Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

మొక్కుబడిగా బడ్జెట్ మొదటి దశ సమావేశాలు!|EDITORIAL

పార్లమెంట్ బడ్జెట్ తొలిదశ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టడం, ధన్యవాద తీర్మానం వరకు సరే, కానీ చర్చ సహేతుకంగా జరుగుతోందా? దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన చర్చలు, పాలకపక్షాన్ని నిలదీసే ప్రశ్నలు, ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే అధికార పక్షం, ప్రత్యామ్నాయ విధానాలపై సమగ్ర చర్చకు తావులేని ఈ సమావేశాలు మరోసారి ‘మొక్కుబడి’గానే మిగిలిపోయాయి.

ఈసారి సమావేశాలలో ఆసక్తికర అంశం స్పీకర్ ఓం బిర్లా తీరుపై అవిశ్వాస తీర్మానం. పార్లమెంట్ చరిత్రలో స్పీకర్‌పై అవిశ్వాసం అరుదైన పరిణామం. భారత ప్రధాన ప్రతిపక్షం తమకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. సభా నిర్వహణలో నిష్పాక్షికత స్పీకర్ పదవికి అలంకారం. ఆ పదవిపైనే అనుమానాలు వ్యక్తమవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. స్పీకర్ నిర్ణయాలు కేవలం సాంకేతిక ప్రక్రియలకే పరిమితం కాకూడదు. అవి ప్రజాస్వామిక చర్చలకు మార్గం సుగమం చేయాలి.

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ అంటే, అది ప్రభుత్వ పనితీరుపై సమగ్ర సమీక్షే. అదే సందర్భంలో దేశ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలపై విపక్షాలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నిలదీయవచ్చు. కానీ ప్రశ్నలకే తావులేని చర్చలతో అసమగ్రంగా పార్లమెంట్ ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో సమాధానం ఇచ్చినప్పటికీ, లోక్‌సభలో విస్తృత చర్చకు అవకాశం కల్పించలేదని ప్రతిపక్షం అంటోంది. ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వానికి పార్లమెంటే ప్రధాన వేదిక. అక్కడ ప్రశ్నలు ఎదుర్కొని సమాధానాలు ఇవ్వడం ప్రజాస్వామ్య రీతి, నీతి, రివాజు, పద్ధతి.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగాలకు అతి తక్కువ అవకాశాలే లభిస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. వాయిదా తీర్మానాలు, అత్యవసర చర్చల డిమాండ్లు తరచుగా తిరస్కరించబడుతున్నాయనేది ప్రతిపక్ష వాదన. అధికార, ప్రతిపక్షాల వానదలేమైనప్పటికీ, చర్చను నిర్మాణాత్మకంగా జరిగేవిదంగా ప్రవర్థించాల్సిన బాధ్యత ఇరు పక్షాలది. నియమావళి ప్రకారం లభ్యమయ్యే అవకాశాలను సమర్థంగా వినియోగించడం అవసరం.

ఈ సమావేశాల్లో విదేశాంగ, వాణిజ్య విధానాలు అతి ముఖ్యమైనవి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్‌తో చర్చలు కేవలం దౌత్యపరమైన నిర్ణయాలు మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే విధానాలు. దిగుమతులపై సుంకాలను తగ్గించడం, మార్కెట్‌ ను విస్తరించడం వంటి నిర్ణయాలు చిన్న, సన్నకారు రైతులు, వ్యాపారులు, ఉత్పత్తి రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రజలకు స్పష్టంగా తెలియాలి. ఆ భరోసా బాధ్యత ప్రభుత్వానిది. ఆ విధంగా చెప్పించడం ప్రతిపక్షానిది.

రష్యాతో చమురు కొనుగోళ్లు తగ్గించడం, అంతర్జాతీయ ఒత్తిడులు, అమెరికా వైఖరి వంటి అంశాలు కూడా చర్చకు రావాల్సినవే. విదేశాంగం అనేది కార్యనిర్వాహక శాఖ ప్రత్యేకాధికారం అయినప్పటికీ, ప్రజలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాల్లో పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతులు వంటి రంగాలపై ప్రభావం ఉంటే, ప్రజా ప్రతినిధుల వేదికపై సమగ్ర చర్చ తప్పనిసరి.

బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా కొత్తదనం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల పెంపు వంటివి మాటల్లో మాత్రమే కాక, ఫలితాల్లో కూడా ప్రతిఫలించాలి. బడ్జెట్ చర్చలు కేవలం ఆర్థిక గణాంకాల పరిమితిలో కాకుండా, సామాజిక ప్రభావాల కోణంలో కూడా సాగాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, మధ్యతరగతి భారం వంటి అంశాలు లోతుగా పరిశీలించబడాలి.

పార్లమెంట్ విలువ కేవలం చట్టాలు ఆమోదించడంలోనే కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఉంది. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం అసంపూర్ణం. అదే విధంగా బాధ్యతాయుత ప్రతిపక్షం లేకుండా చర్చ నాణ్యత పడిపోతుంది. ఇరుపక్షాలు కూడా తమ పాత్రను పునఃపరిశీలించాల్సిన సమయం ఇది. ప్రజల అనుమానాలు నివృత్తి చేయడం, విధానాలపై పారదర్శకత చూపించడం, విభిన్న అభిప్రాయాలను వినడం ఆవశ్యం. అర్థవంతమైన చర్చలు అనివార్యం. ఇవి ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News