Friday, July 17, 2026
26.4 C
Hyderabad

శాంతి జపం! యుద్ధ తపం!?|EDITORIAL

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. 30ఏళ్ళ తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించిన అగ్ర రాజ్య అధ్యక్షుడు, ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని అన్నారు. అణ్వాయుధ పరీక్షలపై ట్రంప్‌ ప్రపంచ దేశాలకు మాత్రమేగాక, భారత్ కు కూడా షాకిచ్చారు. అంతేకాదు తాజాగా ఆయన తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తామే కాదు, చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌ సహా ప్రపంచంలో అనేక దేశాలు రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని సీబీఎన్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వెల్లడించారు! అమెరికా అధ్యక్షుడి మాటలు చూస్తేంటే ట్రంప్ లో శాంతి జపమూ, యుద్ధ తపమూ కలగలిసి ఉన్నట్లు కనిపిస్తున్నది.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. 30ఏళ్ళ తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించిన అగ్ర రాజ్య అధ్యక్షుడు, ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని అన్నారు. అణ్వాయుధ పరీక్షలపై ట్రంప్‌ ప్రపంచ దేశాలకు మాత్రమేగాక, భారత్ కు కూడా షాకిచ్చారు. అంతేకాదు తాజాగా ఆయన తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తామే కాదు, చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌ సహా ప్రపంచంలో అనేక దేశాలు రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని సీబీఎన్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వెల్లడించారు.

‘ఆయా దేశాలు వాటి గురించి మాట్లాడడం లేదు. రష్యా, చైనాల కంటే తమ వద్దే ఎక్కువగా ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయవచ్చన్నారు. అయినప్పటికీ అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడానని ట్రంప్‌ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడి మాటలు చూస్తేంటే ట్రంప్ లో శాంతి జపమూ, యుద్ధ తపమూ కలగలిసి ఉన్నట్లు కనిపిస్తున్నది. అలాగే ప్రపంచాన్ని హెచ్చరిస్తూ, బెదిరింపులకు కూడా ట్రంప్ పాల్పడుతున్నారు. అయితే, ట్రంప్‌ ఆదేశాలపై అమెరికా ఇంధనశాఖ కార్యదర్శి క్రిస్‌ రైట్‌ వివరణ ఇచ్చారు. తాము జరపబోయే అణుపరీక్షల్లో ఎలాంటి విస్ఫోటాలు ఉండవన్నారు. వ్యవస్థలన్నీ నిర్దేశిత లక్ష్యం మేరకు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. తమ దేశం ఎల్లప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. అణ్వాయుధాల విషయంలో ‘ముందుగా వినియోగించకూడదు’ అనే విధానంతోపాటు, తమ అణు వ్యూహం పూర్తిగా రక్షణాత్మకమైనదని పేర్కొంది.

ఇక ట్రంప్‌ హెచ్చరికలు భారత్ కేనా? పాక్ భుజంపై తుపాకీని ఎక్కుపెట్టి భారత్ ను టార్గెట్ చేస్తున్నారా? అన్న అనుమానాలు కలగక మానవు. ఇటీవల భారత్‌పై పాక్ ఉగ్రదాడికి నిరసనగా చేసిన ఉగ్రమూకలపై దాడి సందర్భంగా మన ఆయుధ పాఠవం ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు తెలిసొచ్చింది. భారత్ తమను ధిక్కరించే స్థాయికి చేరుకుందన్న భయం కూడా ఈ వ్యాఖ్యలకు కారణం కావచ్చు. పాక్‌కు అమెరికా ఇచ్చిన యుద్ధ విమానాలను తుత్తునియలు చేసింది. దీంతో భారత్‌తో సమానంగా పాక్‌ను కూడా చేర్చి రెండు అణ్వాయుధ దేశాలు అంటూ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు పాక్‌ కూడా అణ్వాయుధ పరీక్షలు చేస్తోందన్నారు. ఇదంతా కూడా పాక్‌లో పాగావేసి, అక్కడి నుంచి అవసరమైతే భారత్‌, చైనాలపై దాడులకు దిగాలన్న అ మెరికా కుయక్తులు అర్థమవుతూనే ఉన్నాయి. అందుకే భారత్‌ వ్యతిరేక చర్యలపై ట్రంప్‌ స్పీడ్‌ పెంచారు. సుంకాలు, వీసాలు, అమెరికాలో అనధికారికంగా ఉన్నవారిని వేధించి, వెక్కరించి తిప్పిపంపడం, ఉద్యోగాల్లో భారీతయులను తొలగించాలన్న డిమాండ్‌, వంటివన్నీ కూడా ఆపరేషన్‌ సింధూర్‌ తరవాత తీసుకున్న గట్టి నిర్ణయాలు.

ఇదే సందర్భంలో పుతిన్‌, జిన్‌పింగ్‌ చాలా కఠినాత్ములు, బలమైన నాయకులు, తీవ్రంగా పరిగణించాల్సిన వ్యక్తులు అని నేరస్తులపైలా వ్యాఖ్యానించారు.‘మేము చైనాని ఓ కంట కనిపెడతాం. వారు అమెరికాను ఎల్లప్పుడూ కనిపెడ్తూ ఉంటార’ని అన్నారు. గత 8 నెలల్లో 8 యుద్ధాలను ఆపానని, భారత్‌, పాక్‌ల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని మరోసారి వ్యాఖ్యానించారు.

అయితే,ఇప్పటికే ట్రంప్‌ మీద స్వదేశంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. విదేశాల్లో కుట్రలు చేస్తున్నారని, భారత్‌ లాంటి మిత్రదేశాన్ని దూరం చేసుకుంటున్నారని మండిపడు తున్నారు.

ఇదే అవకాశంగా ట్రంప్ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌ స్పందించింది. తామెప్పుడు ఇతర దేశాల కంటే ముందుగా అణు పరీక్షలను పునరుద్ధరించబోమన్నారు. అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాక్‌ కాదని.. అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని స్పష్టం చేశారు. ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్‌ సైతం స్పందించారు. బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశంగా చైనా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ అణువ్యూహాన్ని సమర్థిస్తుందన్నారు. అణు పరీక్షలు నిలిపివేయాలనే విషయంలోనూ తాము అదే నిబద్ధతకు కట్టుబడి ఉంటామన్నారు.

మొత్తంగా అమెరికా అణుపరీక్షల వ్యవహారం ఎలా ఉన్నా రష్యాచ,చైనాల సరసన పాక్‌ను కూడా చేర్చడం వెనక భారత్‌ను బెదరించే ధోరణిని ట్రంప్‌ ప్రకటించారు. పాక్‌ను భారత్ పక్కలో బల్లెంగా ఎగదోసే పనిలో ట్రంప్‌ బిజీగా ఉన్నాడు. అందువల్ల ఎప్పటికైనా అమెరికాతో, ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News