Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

ఆదికవి పాల్కురికి సోమనాథుని దీపారాధన

ఫాల్గుణ పౌర్ణమి నాడు లింగైక్య తిథి

పాల్కురికి సోమనాథుడు (క్రీ శ 1160-1240) అందరి వంటి కవి కాదు. అన్నింటా అసామాన్యుడు. తెలంగాణ ఆదికవి. తెలుగు భాషలో తొలి స్వతంత్ర కవి. ఆయనకు ముందు అందరూ అనువాద కవులే. సోమనాథుడు అష్ట భాషా కోవిదుడు. అక్షర క్రీడలో ఆరితేరిన ప్రతిభా శాలి, ప్రయోగ శీలి. అయినా ప్రగల్బ ప్రదర్శన లేని వాడు. జాను తెలుగులో వ్రాసి ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిండు. భాష, భావం, వస్తువు, ఇతివృత్తం, పాత్రలు, ఛందస్సు, ప్రక్రియ, ప్రస్తుతి అన్నింటి లోనూ నవ్య మార్గంలో నడిచిండు. ఒక విప్లవం తెచ్చిండు.

కన్నడ నేలపై ప్రభవించి సమ సమాజం, సామ్యవాదం సాధనకు వీర శైవంను ఒక పరికరంగా స్వీకరించి ప్రజలను మేలు కొలిపిన మహనీయుడు బసవేశ్వరుడు. బసవేశ్వరుని భక్తి తత్వాన్ని తెలుగు దేశాన తెలియ చెప్పిన వాడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఈ ఇరువురి దివ్య చరితలను వారి బలగమైన శివ శరణుల కథలను తనివి తీరా వ్రాసిండు. తన ఇలు వేలుపు పాలకురికి సోమేశునిపై సోమనాథ స్తవం వ్రాసిండు. ద్విపదకు పద్య పదవిని ఇచ్చిండు. లక్షణ యుక్తంగా తొలి శతకాన్ని కూర్చిండు. ఉదాహరణకు ఉదాహరణగా నిలిచిండు. గద్యలతో, రగడలతో ఊర్రూత లూగించిండు. అలతి ద్విపదలు, అలుకటి మాటలే కాదు, అరుదైన ఛందస్సులు, అబ్బుర పరిచే అక్షర విన్యాసాలు చూపించిండు. తన కాలపు సమాజాన్ని, సంస్కృతిని, కళలను, ప్రకృతిని, విజ్ఞానాన్ని, ఆనాటి సమస్తాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించిండు. అంతటి మహత్తరమైన కవి మరొకరు లేరు. సోమనాథుడు తెలంగాణలో పుట్టినా, ప్రాంతానికి పరిమితం చేయలేని విశ్వ కవి.

సోమనాథుడు ప్రజల మధ్య, భక్తుల నడుమ పర్యటిస్తూ శ్రీశైలం మీదుగా కన్నడ కల్య క్షేత్రాన్ని చేరుకొన్నడు. అక్కడి జంగమ మఠంలో శివ శరణి చెన్నమ్మ చెంత ఆ వృద్దాప్యంలోనూ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉండి పోయిండు. కాలం సమీపించి అక్కడనే లింగైక్యం చెందిండు. క్రీ శ 1240 వికారి నామ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు ఆయన ఆత్మ శివ పరమాత్మలో లీనమైంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు కల్య క్షేత్రంలో అక్కడి జంగమ మఠం వారు సోమనాథుని సమాధి వద్ద దీపారాధన చేస్తున్నరు. విశేషం ఏమిటంటే అక్కడ స్థానికులకు సోమనాథుని గురించి తెలుసు. ఈ వ్యాసకర్త 2024 అక్టోబర్ 19న కల్య సందర్శనకు పోయినప్పుడు నాగరాజ్ అనే పాతికేండ్ల కాపుదనపు యువకుడు విశేషాలన్నీ వివరించిండు. వ్యాసకర్త మిత్రుడు రఘు కిరణ్ అయ్యంగార్ దుబాసిగా తోడు ఉన్నడు. తిరిగి వస్తున్న దారిలో ఎదురుపడ్డ కె సి ఈశ్వర్ ప్రసాద్ మరికొన్ని వివరాలు తెలిపిండు. సోమనాథుని సమాధిని విభూదితో నింపినారట. పక్కనే పెంచిన మారేడు చెట్ల నుంచి సమాధి మీద నిత్యం బిల్వ దళాలు పడే ఏర్పాటు కొనసాగుతూ వస్తున్నదట.

సోమనాథుని లింగైక్య అనంతరం పాలకుర్తిలో ఆయన పేరు మీద మందిర నిర్మాణం జరిగింది. జంగమ పెద వీరయ్య వారసులు ఆ గుడి నిర్వహణ చూస్తున్నరు. పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం వినతి మేరకు తెలుగు విశ్వవిద్యాలయం సోమనాథుని శిలా విగ్రహాన్ని ప్రదానం చేసింది. 2002 లో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 2015 నుంచి సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో ఏటా సోమనాథుని దీపారాధన జరుగుతున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలకుర్తి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్మృతి వనం నిర్మించి సమున్నత వేదిక మీద సోమనాథుని భారీ శిలా విగ్రహాన్ని కూర్చుండ బెట్టింది. 2023 సెప్టెంబర్ 4 న ప్రారంభ సంరంభం జరిగింది. ఆ తదుపరి ప్రభుత్వం పట్టింపు లేక సోమనాథుని స్మృతి వనం వెలవెల పోతున్నది.

కల్య క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మలచాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం పర్యాటక మంత్రి ఎచ్ కె పాటిల్ బృందాన్ని పాలకుర్తికి పంపాలని యోచిస్తున్నది. ఈ తరుణంలో పాలకుర్తిలోని సోమనాథుని స్మృతి వనం సక్రమ నిర్వహణతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయంకు పాల్కురికి సోమనాథుని పేరు పెట్టవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వంపై ఉన్నది.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News