Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, పకడ్బందీ ప్రణాళిక లేకపోవడం వంటివన్నీ కలిసి ప్రభుత్వాల ఆర్థిక స్థితిని అధ్వాన్నంగా, అప్పుల మయం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న నాయకత్వం, విధాన ప్రాధాన్యతలు, వ్యవస్థలో జవాబుదారీతనం లోపం ఈ పరిస్థితిని మరింత దారుణంగా దిగజార్చుతున్నాయి.

తెలంగాణలో ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షనర్లకు కలిపి రూ.8వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినప్పటికీ, నెలనెలా ఇదే స్థాయిలో చెల్లింపులు కొనసాగిస్తామని ప్రకటించడం సమస్య తీవ్రతను తగ్గించదు. పైగా అసలు సమస్య తీవ్రతను హెచ్చరిస్తున్నది. జీతాలను ప్రతినెలా 1వ తేదీననే చెల్లిస్తున్నామని చెప్పుకునే దుర్వస్థ ప్రస్తుత ప్రభుత్వాలది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన నిధులు ఆలస్యం కావడం పరిపాలనా ప్రాధాన్యతల వైఫల్యం కాక మరేమిటి? ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి మించి, సమగ్ర ఆర్థిక వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇక భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖపై కూడా విమర్శలు ఉన్నాయి. ఖర్చుల ప్రాధాన్యతలను సమతుల్యంగా అమలు చేయడంలో లోపాల ఆరోపణలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాజకీయంగా అవసరమైనదైనా, అదే సమయంలో ఆదాయ వనరుల పెంపు, వ్యయ నియంత్రణపై తగిన దృష్టి లేకపోతే ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు దారి తీస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా తెలంగాణకు పెద్దగా తేడాగా లేదు. రాష్ట్రం భారీగా అప్పులపై ఆధారపడుతూ తన ఖర్చులను నిర్వహిస్తోంది. కేంద్రం నుంచి గ్రాంట్లు, ప్రత్యేక సహాయం పొందడం తాత్కాలిక ఉపశమనమే కాని దీర్ఘకాలిక పరిష్కారం కాదు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి కేంద్ర సహకారం లభిస్తున్నప్పటికీ, అది ఆర్థిక క్రమశిక్షణకు ప్రత్యామ్నాయం కాదు. ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల వృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

భారత దేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అప్పులు ఆందోళనకరంగా ఉన్నాయి. మార్చి 2024 నాటికి, భారతదేశ మొత్తం బకాయి రుణం రూ.168.72 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబరు 2024లో, భారతదేశ విదేశీ అప్పు రూ.57.49 లక్షల కోట్లుగా నమోదైంది. 2026-27 చివరి నాటికి తెలంగాణ ప్రభుత్వ రుణ బకాయిలు రూ.6 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక లోటును పూడ్చేందుకు చేసిన అప్పులతో పాటు, తెలంగాణ 37.2%తో దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వ రుణం రూ.7.11 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఏపీలో 43.7% తో దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు అత్యధిక రుణాలను కలిగి ఉండగా, దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ తలసరి అప్పులు ఎక్కువగా ఉన్నాయి.

రైతుబంధు, ఉచిత విద్యుత్, నగదు బదిలీలు వంటి పథకాలు సామాజిక భద్రతకు అవసరమే అయినప్పటికీ, అవి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా లేవు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాలు కూడా ఇదే సమస్యను సృష్టించాయి. ప్రస్తుతం అదే విధానాలను కొనసాగించడం వల్ల సమస్య మరింత పెరిగింది.

అవినీతి, జవాబుదారీతనం లోపం కూడా పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో చిన్న పనులకు కూడా లంచాలు అవసరమవుతున్నాయి. పరిపాలనా యంత్రాంగంలో సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. జిల్లాల విభజన ద్వారా పరిపాలన సులభమవుతుందని భావించినప్పటికీ, వాస్తవంలో ఫలితాలు అంతగా కనిపించడం లేదు.
ఈ పరిస్థితిలో పరిష్కార మార్గాలు స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వాలు ఖర్చుల ప్రాధాన్యతలను పున:పరిశీలించాలి. ఆదాయ వనరులను పెంచేందుకు పారిశ్రామిక, పర్యాటక పెట్టుబడులను ఆకర్షించాలి. సంక్షేమ పథకాల వ్యయాన్ని నియంత్రించాలి. బకాయిల చెల్లింపులను సమయానికి పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంపొందించాలి. అవినీతిపై కఠిన చర్యలు తీసుకుని పరిపాలనలో పారదర్శకతను తీసుకురావాలి.

ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే సంక్షేమం కూడా నిలదొక్కుకోలేదన్న వాస్తవాన్ని గుర్తించాలి. ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాలు, అదే ప్రజల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయాల్సిన బాధ్యతను మర్చిపోవద్దు. అప్పులపై ఆధారపడిన అభివృద్ధి తాత్కాలికం మాత్రమే. సుస్థిర ఆర్థిక విధానాలే రాష్ట్రాలను దీర్ఘకాలికంగా బలపరుస్తాయి.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News