Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల నిరూపణల్లో జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ అజెండా నుంచి నెమ్మదిగా తప్పుకోవడం రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు అధికార కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రావడానికి ముందు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, అవినీతి నిరూపణలపై స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

బీఆర్ఎస్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ కార్ రేసు, ధరణి వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు నెమ్మదిగా అజెండా నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇది రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలు చేయడం ఒక ఎత్తు. వాటిని నిరూపించడం మరో ఎత్తు. అయితే, అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తాత్సారమే అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగేలా సమగ్ర విచారణ, అనుమానాలను నివ్రుతి జరగలేదన్న అభిప్రాయం ఉంది. “నిప్పులేనిదే పొగరాదు” అన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. అధికారంలో ఉన్నవారు పారదర్శకంగా స్పందించకపోతే అనుమానాలు మరింత పెరుగుతాయి.

నాదర్‌గుల్ ప్రాంతంలో భూములపై నెలకొన్న వివాదం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి రైతులను దూరం చేయడం, ప్రైవేట్ కంపెనీల జోక్యం పెరగడం వంటి అంశాలు తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ భూములు ప్రభుత్వానివా? ప్రైవేట్‌వా? రైతుల హక్కులు ఎమయ్యాయి? ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? జవాబు దొరకని పరిస్థితుల్లో రైతులు భూపోరాటానికి దిగారు. వారు కేవలం నిరసనలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష చర్యలకు దిగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

రైతులు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు, బౌన్సర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు పరిస్థితి అదుపుతప్పి, రైతులు గేట్లు దాటి లోపలికి వెళ్లడం, బౌన్సర్లను తరిమికొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది కేవలం భూమి వివాదం మాత్రమే కాదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న సంకేతం కూడా.

ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ తో పాటు వామపక్ష పార్టీలు మద్దతు తెలపడం రాజకీయ రంగును తీసుకువచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి కూడా ప్రతిపక్షంపై విమర్శలు చేయడం రైతుల్లో అసహనాన్ని పెంచింది.

రైతులు సమస్య రాజకీయం కావడం కంటే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? భూముల యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలి. స్వతంత్ర విచారణ జరపాలి. రైతుల హక్కులను రక్షించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇవి చేయకపోతే ప్రజల్లో అవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం కంటే, పాలనలో పారదర్శకత చూపించడం అత్యవసరం. నాదర్‌గుల్ వంటి సంఘటనలు కేవలం స్థానిక సమస్యలు కావు. అవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పరీక్షించే సూచికలు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం అవసరం.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News