Sunday, July 26, 2026
28.1 C
Hyderabad

అమరావతి అజరామర నగరం కావాలి!

అమరావతి నగరం సాకారం కాబోతున్నది. ఏడాది కాలంగా సీఎం చంద్రాబు అమరావతి పునర్నిర్మాణానికి అహర్నిశలు కష్టపడడంతో ఆంధ్రప్రదేశ్‌ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రధాని మోడీ పునర్నిర్మాణ పనుల్లో పాల్గొనడంతో వేగం పెరిగింది. నిజానికి జగన్‌ తన ఐదేళ్ల పదవీకాలంలో అమరావతిని నిర్మించివుంటే ఆయన్ని చరిత్ర గుర్తించేది. కానీ, ఇప్పుడు అమరావతి చరిత్రలో జగన్‌ తనకు చోటు లేకుండా చేసుకున్నారు. అంతేగాకుండా మూడు రాజధానులు అంటూ ఐదేళ్లూ కాలం వెళ్లదీసారు. ఈ లోగా కాలంతోపాటు ప్రజలు కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారు.

నిజానికి చంద్రబాబు విజన్‌కు జగన్‌ ఆలోచనకు ఎంతో తేడా ఉంది. చంద్రబాబును కాదని ఒక్క ఛాన్స్‌ అని అభ్యర్థించిన జగన్‌కు ప్రజలు పట్టం కట్టారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఓ పదేళ్లు వెనక్కి పోవడమే గాకుండా అప్పులకుప్పగా మారింది. అప్పులు చేసిన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టారు. యువకుడైన జగన్‌కు నిజంగానే మంచి ఆలోచనలు ఉండివుంటే ఎపి భవిష్యత్‌ మరోలా ఉండేది. విజన్‌ ఉండాలి. పట్టుదల ఉండాలి. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పనులు చేయగలగాలి. బటన్‌ నొక్కి అప్పులు చేసిన జగన్‌ విజన్‌ లేని నేతగానే నిలిచిపోయాడని చెప్పాలి. అయితే, ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు సమిష్టి ప్రయోజనాలు కూడా ఆశిస్తారు. విద్య, వైద్యం, నీరు, రోడ్లు వంటి సౌకర్యాలపై ప్రభుత్వాల ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతుండాలి. ఇవేవీ లేకపోగా, ప్రజలపై అప్పుల భారం పడింది. ప్రతీకార కేసులు ప్రజల్ని కూడా విసిగించాయి. ప్రజలు మరోసారి మార్పును కోరుకున్నారు. అందుకే మళ్లీ అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని తెలుగుదేశం కూటమి హావిూ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో అది సాకారం కాబోతున్నది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత పదేళ్లుగా రాజధాని లేకుండా పోయింది. అమరావతిని దెబ్బతీసే ప్రయత్నంలో జగన్‌ రాజధాని లేకుండా చేశారన్న అపవాదుని మూటగట్టుకున్నారు. మూడు రాజధానుల సంగతి పక్కన పెడితే అసలు రాజధానే లేకుండా పోయింది. తల లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గత ఐదేళ్లుగా కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకణ వేరు, రాజధాని వేరు అన్న స్పృహలో లేకుండా జగన్‌ పాలన సాగించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన పలువురు రైతులు, మహిళలు కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. కేసులతో వారిని కోర్టులకే పరిమితం చేస్తే ఇక ఉద్యమంలో కనిపించరన్న ఎత్తుగడతో గత పాలన సాగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న చందంగా కేసులకు కొదవ లేకుండా పోయింది. జగన్‌ తన ఐదేళ్ల పాలనాకాలంలో కనీసం రైతులతో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది.

విభజనకు గురైన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనివార్యంగా ఇప్పుడు కొత్త రాజధానికి శ్రీకారం చుడుతోంది. ఓ ఐదేళ్ల తరవాత అమరావతితో ఏపీ రూపురేఖలు మారనున్నయి. ఓ అద్భుత నగరం ఆవిష్కృతం అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ తెలుగు వారికి ఒక విద్యా, వ్యాపార, నివాస, ఉపాధి, ఆదాయ వనరుగా మారిపోయింది. హైదరాబాద్ లాంటి నగరం ఒక్కటి కూడా ఏపీలో లేకుండా పోయింది. విశాఖపట్నం, విజయవాడ నగరాలు హైదరాబాద్ స్థాయి నగరాలు కావు కనుకనే చంద్రబాబు కొత్త రాజధానికి శ్రీకారం చుడుతున్నారు. విశాలమైన సముద్ర తీరంతో పాటు, పలు విమానాశ్రయాలు, ఓడరేవులు ఉన్న ఏపీ ఇక అమరావతితో మరింతగా అలరారడం ఖాయంగా కనిపిస్తున్నది. హైదరాబాద్‌ లాంటి విస్తృత అవకాశాలు గల ఒక నగరం ఆంధ్రకు లేని లోటును అమరావతి తీర్చనుందనడంలో సందేహం లేదు. అంతేకాదు అంతర్జాతీయనగరంగా హైదరాబాద్‌కు దీటుగా, పోటీగా విస్తరిస్తే అంతకంటే సంతోషం కూడా మరోటి ఉండదు. నిజానికి చంద్రబాబు రెండోసారి సీఎం అయి ఉంటే ఈపాటికి అమరావతి సాక్షాత్కరించేది. అమరావతి అంటే ప్రపంచస్థాయి వ్యాపార, వాణిజ్య భవనాలు, పబ్లిక్‌ పార్క్ లు, వినోద కేంద్రాలు, ఐకానిక్‌ నిర్మాణాలు, సువిశాలమైన రహదారులు, నైట్‌ లైఫ్‌ వినోద కార్యకలాపాలు అందించే సఫారీ టూర్ల వెసులుబాట్లు, టూరిస్ట్‌ ఆకర్షణలు. ఇవేగాక అంతర్గత రవాణా సదుపాయాలు వంటివన్నీ అందుబాటులోకి వస్తాయి. అనేక సదుపాయాల సముదాయంగా అమరావతి పేరిట ఒక మహానగరం నిర్మించాలన్న చంద్రబాబు నాయుడు సంకల్పం అభినందనీయం.

ప్రపంచంలో అనేక నగరాలను తిరిగి, అధ్యయనం చేసిన అనుభం చంద్రబాబుది. ఆయన తన రాజకీయ జీవితం కన్నా తన పేరు చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించే వ్యక్తి. చంద్రబాబు దార్శనికుడు కావడం వల్ల ప్రపంచ స్థాయి నగరంగా ’అమరావతి’కి బలమైన పునాదులు వేస్తున్నారు. తన దార్శనికతతోనే అమరావతిని ఓ అద్భుత వాణిజ్య నగరంగా తీర్చిదిద్దే పనిలో ప్రధానిని ఆహ్వానించి పునాది వేయించడం, పునరావిష్కృతం చేయడం చరిత్రలో నిలిచే మహోజ్వల ఘట్టం. ఇది పూర్తిగా సాకారం కావడానికి కనీసం ఓ దశాబ్ద కాలం పట్టవచ్చు. అప్పటి వరకు చంద్రబాబును ప్రలజు ఆదరిస్తే ఏపీని అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు దార్శనికతకు సజీవ సాక్ష్యంగా చరిత్రలో అమరావతి నగరం నిలిచిపోతుంది. కృష్ణా పరివాహక ప్రాంతం కావడం నీటికొరత లేకుండా అమరావతి అలరారుతందనడంలో సందేహం లేదు. అమరావతి భారతదేశంలో అద్భుత నగరంగా నిలిచిపోతే తెలుగువాళ్ళందరికీ గర్వకారణమే.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News