Wednesday, July 29, 2026
22.6 C
Hyderabad

ఎరుపెక్కిన వెలిశాల!|VELISHALA

  • MAOIST| మవోయిస్టులతో DISCUSSION| చర్చలు జరపాల్సిందే!

  • ప్రజాగ్రహానికి CENTRAL GOVERNMENT| కేంద్రం గురికాక తప్పదు!!

-శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

  • అణచివేతతో ఉద్యమం ఆగదు

  • అమరుల త్యాగం వృథా కాదు

GAJARLA RAVI| గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు

భూపాలపల్లి, జూన్ 28(అడుగు న్యూస్):
సమాజంలోని అణగారిన వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుక గాజర్ల రవి అని, ఆయన మరణంతో మూగబోయిందని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అంతం చేయాలనే ప్రభుత్వాలు.. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

శనివారం, భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెలిశాల గ్రామంలో వారి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోనల్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్, ఉదయ్ సంస్మరణ సభను నిర్వహించగా, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, సానుభూతిపరులు, ప్రజలు గణేష్ కు జోహార్ అంటూ.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గాజర్ల కుటుంబంలో ఉద్యమ నాయకులు ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేశారని కొనియాడారు. గాజర్ల రవి వేల మంది గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల సానుభూతిని సంపాదించాడని తెలిపారు సమాజంలో మారణ హోమం పాల్పడితే ప్రజా గొంతుకలు వెలిగెత్తి చాటుతాయని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా, పౌర హక్కుల, విప్లవ సంఘాలు మావోయిస్టుతో చర్చలు జరపాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అంతరాలు లేని దోపిడీ వ్యవస్థ అవినీతి, కుల, మతతత్వం లేని సమాజం కోసం ఉద్యమకారులు పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించేందుకు పేద అణగారిన ప్రజానీకం కోసం అహర్నిశలు ఉద్యమం చేస్తున్న వారి ప్రాణాలు బలి తీసుకోవడం అమానుషమైన చర్య అని అన్నారు. సమాజంలో పేదలకు విద్యా వైద్యం సమ సమాజ స్థాపన కలిగినప్పుడే సంపద అందరికీ దక్కాలని ఉద్దేశంతో ప్రతి మనిషిని సమానంగా జీవించే హక్కు కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జంతువుల మాదిరిగా వెంటాడి వేటాడి మనుషులను చంపే సంస్కృతి దేశానికి మంచిది కాదని హితవు పలికారు.

నిర్బంధ వేదిక నాయకుడు రవి చందర్ మాట్లాడుతూ, ప్రజా పోరాటంలో అమరుల త్యాగం వృథా కాదని, విప్లవోద్యమంలో అణచివేత మంచిది కాదని, ఉద్యమకారులను శవాలుగా అప్పగించడాన్ని సమ సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విప్లవోద్యమం అయిపోయిందనే భ్రమలో ఉందని వెలిశాల సంస్మరణ సభలో జన వాహిని చూసి ఉద్యమం మరణం లేనిదని అర్థం చేసుకోవాలని సూచించారు .కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సహజ సంపదను కార్పొరేట్ వ్యవస్థకు దోచి పెట్టేందుకే నక్సలిజాన్ని అంతమొందించేందుకు కుట్రలు పండుతుందని ఆరోపించారు. లక్షలాదిమంది సాయుధ పోలీసు బలగాలను మోహరించి అన్యాయంగా ఉద్యమకారులపై దాడులు చేసి అమానుషంగా చంపి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదన్నారు. సమాజంలో అణచివేత దోపిడీ, నిర్బంధం ఉన్నంత కాలం ఉద్యమం ఆగదని అన్నారు.

సంస్మరణ సభలో అమరుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ చిత్రపటానికి శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, స్టేట్ క్రెడిట్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గద్దర్ కుమారుడు సూర్యం, భారత్ బచావో వేదిక నాయకుడు గాదె ఇన్నయ్య, బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మ కుమారి, మా భూమి సంధ్య తోపాటు అభిమానులు బంధుమిత్రుల కమిటీ సభ్యులు విరసం పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/9FpcQcZik_A?feature=shared

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News