Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

ఎరుపెక్కిన వెలిశాల!|VELISHALA

  • MAOIST| మవోయిస్టులతో DISCUSSION| చర్చలు జరపాల్సిందే!

  • ప్రజాగ్రహానికి CENTRAL GOVERNMENT| కేంద్రం గురికాక తప్పదు!!

-శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

  • అణచివేతతో ఉద్యమం ఆగదు

  • అమరుల త్యాగం వృథా కాదు

GAJARLA RAVI| గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు

భూపాలపల్లి, జూన్ 28(అడుగు న్యూస్):
సమాజంలోని అణగారిన వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుక గాజర్ల రవి అని, ఆయన మరణంతో మూగబోయిందని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అంతం చేయాలనే ప్రభుత్వాలు.. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

శనివారం, భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెలిశాల గ్రామంలో వారి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోనల్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్, ఉదయ్ సంస్మరణ సభను నిర్వహించగా, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, సానుభూతిపరులు, ప్రజలు గణేష్ కు జోహార్ అంటూ.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గాజర్ల కుటుంబంలో ఉద్యమ నాయకులు ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేశారని కొనియాడారు. గాజర్ల రవి వేల మంది గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల సానుభూతిని సంపాదించాడని తెలిపారు సమాజంలో మారణ హోమం పాల్పడితే ప్రజా గొంతుకలు వెలిగెత్తి చాటుతాయని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా, పౌర హక్కుల, విప్లవ సంఘాలు మావోయిస్టుతో చర్చలు జరపాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అంతరాలు లేని దోపిడీ వ్యవస్థ అవినీతి, కుల, మతతత్వం లేని సమాజం కోసం ఉద్యమకారులు పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించేందుకు పేద అణగారిన ప్రజానీకం కోసం అహర్నిశలు ఉద్యమం చేస్తున్న వారి ప్రాణాలు బలి తీసుకోవడం అమానుషమైన చర్య అని అన్నారు. సమాజంలో పేదలకు విద్యా వైద్యం సమ సమాజ స్థాపన కలిగినప్పుడే సంపద అందరికీ దక్కాలని ఉద్దేశంతో ప్రతి మనిషిని సమానంగా జీవించే హక్కు కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జంతువుల మాదిరిగా వెంటాడి వేటాడి మనుషులను చంపే సంస్కృతి దేశానికి మంచిది కాదని హితవు పలికారు.

నిర్బంధ వేదిక నాయకుడు రవి చందర్ మాట్లాడుతూ, ప్రజా పోరాటంలో అమరుల త్యాగం వృథా కాదని, విప్లవోద్యమంలో అణచివేత మంచిది కాదని, ఉద్యమకారులను శవాలుగా అప్పగించడాన్ని సమ సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విప్లవోద్యమం అయిపోయిందనే భ్రమలో ఉందని వెలిశాల సంస్మరణ సభలో జన వాహిని చూసి ఉద్యమం మరణం లేనిదని అర్థం చేసుకోవాలని సూచించారు .కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సహజ సంపదను కార్పొరేట్ వ్యవస్థకు దోచి పెట్టేందుకే నక్సలిజాన్ని అంతమొందించేందుకు కుట్రలు పండుతుందని ఆరోపించారు. లక్షలాదిమంది సాయుధ పోలీసు బలగాలను మోహరించి అన్యాయంగా ఉద్యమకారులపై దాడులు చేసి అమానుషంగా చంపి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదన్నారు. సమాజంలో అణచివేత దోపిడీ, నిర్బంధం ఉన్నంత కాలం ఉద్యమం ఆగదని అన్నారు.

సంస్మరణ సభలో అమరుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ చిత్రపటానికి శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, స్టేట్ క్రెడిట్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గద్దర్ కుమారుడు సూర్యం, భారత్ బచావో వేదిక నాయకుడు గాదె ఇన్నయ్య, బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మ కుమారి, మా భూమి సంధ్య తోపాటు అభిమానులు బంధుమిత్రుల కమిటీ సభ్యులు విరసం పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/9FpcQcZik_A?feature=shared

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News