Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల నిరూపణల్లో జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ అజెండా నుంచి నెమ్మదిగా తప్పుకోవడం రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు అధికార కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రావడానికి ముందు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, అవినీతి నిరూపణలపై స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

బీఆర్ఎస్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ కార్ రేసు, ధరణి వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు నెమ్మదిగా అజెండా నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇది రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలు చేయడం ఒక ఎత్తు. వాటిని నిరూపించడం మరో ఎత్తు. అయితే, అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తాత్సారమే అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగేలా సమగ్ర విచారణ, అనుమానాలను నివ్రుతి జరగలేదన్న అభిప్రాయం ఉంది. “నిప్పులేనిదే పొగరాదు” అన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. అధికారంలో ఉన్నవారు పారదర్శకంగా స్పందించకపోతే అనుమానాలు మరింత పెరుగుతాయి.

నాదర్‌గుల్ ప్రాంతంలో భూములపై నెలకొన్న వివాదం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి రైతులను దూరం చేయడం, ప్రైవేట్ కంపెనీల జోక్యం పెరగడం వంటి అంశాలు తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ భూములు ప్రభుత్వానివా? ప్రైవేట్‌వా? రైతుల హక్కులు ఎమయ్యాయి? ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? జవాబు దొరకని పరిస్థితుల్లో రైతులు భూపోరాటానికి దిగారు. వారు కేవలం నిరసనలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష చర్యలకు దిగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

రైతులు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు, బౌన్సర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు పరిస్థితి అదుపుతప్పి, రైతులు గేట్లు దాటి లోపలికి వెళ్లడం, బౌన్సర్లను తరిమికొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది కేవలం భూమి వివాదం మాత్రమే కాదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న సంకేతం కూడా.

ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ తో పాటు వామపక్ష పార్టీలు మద్దతు తెలపడం రాజకీయ రంగును తీసుకువచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి కూడా ప్రతిపక్షంపై విమర్శలు చేయడం రైతుల్లో అసహనాన్ని పెంచింది.

రైతులు సమస్య రాజకీయం కావడం కంటే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? భూముల యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలి. స్వతంత్ర విచారణ జరపాలి. రైతుల హక్కులను రక్షించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇవి చేయకపోతే ప్రజల్లో అవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం కంటే, పాలనలో పారదర్శకత చూపించడం అత్యవసరం. నాదర్‌గుల్ వంటి సంఘటనలు కేవలం స్థానిక సమస్యలు కావు. అవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పరీక్షించే సూచికలు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం అవసరం.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News