైనాన్స్‌ కోసం జారీ చేసిన 585 బిలియన్‌ డాలర్ల దాదాపు రూ.5,000 కోట్ల బాండ్లను ఎల్‌ఐసి కొనుగోలు చేసింది. అదానీపై ‘లంచం, మోసం ఆరోపణలపై అమెరికా కోర్టుల్లో కేసులు నమోదైన నేపథ్యంలో అమెరికా, యూరోపియన్‌ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడాతున్న తరుణంలో భారత ప్రభుత్వం అదానీ కోసం ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రణాళికను రూపొందించిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్‌ఎస్‌), ఎల్‌ఐసి నుండి పొందిన అంతర్గత పత్రాలు సహా అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధుల మళ్లింపునకు ఏ విధంగా పాల్పడిందో గుర్తించామని ఆ పత్రిక పేర్కొంది.

రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో అదానీ పోర్ట్సు విడుదల చేసిన మొత్తం బాండ్లను 2025 మే 30న ఒక్క ఎల్‌ఐసి కొనేసింది. అదానీ గ్రూపునకు విశ్వసనీయత కల్పించడమన్నది అసలు కుట్ర. అందుకే అంతకు ముందు ససేమిరా అన్న అమెరికా ఏథెన్‌ ఇన్సూరెన్స్‌ అదానీలో జూన్‌లో 750 మిలియన్‌ డాలర్లు అంటే రూ.6,650 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

ఆదానీ ఆర్థిక అక్రమాలు, అవినీతిపై 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వరుస రిపోర్టులను విడుదల చేసింది. అదానీ కృత్రిమంగా తన కంపెనీల షేర్లను పెంచుకుంటున్నారని, డొల్ల కంపెనీలతో పన్నులు ఎగ్గొడుతున్నారని విశ్లేషించింది. అదానీ కంపెనీలు ప్రమాదకర అప్పుల్లో కూరుకుపోయాయని కూడా వెల్లడించింది. ఇప్పుడు వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ ప్రభుత్వ వర్గాలు, ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

అయితే అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని ఎల్‌ఐసి పేర్కొంది. బోర్డు ఆమోదించిన విధి విధానాల మేరకే తాము పెట్టుబడులు పెడతామని, వాటిపై తమదే తుది నిర్ణయమని బుకాయించింది. ఇంతకీ ఎల్‌ఐసిలో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు తెలపడం ప్రభుత్వ బాధ్యత. వెంటనే పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి. ఇంతపెద్ద మొత్తంలో వ్యవహారం గుంభనంగా సాగడాన్ని అడ్డుకోవాలి. ఎల్‌ఐసిని ప్రైవేట్‌ పరం చేస్తున్నారా? అయితే, ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెంచాలి. పాలకుల కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలపై నిలదీయాలి. విపక్ష కాంగ్రెస్‌ గట్టిగా నిలబడాలి. ఎల్‌ఐసిని రక్షించే పోరాటానికి దిగాలి. అందుకు దేశంలోని ప్రజలు కూడా అవగాహనతో అడుగులు వేయాలి.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News