Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

నిర్వాసితుల గోడు!|EDITORIAL

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.

గంగవరం పోర్టు కోసం త్యాగం చేసిన మత్స్యకారులు ఉపాధి కోల్పోయి నిండా మునిగారు. అదే పోర్టును దక్కించుకున్న ఆదానీ మాత్రం ఒడ్డున పడ్డారు. ఇదే నమూనా తెలంగాణలోనూ పునరావృతమైంది. కేసీఆర్‌ హయాంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల భూములు, గ్రామాలు త్యాగం చేసిన రైతులు, ప్రజలు ఆగమయ్యారు. కానీ పాలకులూ, వారి అనుచరుల భూములు మాత్రం నీటితో పచ్చగా కళకళలాడతున్నాయి.

అమరావతి రాజధాని పేరుతో లక్ష ఎకరాలకు పైగా భూసేకరణ జరిగింది. రైతులు ఇచ్చిన త్యాగాలకు తగిన పరిహారం లభించిందా? ప్లాట్లు సక్రమంగా అందాయా? అంటే సమాధానం లేదు. బహిరంగంగా ప్రశంసలు కురిపించడం తప్ప రైతులకు వాస్తవ లబ్ధి చేకూరలేదు. ఇంకా ప్లాట్ల కోసం రైతులు పాట్లు పడుతూనే ఉన్నారు. అయినా పాలకుల భూదాహం తీరలేదు. ఇప్పుడు రెండో దఫా భూసేకరణ మొదలైంది. ఈ అభివృద్ధి ఎవరి కోసం అన్న ప్రశ్నకు పాలకులు నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన సమయం ఇది.

పోలవరం ప్రాజెక్టు పరిస్థితి మరింత విషాదకరం. దేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రాజెక్టుగా చెప్పుకునే పోలవరం నిర్వాసితులు నేటికీ దుర్భర జీవితం గడుపుతున్నారు. 1.20 లక్షల కుటుంబాలు ముంపు ముప్పులో ఉండగా, వారికి న్యాయమైన పరిహారం, సమగ్ర పునరావాసం ఇప్పటికీ అందలేదు. భూమికి భూమి లేదు. ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అమలు కాలేదు. నిర్మించిన పునరావాస కాలనీల్లో వర్షం పడితే ఇళ్లు నీళ్ళల్లో తేలుతున్నాయి. నిలువునా కారుతున్నాయి. శ్మశానాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు వంటి కనీస సదుపాయాలే లేవు.

1986, 2022 వరదల అనుభవం ముంపు ప్రాంతాల స్థితిగతులను కళ్ళకు కట్టినా, పాలకులు వాస్తవాన్ని గ్రహించడం లేదు. కాంటూరు సర్వేలు, లైడార్‌ సర్వేలు వాస్తవాలను ప్రతిబింబించలేదని నిర్వాసితులు చెబుతున్నారు. అయినా తాజా పరిహారం 2017కు ముందు అంచనాల ఆధారంగానే చెల్లిస్తున్నారు. డ్యామ్‌ అంచనాలు రెండుసార్లు పెరిగినా, నిర్వాసితుల ప్యాకేజీ మాత్రం పెరగలేదు. పెళ్లయిన యువతులకు పునరావాస హక్కులు నిరాకరించడం, మహిళలకు పురుషులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వకపోవడం తీవ్రమైన అన్యాయం.

గతంలో ఏపీ సీఎం జగన్ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించినా, అది కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అయినా తాజా ధరలకు అనుగుణంగా ప్యాకేజీ సవరించి అమలు చేస్తుందేమోనని నిర్వాసితులు ఆశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. డ్యామ్‌ పనులను పరిశీలించిన సీఎం, ముంపు ప్రాంతాలు, పునరావాస కాలనీలను సందర్శించి ఉంటే సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండేది.

మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం చేస్తామని లక్ష్యాలు ప్రకటిస్తున్నారు. కానీ నిర్వాసితులకు న్యాయం జరగకుండానే ప్రాజెక్టు పూర్తయితే అది అభివృద్ధి ఎలా అవుతుంది? డ్యామ్‌ను దశలవారీగా కాకుండా పూర్తి ఎత్తు వరకూ ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తయ్యాకనే నిర్మించాలన్న నిర్వాసితుల డిమాండ్ న్యాయమైనదే. డయాఫ్రం వాల్‌ నాణ్యత లోపాల వల్ల దెబ్బతిన్న విషయం విదేశీ నిపుణులే నిర్ధారించారు. అయినా నివేదికను బహిరంగపర్చలేదు. అదనంగా రూ.900 కోట్లు వెచ్చించారు. కానీ, బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు లేవు. అవకతవకలపై పారదర్శక విచారణ జరగాలి.

అభివృద్ధి అంటే ప్రజలను ముంచి నిర్మించే కాంక్రీట్‌ నిర్మాణాలు కాదు. ప్రజల జీవన భద్రత, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణే నిజమైన అభివృద్ధి. హెలికాప్టర్‌ పర్యటనలు, తీయని మాటలు తగ్గించి, నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వాల తొలి కర్తవ్యం కావాలి. మరి ప్రభుత్వాలు, పాలకులు ఆ దిశగా ఆలోచిస్తారా? నిర్వాసితులకు నిజంగా సాయంగా నిలబడతారా? ప్రజల త్యాగాల పునాదుల మీద నిర్మితమవుతోన్న ప్రాజెక్టుల ఫలాలను వారికే దక్కనిస్తారా?

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News