Monday, July 13, 2026
29.3 C
Hyderabad

ఎడిటోరియల్ : 12.03.2025

చట్ట సభలను చులకన చేయొద్దు!

చట్టసభలకు ఎన్నికైన వారు..సభకు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలి. సభలో ప్రజల పక్షాన నిలబడాలి. హోదాతో సంబంధం లేకుండా నడుచుకునేలా చూసుకోవాలి. అయితే తెలుగు రాష్టాల్ల్రో విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల్లోనూ మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ సభలకు వెళ్ళడం లేదు. ప్రతిపక్షహోదా కలిగిన బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ చట్టసభలకు రావడం లేదు. సభలో ప్రజాసమస్యలపై చర్చించడం లేదు. ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా యాన సభకు రాకుండా మొహం చాటేస్తున్నారు. పదేళ్లపాటు సిఎంగా పని చేసిన కెసిఆర్‌ విపక్షానికి పరిమితం కావడంతో ఇక ప్రజలతో పనేం!? అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగా పనిచేయడం లేదని, ఇక అంతు తేలుస్తానని బయటనుంచి మాట్లాడుతున్నారు. కానీ సభకు వచ్చి సమస్యలను ప్రస్తావించడం, తన ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి చెడులను చర్చించడం లేదు. ఇది ఓ రకంగా ప్రజలను అవమానించడమే! అలాంటప్పడు జీతభత్యాలు తీసుకోరాదు. నిజానికి ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు, పెన్షన్లపై చర్చించాలి. వారికి కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన అవసరమేముందో తేల్చాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో వారు సుఖాలు అనుభవిస్తున్నారు.

ఎ.పి అసెంబ్లీలో జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అంశం మీద ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షహోదా ఇస్తే తప్ప సభకు రానని మూర్ఖంగా వాదించడం జగన్‌కే చెల్లింది. ప్రతిపక్ష హోదాకు సభా సంప్రదాయాలు, నియమాలు ఉన్నాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, గతంలో ఎంపిగా పనిచేసిన జగన్‌ చట్టాల గురించి తెలుసుకోకుండా సభకు రానని చెప్పడం ఎన్నుకున్న ప్రజలను అవమానించడమే!

ప్రతిపక్షహోదా ఉన్న కెసిఆర్‌ రావడం లేదు..విపక్ష హోదా లేదు కనుక రాను పో అని జగన్‌ అంటున్నారు. ఇలాంటి నేతలను నమ్ముకుంటే ప్రజలు నట్టేట మునగడం ఖాయం. జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది రాజకీయ నిర్ణయం కాదు. ఈ విషయంలో పార్లమెంటరీ సంప్రదాయాలు ఏం చెబుతున్నాయో పరిశీలించాలి. పార్లమెంటులో లేదా, అసెంబ్లీలో రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందితే, ఆ పార్టీ పార్లమెంటు లేదా అసెంబ్లీ ప్రాంగణంలో కొన్ని వసతులు పొందడానికి వీలుంటుంది. ఇటువంటి గుర్తింపు సభాపతి నుంచి వస్తుంది. ఎన్నికల సంఘం దగ్గర రాజకీయ పార్టీగా నమోదు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాయి రాజకీయ పార్టీలు. అటువంటి పార్టీలకు చట్టసభలో ఒక సీట్‌ వున్నా అవి పార్లమెంటులో రాజకీయ పార్టీలుగానే కొనసాగుతాయిగానీ సభాధ్యక్షుడి గుర్తింపు వుండదు. సభాధ్యక్షుడి గుర్తింపు పొందితేనే సభా ప్రాంగణంలో కార్యాలయానికి గది కేటాయింపు వంటి వసతుల కల్పనకు అవకాశం ఉంటుంది. స్పీకర్‌ ఆధ్వర్యంలో పనిచేసే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలకు పిలుపు వస్తుంది. వసతుల కల్పనకు నిబంధనలు వేరుగా ఉంటాయి. దీనికి సంబంధించి పార్లమెంటులో మూడు నిబంధనలు పొందుపరిచారు. వాటినే అసెంబ్లీల్లో పాటిస్తున్నారు. కనీసం పదిశాతం సీట్లు పొందిన వారికే విపక్షపార్టీగా గుర్తింపు దక్కుతుంది.

గత పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీకి విపక్షహోదా దక్కలేదు. అది కావాలని ఆ పార్టీ పట్టుబట్టలేదు. ఫలితంగా పది సంవత్సరాలు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అన్న వ్యవస్థ లేకుండా గడిచింది. 2014లోనూ, 2019 లోనూ కాంగ్రెస్‌ పార్టీ అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ దానికి పదో వంతు సంఖ్యా బలం లేదు. పదో వంతు సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష గ్రూప్‌గా గుర్తిస్తారుగాని ప్రతిపక్ష పార్టీగా గుర్తించక పోవటం గతంలో కూడా జరిగింది. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో లోక్‌సభలో అతి పెద్ద ప్రతిపక్షంగా ఏ జాతీయ పార్టీ నిలువలేదు. ప్రాతీయ పార్టీ అయిన తెలుగు దేశానికి ప్రతిపక్ష గ్రూప్‌ అన్న గుర్తింపు దక్కింది. అయితే చట్టంలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాలంటే పదో వంతు సభ్యులుండాలన్న నిబంధన అన్నది సంప్రదాయంగా వస్తున్న నిబంధన మాత్రమే. 1977లో మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అనే వ్యవస్థ ఏర్పడింది. 1977లో అప్పటి జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపునకు కనీస సభ్యుల సంఖ్యను సూచించలేదు. సభలో అధికారపార్టీని వ్యతిరేకించే పార్టీలలో ఎక్కువమంది సభ్యులుండే పార్టీనేతను ప్రతిపక్ష నేతగా సభాధ్యక్షులు గుర్తిస్తారని పేర్కొన్నది. సభలో అధికార పక్షాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సమాన సంఖ్యా బలం కలిగి వుంటే ఏ పార్టీ నేతను ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలనేది ఆ యా పార్టీల స్థితిగతుల ఆధారంగా సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. ఆ విధంగా సభాధ్యక్షుడి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతకు కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. సభ లోపల వెలుపలా కూడా. జీత భత్యాలు, వాహనం, సహాయ సిబ్బంది, అధికారిక నివాసం మొదలైనవి వస్తాయి.. ప్రతిపక్ష నేతకు కాబినెట్‌ మంత్రి హోదా కల్పించటం ఒక సంప్రదాయంగా వస్తున్నది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక పార్టీకి చట్టసభలో గుర్తింపు పొందటానికి అవసరమైన సభ్యులే లేకపోతే, అలాంటి పార్టీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదనేది 2014లో నాటి లోక్‌సభ స్పీకర్‌ తేల్చేశారు. ఇది రాజకీయపరమైన నిర్ణయం. ఈ వాదన 2014లో తెర విూదకు వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పదో వంతు సభ్యులు కూడా లేరు. కాంగ్రెస్‌ పార్టీ దానివిూద ఏవిూ రాద్ధాంతం చేయలేదు. సభా కార్యకలాపాలకు దూరంగానూ లేదు. ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించవలసిన ప్రతి సందర్భంలోను అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరిని ప్రభుత్వం సంప్రదించింది. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నియామకాలు చేసే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా సభ్యుడు. ఉదాహరణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నియామకం. అటువంటి నియామకాలప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధీర్‌ రంజన్‌ చౌదరిని సంప్రదించింది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ప్రతిపక్షనేత హోదా కావాలని జగన్‌ పట్టుబట్టడం అసమంజసం. తనకు దక్కదని తెలిసి కూడా ఆ హోదా కోసం ఆరాటపడటం హుందాతనం అనిపించు కోదు. సభలో మాట్లాడటానికి కేటాయించే సమయం రాజకీయ పక్ష సభ్యుల సంఖ్యాబలం విూద ఆధారపడి ఉంటుంది. మాట్లాడే హక్కు ప్రతి సభ్యుడికీ ఉంటుంది. ఎంతసేపు అనేది సభాపతి నిర్ణయం. ప్రతిపక్షనేత గనుక కచ్చితంగా ఇంత సమయం కేటాయించాలి అన్న నిబంధన ఏవిూ లేదు. తనకు 40 శాతం ఓట్లు వేసిన ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయంలో హోదా ఇవ్వలేదనే వంకతో అసెంబ్లీకి రాకపోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది కెసిఆర్‌, జగన్‌ ఇద్దరికీ వర్తిస్తుంది. సభకు ఎన్నికయ్యాక సమావేవాలకు హాజరు కావాల్సిందే. ప్రజల పక్షాన నిలబడాల్సిందే. అంతే తప్ప తమ మూర్ఖ వాదనలతో ప్రజలను చులకన చేయడం సరికాదు.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News