Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

మొక్కుబడిగా బడ్జెట్ మొదటి దశ సమావేశాలు!|EDITORIAL

పార్లమెంట్ బడ్జెట్ తొలిదశ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టడం, ధన్యవాద తీర్మానం వరకు సరే, కానీ చర్చ సహేతుకంగా జరుగుతోందా? దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన చర్చలు, పాలకపక్షాన్ని నిలదీసే ప్రశ్నలు, ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే అధికార పక్షం, ప్రత్యామ్నాయ విధానాలపై సమగ్ర చర్చకు తావులేని ఈ సమావేశాలు మరోసారి ‘మొక్కుబడి’గానే మిగిలిపోయాయి.

ఈసారి సమావేశాలలో ఆసక్తికర అంశం స్పీకర్ ఓం బిర్లా తీరుపై అవిశ్వాస తీర్మానం. పార్లమెంట్ చరిత్రలో స్పీకర్‌పై అవిశ్వాసం అరుదైన పరిణామం. భారత ప్రధాన ప్రతిపక్షం తమకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. సభా నిర్వహణలో నిష్పాక్షికత స్పీకర్ పదవికి అలంకారం. ఆ పదవిపైనే అనుమానాలు వ్యక్తమవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. స్పీకర్ నిర్ణయాలు కేవలం సాంకేతిక ప్రక్రియలకే పరిమితం కాకూడదు. అవి ప్రజాస్వామిక చర్చలకు మార్గం సుగమం చేయాలి.

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ అంటే, అది ప్రభుత్వ పనితీరుపై సమగ్ర సమీక్షే. అదే సందర్భంలో దేశ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలపై విపక్షాలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నిలదీయవచ్చు. కానీ ప్రశ్నలకే తావులేని చర్చలతో అసమగ్రంగా పార్లమెంట్ ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో సమాధానం ఇచ్చినప్పటికీ, లోక్‌సభలో విస్తృత చర్చకు అవకాశం కల్పించలేదని ప్రతిపక్షం అంటోంది. ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వానికి పార్లమెంటే ప్రధాన వేదిక. అక్కడ ప్రశ్నలు ఎదుర్కొని సమాధానాలు ఇవ్వడం ప్రజాస్వామ్య రీతి, నీతి, రివాజు, పద్ధతి.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగాలకు అతి తక్కువ అవకాశాలే లభిస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. వాయిదా తీర్మానాలు, అత్యవసర చర్చల డిమాండ్లు తరచుగా తిరస్కరించబడుతున్నాయనేది ప్రతిపక్ష వాదన. అధికార, ప్రతిపక్షాల వానదలేమైనప్పటికీ, చర్చను నిర్మాణాత్మకంగా జరిగేవిదంగా ప్రవర్థించాల్సిన బాధ్యత ఇరు పక్షాలది. నియమావళి ప్రకారం లభ్యమయ్యే అవకాశాలను సమర్థంగా వినియోగించడం అవసరం.

ఈ సమావేశాల్లో విదేశాంగ, వాణిజ్య విధానాలు అతి ముఖ్యమైనవి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్‌తో చర్చలు కేవలం దౌత్యపరమైన నిర్ణయాలు మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే విధానాలు. దిగుమతులపై సుంకాలను తగ్గించడం, మార్కెట్‌ ను విస్తరించడం వంటి నిర్ణయాలు చిన్న, సన్నకారు రైతులు, వ్యాపారులు, ఉత్పత్తి రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రజలకు స్పష్టంగా తెలియాలి. ఆ భరోసా బాధ్యత ప్రభుత్వానిది. ఆ విధంగా చెప్పించడం ప్రతిపక్షానిది.

రష్యాతో చమురు కొనుగోళ్లు తగ్గించడం, అంతర్జాతీయ ఒత్తిడులు, అమెరికా వైఖరి వంటి అంశాలు కూడా చర్చకు రావాల్సినవే. విదేశాంగం అనేది కార్యనిర్వాహక శాఖ ప్రత్యేకాధికారం అయినప్పటికీ, ప్రజలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాల్లో పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతులు వంటి రంగాలపై ప్రభావం ఉంటే, ప్రజా ప్రతినిధుల వేదికపై సమగ్ర చర్చ తప్పనిసరి.

బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా కొత్తదనం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల పెంపు వంటివి మాటల్లో మాత్రమే కాక, ఫలితాల్లో కూడా ప్రతిఫలించాలి. బడ్జెట్ చర్చలు కేవలం ఆర్థిక గణాంకాల పరిమితిలో కాకుండా, సామాజిక ప్రభావాల కోణంలో కూడా సాగాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, మధ్యతరగతి భారం వంటి అంశాలు లోతుగా పరిశీలించబడాలి.

పార్లమెంట్ విలువ కేవలం చట్టాలు ఆమోదించడంలోనే కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఉంది. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం అసంపూర్ణం. అదే విధంగా బాధ్యతాయుత ప్రతిపక్షం లేకుండా చర్చ నాణ్యత పడిపోతుంది. ఇరుపక్షాలు కూడా తమ పాత్రను పునఃపరిశీలించాల్సిన సమయం ఇది. ప్రజల అనుమానాలు నివృత్తి చేయడం, విధానాలపై పారదర్శకత చూపించడం, విభిన్న అభిప్రాయాలను వినడం ఆవశ్యం. అర్థవంతమైన చర్చలు అనివార్యం. ఇవి ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News