Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

ఈసారీ బడ్జెట్ ‘కోత’లేనా!?|EDITORIAL

బడ్జెట్ అంటే ఆదాయ, వ్యయాల పట్టిక మాత్రమే కాదు. భవిష్యత్తును నిర్ణయించే దిశానిర్దేశ ప్రణాళిక. కానీ, బడ్జెట్ అంటే కేవలం పన్నులు, రాయితీలు, కోతలు, కేటాయింపులుగా మారిపోయింది. బడ్జెట్ కేటాయింపుల్లో కామన్ మ్యాన్ కనిపించకుండా పోతున్నాడు. వృద్ధి శాతం, జీడీపీ అంచనాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు వినిపిస్తాయి. కానీ, నిరుద్యోగం, అప్పుల భారం, గిట్టుబాటు లేని రైతుల ఆత్మహత్యలు ఈ గణాంకాల్లో గల్లంతవుతున్నాయి.

దేశ భవితకు మూలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థే. జనాభాలో 65% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అయినా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు దక్కుతున్న ప్రాధాన్యం తక్కువే. వ్యవసాయాధారిత దేశంలో రైతులకు దిక్కులేకుండా పోతోంది.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.33.8 లక్షల కోట్లకు చేరింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 66.7 శాతం. ఇందులో రెవెన్యూ వ్యయాలు రూ.25.93 లక్షల కోట్లు కాగా, పెట్టుబడి వ్యయాలు రూ.7.87 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఉత్పాదక పెట్టుబడుల కంటే నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి.

రెవెన్యూ వ్యయాల్లో వడ్డీ చెల్లింపులకే రూ.9.11 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇది మొత్తం వ్యయాల్లో 27 శాతం. ప్రధాన రాయితీలకు రూ.3.17 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయి. అప్పులపై అప్పులు చేసుసుకుంటూ, వాటికి వడ్డీలు చెల్లిస్తూ దేశం ఒక ఆర్థిక చక్రవ్యూహంలో చిక్కుకుంటోంది.

గతేడాది డిసెంబరు చివరి నాటికి ప్రభుత్వానికి రూ.25.25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 72.2%. ఇందులో రూ.19.39 లక్షల కోట్లు పన్నుల ద్వారా, రూ.5.39 లక్షల కోట్లు పన్నేతర ఆదాయంగా సమకూరాయి. రుణ రహిత పెట్టుబడి సాధనాల ద్వారా రూ.46,047 కోట్లు వచ్చాయి. అంటే ఆదాయం ఉన్నప్పటికీ నియంత్రణలేని వ్యయాలే ద్రవ్యలోటును పెంచుతున్నాయి.

2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.4 శాతంగా లేదా రూ.15.69 లక్షల కోట్లుగా అంచనా వేసింది. డిసెంబరు చివరి నాటికే ద్రవ్యలోటు రూ.8.55 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఇది వార్షిక లక్ష్యంలో 54.5%. గతేడాది ఇదే సమయంలో ఇది 56.7 శాతంగా ఉంది. స్వల్ప మెరుగుదల కనిపించినా, అదుపులేని వ్యయం అలాగే ఉంది.

ఇందులో రాజకీయ నాయకుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, విమాన ప్రయాణాలు, నివాస సౌకర్యాలు రెవెన్యూ వ్యయాల్లో కీలకంగా మారాయి. గత ప్రభుత్వాలతో సహా, పదేళ్లుగా మోదీ కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్నప్పుడు, అధికార వర్గాల ఖర్చులపై నియంత్రణ ఎందుకు సాధ్యం కావడం లేదు?

మధ్యతరగతి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుపై ఆశలు ఉన్నప్పటికీ, అదుపులేని ధరలు ఆ లాభాన్ని మింగేస్తోస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, బ్యాంకుల సేవా రుసుములు, క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, కనీస బ్యాలెన్స్ నిబంధనలు ప్రతి నెలా సామాన్యుడి ఖర్చులను పెంచుతున్నాయి.

బడ్జెట్ సంప్రదాయాల్లో మార్పులు వచ్చినా, దృక్పథంలో మార్పు రావడం లేదు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం విధాన పరంగా సరైన నిర్ణయమే. కానీ ఆ ముందస్తు బడ్జెట్ వల్ల పథకాలు వేగంగా అమలవుతున్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతోందా?

దేశం నిజంగా ఆర్థికంగా గట్టెక్కాలంటే కాకిలెక్కల కోలాహలం. గణాంకాల మాయాజాలం కాదు. కఠినమైన సంస్కరణలు అవసరం. వృథా ఖర్చులకు కత్తెర వేయాలి. రాజకీయ వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ రావాలి. ఉత్పాదక పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే బడ్జెట్ లెక్కల పద్దుగా కాకుండా, సామాన్యుడి జీవితాన్ని మార్చే సాధనంగా మారుతుంది.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News