Sunday, March 15, 2026
35.3 C
Hyderabad

ఎరుపెక్కిన వెలిశాల!|VELISHALA

  • MAOIST| మవోయిస్టులతో DISCUSSION| చర్చలు జరపాల్సిందే!

  • ప్రజాగ్రహానికి CENTRAL GOVERNMENT| కేంద్రం గురికాక తప్పదు!!

-శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

  • అణచివేతతో ఉద్యమం ఆగదు

  • అమరుల త్యాగం వృథా కాదు

GAJARLA RAVI| గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు

భూపాలపల్లి, జూన్ 28(అడుగు న్యూస్):
సమాజంలోని అణగారిన వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుక గాజర్ల రవి అని, ఆయన మరణంతో మూగబోయిందని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అంతం చేయాలనే ప్రభుత్వాలు.. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

శనివారం, భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెలిశాల గ్రామంలో వారి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోనల్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్, ఉదయ్ సంస్మరణ సభను నిర్వహించగా, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, సానుభూతిపరులు, ప్రజలు గణేష్ కు జోహార్ అంటూ.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గాజర్ల కుటుంబంలో ఉద్యమ నాయకులు ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేశారని కొనియాడారు. గాజర్ల రవి వేల మంది గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల సానుభూతిని సంపాదించాడని తెలిపారు సమాజంలో మారణ హోమం పాల్పడితే ప్రజా గొంతుకలు వెలిగెత్తి చాటుతాయని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా, పౌర హక్కుల, విప్లవ సంఘాలు మావోయిస్టుతో చర్చలు జరపాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అంతరాలు లేని దోపిడీ వ్యవస్థ అవినీతి, కుల, మతతత్వం లేని సమాజం కోసం ఉద్యమకారులు పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించేందుకు పేద అణగారిన ప్రజానీకం కోసం అహర్నిశలు ఉద్యమం చేస్తున్న వారి ప్రాణాలు బలి తీసుకోవడం అమానుషమైన చర్య అని అన్నారు. సమాజంలో పేదలకు విద్యా వైద్యం సమ సమాజ స్థాపన కలిగినప్పుడే సంపద అందరికీ దక్కాలని ఉద్దేశంతో ప్రతి మనిషిని సమానంగా జీవించే హక్కు కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జంతువుల మాదిరిగా వెంటాడి వేటాడి మనుషులను చంపే సంస్కృతి దేశానికి మంచిది కాదని హితవు పలికారు.

నిర్బంధ వేదిక నాయకుడు రవి చందర్ మాట్లాడుతూ, ప్రజా పోరాటంలో అమరుల త్యాగం వృథా కాదని, విప్లవోద్యమంలో అణచివేత మంచిది కాదని, ఉద్యమకారులను శవాలుగా అప్పగించడాన్ని సమ సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విప్లవోద్యమం అయిపోయిందనే భ్రమలో ఉందని వెలిశాల సంస్మరణ సభలో జన వాహిని చూసి ఉద్యమం మరణం లేనిదని అర్థం చేసుకోవాలని సూచించారు .కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సహజ సంపదను కార్పొరేట్ వ్యవస్థకు దోచి పెట్టేందుకే నక్సలిజాన్ని అంతమొందించేందుకు కుట్రలు పండుతుందని ఆరోపించారు. లక్షలాదిమంది సాయుధ పోలీసు బలగాలను మోహరించి అన్యాయంగా ఉద్యమకారులపై దాడులు చేసి అమానుషంగా చంపి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదన్నారు. సమాజంలో అణచివేత దోపిడీ, నిర్బంధం ఉన్నంత కాలం ఉద్యమం ఆగదని అన్నారు.

సంస్మరణ సభలో అమరుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ చిత్రపటానికి శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, స్టేట్ క్రెడిట్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గద్దర్ కుమారుడు సూర్యం, భారత్ బచావో వేదిక నాయకుడు గాదె ఇన్నయ్య, బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మ కుమారి, మా భూమి సంధ్య తోపాటు అభిమానులు బంధుమిత్రుల కమిటీ సభ్యులు విరసం పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/9FpcQcZik_A?feature=shared

Latest News

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News