Monday, August 10, 2026
29.8 C
Hyderabad

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త వేదికలు, కొత్త నాయకత్వం, కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ మార్పును రాజకీయ పార్టీలు అర్థం చేసుకోకపోతే వాటి సామాజిక ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతుంది.

నీట్ ఉద్యమం ముగిసిందని సమస్య సమసిపోయిందని భావించడం పొరపాటు. అసలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్రజల ఆవేదనను విని, పరిష్కరించగలిగే వ్యవస్థను నిర్మించగలమా? లేదంటే రేపటి ఉద్యమాలు మరింత తీవ్రంగా, విస్తృతమవుతాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఎన్నికలు గెలవడం ఒక పార్టీకి ప్రభుత్వ అధికారాన్ని ఇస్తుంది. అయితే ఆ అధికారానికి చట్టబద్ధతను, నైతికతను అందించేది జవాబుదారీతనమే. ప్రజలు లేవనెత్తిన సమస్యలకు సమయానికి స్పందించడం, నిర్ణయాల్లో పారదర్శకత పాటించడం, తప్పు జరిగితే బాధ్యత వహించడం ఇవే ప్రజాస్వామ్యానికి జీవం పోసే విలువలు. ఈ విలువలు బలహీనపడినప్పుడల్లా ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికుతుంది. చివరికి అదే ప్రజా ఉద్యమాలకు దారితీస్తుంది. ఇటీవలి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలు, ఆగ్రహాలు కూడా ఇదే కోవకు చెందినది. పాలనలో పెరుగుతున్న జవాబుదారీతన లోపానికి వచ్చిన హెచ్చరిక.

దేశంలో వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ అత్యంత కీలకమైన పరీక్ష. ఇలాంటి పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్ష నిర్వహణపై అనుమానాలు తలెత్తడం లక్షలాది కుటుంబాల్లో ఆందోళన కలిగించింది. అయితే ప్రజల్లో ఆగ్రహానికి కారణం ఒక్క ఈ ఘటన మాత్రమే కాదు. ప్రభుత్వాల స్పందనలో జాప్యం, వ్యవస్థలపై తగ్గుతున్న విశ్వాసం, తప్పు జరిగినప్పుడు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం కూడా దీనికి ప్రధాన కారణాలు.

దేశంలో అనేక సమస్యలున్నాయి. జీఎస్టీ అమలై ఎనిమిదేళ్లు దాటినా చిన్న వ్యాపారులు ఇప్పటికీ పన్ను విధానంలో సరళీకరణ కోరుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం తరచూ సాధారణ కుటుంబాల బడ్జెట్‌ను దెబ్బతీస్తోంది. నిరుద్యోగం యువతలో ఆందోళన పెంచుతోంది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. పెట్రో, డీజిల్, నిత్యావసర, మందుల ధరలు, అవినీతి పెరుగుదల, ప్రభుత్వ సేవల ఆలస్యం వంటి సమస్యలు ప్రజలను నిరంతరం ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలన్నింటిలో ఒకే సామ్యముంది. అది సకాలంలో ప్రభుత్వ స్పందన లేకపోవడం. ప్రజలు కోరేది అసాధ్యమైన హామీలు కాదు. వేగవంతమైన నిర్ణయాలు, స్పష్టమైన చర్యలు మాత్రమే.

ఇప్పటి యువత స్వభావం గత తరాలతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. డిజిటల్ యుగంలో పెరుగుతోన్న ఈ తరం సమాచారం కోసం ఎదురు చూడదు. ఏ అన్యాయం జరిగినా క్షణాల్లో దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లే సామర్థ్యం సామాజిక మాధ్యమాలకు ఉంది. ఒకప్పుడు పెద్ద రాజకీయ పార్టీలకే పరిమితమైన ప్రజా ఉద్యమాలు, ఇప్పుడు చిన్న పౌర వేదికల నుంచే ప్రారంభమవుతున్నాయి. లక్షలాది మంది యువత ఒకే అంశంపై ఏకమైతే, ఆ ఉద్యమాన్ని సంప్రదాయ రాజకీయ ప్రమాణాలతో అంచనా వేయడం సాధ్యం కాదు. ఇదే నీట్ ఉద్యమం చెప్పిన అతిపెద్ద సందేశం.

దేశంలో రాజకీయ పార్టీల వైఫల్యాన్ని కూడా విస్మరించలేం. ప్రజల సమస్యలను ముందుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయి. మరోవైపు అధికార పక్షం ప్రజల ప్రశ్నలకు తక్షణ సమాధానం ఇవ్వకుండా, విమర్శలను రాజకీయ కోణంలోనే చూస్తోంది. ఫలితంగా ప్రజలకు తమ సమస్యలను వినిపించేందుకు వీధులే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.

పార్లమెంట్ దేశ ప్రజల అత్యున్నత చర్చా వేదిక. కానీ ఇటీవలి సమావేశాలను పరిశీలిస్తే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాల కంటే రాజకీయ ప్రయోజనాలు, పరస్పర ఆరోపణలు, సభా స్తంభనలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన విలువైన సమయం, ప్రజల పన్నులతో నడిచే పార్లమెంట్ ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా నిలవాలి. అధికార పక్షం సమాధానాలు ఇవ్వాలి. ప్రతిపక్షం ప్రత్యామ్నాయాలు సూచించాలి. కానీ ఈ రెండు బాధ్యతలు సక్రమంగా నెరవేరనప్పుడు ప్రజల్లో వ్యవస్థలపైనే కాక, పార్టీలపైనా అనుమానాలు, అసహనం పెరగడం సహజం.

రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక యంత్రాంగం, చట్టసభలు, దర్యాప్తు సంస్థలు అన్నీ ప్రజల విశ్వాసాన్ని కాపాడే విధంగా పనిచేయాలి. తప్పు జరిగితే దానిని కప్పిపుచ్చే ప్రయత్నం కాకుండా, వెంటనే నిర్ధారించి చర్యలు తీసుకోవాలి. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో అసహనాన్నే కలిగిస్తాయి.

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త వేదికలు, కొత్త నాయకత్వం, కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ మార్పును రాజకీయ పార్టీలు అర్థం చేసుకోకపోతే వాటి సామాజిక ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతుంది.

ప్రభుత్వాలు కూడా ఒక వాస్తవాన్ని గుర్తించాలి. సామాజిక మాధ్యమాలు విస్తరించిన ఈ కాలంలో ఏ సమస్యనైనా ఎక్కువకాలం దాచిపెట్టడం, ప్రజల్ని మభ్య పెట్టడం ఎంతమాత్రం సాధ్యం కాదు. సమాచారం క్షణాల్లో వ్యాపిస్తుంది. అందుకే పాలనలో పారదర్శకత, వేగం, బాధ్యత మరింత పెరగాలి. ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వాలు విలాసవంతమైన పాలనకు కాదు, జవాబుదారీతనానికి ప్రతీకలుగా నిలవాలి. ప్రజలను భయపెట్టి ప్రభుత్వాలని నడపలేరు.

నీట్ ఉద్యమం ముగిసిందని సమస్య సమసిపోయిందని భావించడం పొరపాటు. అసలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్రజల ఆవేదనను విని, పరిష్కరించగలిగే వ్యవస్థను నిర్మించగలమా? లేదంటే రేపటి ఉద్యమాలు మరింత తీవ్రంగా, విస్తృతమవుతాయి.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News