Friday, July 17, 2026
26.4 C
Hyderabad

సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్ళ.. మారేదెప్పుడు?|EDITORIAL

సంక్షేమ హాస్టళ్ళు అందులో చదివే విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఉభయ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పిల్లలు మృత్యు ఒడికి చేరారు. కారణాలేవైనా సర్కార్‌ నిర్లక్ష్యం, అధికారుల అసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్షేమ హాస్టళ్ళే కాదు, విద్యారంగం విషయంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఓట్ల పథకాలపై ఉన్న శ్రద్ధ హాస్టళ్ళపై లేదు. విద్య, వైద్య అభివృద్ధిపై లేదు. పిల్లలను హాస్టళ్ళకు పంపిన తల్లి దండ్రులు క్షోభకు గురవుతున్నారు.

సాంఘిక, ఆర్థిక అసమానతల కారణంగా చదువులు అర్థాంతరంగా ఆగిపోకూడదన్న సంకల్పంతో గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటయ్యాయి. ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన, స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఎదిగే అవకాశాలను, సౌకర్యాలను పిల్లలకు అందిస్తూ ఉన్నత విద్యావంతులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అణగారిన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక అన్యాయం, దోపిడీల నుంచి వారిని రక్షించాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ వైద్య విధానాలతో విద్య అంగడి సరుకుగా మారిపోయింది. రాజ్యాంగం నిర్దేశించిన కర్తవ్యాల అమలు ఊసేలేదు. సరళీకరణ విధానాలతో కుటుంబాలు గడవడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో పేద, అణగారిన వర్గాలకు చెందిన లక్షల మందికిపైగా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లే ఆధారమవుతున్నాయి. వీటికి సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడం, డైట్‌ ఛార్జీలు చెల్లించకపోవడం ఆనవాయితీగా మారిపోయింది. మెనూ అమలు ఊసేలేదు. పౌష్టికాహారం అందకపోవడం, తాగునీటి కాలుష్యం, అపరిశుభ్రత తదితర కారణాల వల్ల తరచూ అతిసార, విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్‌ తదితర వ్యాధులకు గురవడం సర్వసాధారణమైపోయింది. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి.

తెలంగాణలో ఘనత వహించిన కేసీఆర్‌ పాలనలో హాస్టళ్ళు ఘనంగా వెలిగాయని, ఇప్పుడు హాస్టళ్ళలో మరణ మృదంగం మోగుతోందని ఇటీవలి కాలంలో కేటీఆర్‌ బృందం ఘోషించింది. మరి పదేళ్లలో హాస్టళ్లు బాగుంటే.. బాగుచేసి ఉంటే ఇప్పుడే ఎందుకు ఈ అధ్వాన్న పరిస్థితి వచ్చిందో వారు చెప్పలేకపోయారు. పదేళ్ల అధికారం మత్తులో అంతా బాగుందని ప్రచారం చేసుకున్నారు. బంగారు పళ్లెంలో పిల్లలు భోంచేస్తున్నారని బిల్డప్‌ ఇచ్చారు.

ఇప్పుడు రేవంత సర్కార్‌ కూడా అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉన్న స్కూళ్ళను గాలికి వదిలేసి, రకరకాల స్కూళ్ల పేరుతో ఊదరగొడుతోంది. ఉన్న స్కూళ్లనే అభివృద్ధి చేసి, పిల్లలను తల్లిదండ్రులకు చేరువ చేసి, హాస్టళ్లను తగ్గించాలన్న ప్రణాళిక ఉన్నట్లు చెప్పారు. కానీ అలా జరగలేదు. ఏపీలో చంద్రబాబు సమీక్షించని రంగం లేదు. అలాగే అడుగు ముందుకు పడిన దాఖలాలు కూడా లేవు. ఏళ్ల తరబడి కలుషిత నీరు తాగుతున్నా, మెనూ ప్రకారం ఆహారం అందకపోయినా, హైకోర్టు చీవాట్లు పెట్టినా పరిస్థితుల్లో మార్పేమీ రావడం లేదు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల ఓ గిరిజన హాస్టల్‌లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మంత్రులు వెళ్లి పరామర్శించారు. హాస్టళ్లను తనిఖీ చేశారు. కానీ మార్పు లేదు. పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగడం వల్లే 9, 10 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న 611 మంది బాలికల్లో 140 మంది పచ్చకామెర్లకు గురై జిల్లా కేంద్ర, విశాఖ కెజిహెచ్‌లలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులకు తగిననన్ని మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు లేకపోతే ఎలా? అవసాన దశలో ఉన్న హాస్టల్‌ భవనాలు కూలిపోతే విద్యార్థులేం కావాలి? మన ఇంట్లో పిల్లల్ని నేలపై పడుకో బెడతామా? ఏటా ప్రభుత్వం కేటాయించే కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి? పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదనడానికి కురుపాం హాస్టల్‌ దుస్థితే నిదర్శనం. ఆర్‌ఒ సిస్టమ్‌ పాడై, పరిశుభ్రమైన తాగునీరు అందుబాట్లో లేకపోవడమే విద్యార్థినుల ప్రాణాంతక పచ్చకామెర్లకు ప్రధాన కారణం. పిల్లలు ఇళ్ల వద్ద చనిపోతే ప్రభుత్వానిది బాధ్యతెలా అవుతుందని, నష్టపరిహారం ఎలా ఇస్తామని పార్వతీపురం జిల్లాకే చెందిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఇదీ సంక్షేమ మంత్రి సామాజిక బాధ్యత.

పిల్లలకు, వృద్ధులకు హాస్టళ్లు ఉన్నాయని, పశువులకు కూడా హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. నోరున్న పిల్లల హాస్టళ్లను మెరుగుచేయకుండా పశువులకు హాస్టల్‌ అనడం సమంజసమేనా? ఆర్థిక, సామాజిక అంతరాలకు అతీతంగా నవతరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు కార్యాచరణలోకి దిగితేనే ఇటువంటి పరిస్థితులను అధిగమించగలం. ఆ దిశగా ప్రజలంతా సంఘటితంగా ఒత్తిడి తేవాలి. ప్రభుత్వాలు కూడా ఇంకా ఎంతోకాలం మభ్య పెట్టే పనులు మానుకోవాలి. స్కూళ్లను బలోపేతం చేసే యత్నాలు ముమ్మరం చేయాలి. నిధులు కేటాయించాలి. అప్పుడే భావితరం ఆరోగ్యవంతంగా చదువుకుని సమాజంలోకి అడుగపెట్టగలదు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News