Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్ళ.. మారేదెప్పుడు?|EDITORIAL

సంక్షేమ హాస్టళ్ళు అందులో చదివే విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఉభయ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పిల్లలు మృత్యు ఒడికి చేరారు. కారణాలేవైనా సర్కార్‌ నిర్లక్ష్యం, అధికారుల అసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్షేమ హాస్టళ్ళే కాదు, విద్యారంగం విషయంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఓట్ల పథకాలపై ఉన్న శ్రద్ధ హాస్టళ్ళపై లేదు. విద్య, వైద్య అభివృద్ధిపై లేదు. పిల్లలను హాస్టళ్ళకు పంపిన తల్లి దండ్రులు క్షోభకు గురవుతున్నారు.

సాంఘిక, ఆర్థిక అసమానతల కారణంగా చదువులు అర్థాంతరంగా ఆగిపోకూడదన్న సంకల్పంతో గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటయ్యాయి. ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన, స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఎదిగే అవకాశాలను, సౌకర్యాలను పిల్లలకు అందిస్తూ ఉన్నత విద్యావంతులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అణగారిన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక అన్యాయం, దోపిడీల నుంచి వారిని రక్షించాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ వైద్య విధానాలతో విద్య అంగడి సరుకుగా మారిపోయింది. రాజ్యాంగం నిర్దేశించిన కర్తవ్యాల అమలు ఊసేలేదు. సరళీకరణ విధానాలతో కుటుంబాలు గడవడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో పేద, అణగారిన వర్గాలకు చెందిన లక్షల మందికిపైగా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లే ఆధారమవుతున్నాయి. వీటికి సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడం, డైట్‌ ఛార్జీలు చెల్లించకపోవడం ఆనవాయితీగా మారిపోయింది. మెనూ అమలు ఊసేలేదు. పౌష్టికాహారం అందకపోవడం, తాగునీటి కాలుష్యం, అపరిశుభ్రత తదితర కారణాల వల్ల తరచూ అతిసార, విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్‌ తదితర వ్యాధులకు గురవడం సర్వసాధారణమైపోయింది. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి.

తెలంగాణలో ఘనత వహించిన కేసీఆర్‌ పాలనలో హాస్టళ్ళు ఘనంగా వెలిగాయని, ఇప్పుడు హాస్టళ్ళలో మరణ మృదంగం మోగుతోందని ఇటీవలి కాలంలో కేటీఆర్‌ బృందం ఘోషించింది. మరి పదేళ్లలో హాస్టళ్లు బాగుంటే.. బాగుచేసి ఉంటే ఇప్పుడే ఎందుకు ఈ అధ్వాన్న పరిస్థితి వచ్చిందో వారు చెప్పలేకపోయారు. పదేళ్ల అధికారం మత్తులో అంతా బాగుందని ప్రచారం చేసుకున్నారు. బంగారు పళ్లెంలో పిల్లలు భోంచేస్తున్నారని బిల్డప్‌ ఇచ్చారు.

ఇప్పుడు రేవంత సర్కార్‌ కూడా అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉన్న స్కూళ్ళను గాలికి వదిలేసి, రకరకాల స్కూళ్ల పేరుతో ఊదరగొడుతోంది. ఉన్న స్కూళ్లనే అభివృద్ధి చేసి, పిల్లలను తల్లిదండ్రులకు చేరువ చేసి, హాస్టళ్లను తగ్గించాలన్న ప్రణాళిక ఉన్నట్లు చెప్పారు. కానీ అలా జరగలేదు. ఏపీలో చంద్రబాబు సమీక్షించని రంగం లేదు. అలాగే అడుగు ముందుకు పడిన దాఖలాలు కూడా లేవు. ఏళ్ల తరబడి కలుషిత నీరు తాగుతున్నా, మెనూ ప్రకారం ఆహారం అందకపోయినా, హైకోర్టు చీవాట్లు పెట్టినా పరిస్థితుల్లో మార్పేమీ రావడం లేదు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల ఓ గిరిజన హాస్టల్‌లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మంత్రులు వెళ్లి పరామర్శించారు. హాస్టళ్లను తనిఖీ చేశారు. కానీ మార్పు లేదు. పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగడం వల్లే 9, 10 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న 611 మంది బాలికల్లో 140 మంది పచ్చకామెర్లకు గురై జిల్లా కేంద్ర, విశాఖ కెజిహెచ్‌లలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులకు తగిననన్ని మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు లేకపోతే ఎలా? అవసాన దశలో ఉన్న హాస్టల్‌ భవనాలు కూలిపోతే విద్యార్థులేం కావాలి? మన ఇంట్లో పిల్లల్ని నేలపై పడుకో బెడతామా? ఏటా ప్రభుత్వం కేటాయించే కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి? పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదనడానికి కురుపాం హాస్టల్‌ దుస్థితే నిదర్శనం. ఆర్‌ఒ సిస్టమ్‌ పాడై, పరిశుభ్రమైన తాగునీరు అందుబాట్లో లేకపోవడమే విద్యార్థినుల ప్రాణాంతక పచ్చకామెర్లకు ప్రధాన కారణం. పిల్లలు ఇళ్ల వద్ద చనిపోతే ప్రభుత్వానిది బాధ్యతెలా అవుతుందని, నష్టపరిహారం ఎలా ఇస్తామని పార్వతీపురం జిల్లాకే చెందిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఇదీ సంక్షేమ మంత్రి సామాజిక బాధ్యత.

పిల్లలకు, వృద్ధులకు హాస్టళ్లు ఉన్నాయని, పశువులకు కూడా హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. నోరున్న పిల్లల హాస్టళ్లను మెరుగుచేయకుండా పశువులకు హాస్టల్‌ అనడం సమంజసమేనా? ఆర్థిక, సామాజిక అంతరాలకు అతీతంగా నవతరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు కార్యాచరణలోకి దిగితేనే ఇటువంటి పరిస్థితులను అధిగమించగలం. ఆ దిశగా ప్రజలంతా సంఘటితంగా ఒత్తిడి తేవాలి. ప్రభుత్వాలు కూడా ఇంకా ఎంతోకాలం మభ్య పెట్టే పనులు మానుకోవాలి. స్కూళ్లను బలోపేతం చేసే యత్నాలు ముమ్మరం చేయాలి. నిధులు కేటాయించాలి. అప్పుడే భావితరం ఆరోగ్యవంతంగా చదువుకుని సమాజంలోకి అడుగపెట్టగలదు.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News