Friday, May 29, 2026
33.2 C
Hyderabad

ఉచిత పథకాలు-ఉచితానుచితాలు!|EDITORIAL

ప్రజా సంక్షేమ, ఉచిత పథకాలు, నగదు బదిలీలు రాష్ట్రాలను దివాళా తీయిస్తున్నాయి. ఆయా పథకాల అమలు కోసం చేసే అప్పులు, వాటికి వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు తడిసి మోపెడై, ఆర్థిక వ్యవస్థే అస్తవ్యస్థమైపోతున్నది. అయినా, ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాల్లో భాగంగా ఆయా పథకాలనే నమ్ముకుంటున్నాయి. వెనుకటికి రాజుల పైసలు రాళ్ళ పాలు అనే వారు. ఇప్పుడు ప్రజల పైసలు ప్రజలకే పెడుతున్నామని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ, ఉచితానుచితాలను సమీక్షించుకోవడం లేదు. దీంతో ఉద్యోగులకు జీత భత్యాలు కూడా సమయానికి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలుంటున్నాయి. ఆర్థిక నిర్వహణ భారంగా మారి, ప్రజలకు, వారి ఆస్తులకు కేర్ టేకర్ గా ఉండాల్సిన ప్రభుత్వాలు, ప్రైవేట్ లిమిటెడ్, రియల్ ఎస్టేట్ కంపెనీని తలపిస్తున్నాయి. మిగులు రాష్ట్రాలు తరుగు రాష్ట్రాలుగా మారి, అప్పుల కుప్పలై పోతున్నాయి.

సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు తమ మేనిఫెస్టోల ద్వారా ప్రజల ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నాలు ఎందాకా పోయాయంటే, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత గ్యాస్ సిలండర్ కు కాంగ్రెస్ రూ.500లకు ప్రకటిస్తే, బీఆర్ఎస్ రూ.400లకే ఇస్తామని హామీ ఇచ్చింది. సాధ్యాసాధ్యాలను ఏ పార్టీ చూడటం లేదు. హామీలిచ్చామా? అధికారంలోకి వచ్చామా? ఆ తర్వాత అధికారాన్ని నిలుపుకోవడానికి ఏమైనా చేద్దామా? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ప్రజలు కూడా మేమేంటి? మాకేంటి? అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఊరు, వాడ, సమాజం, రాష్ట్రం, దేశం అనే విశాల భావాలను పక్కనపెట్టి ఆలోచిస్తున్నారు. ఇదే అదనుగా రాజకీయ పార్టీలు, నేతలు అధికారానికి ముందు ఓట్లు, తర్వాత నోట్లు దండుకుంటున్నారు. ఒక్కసారి అధికారం వస్తే చాలు లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారు.
తాజాగా ఏపీలో ఆటో డ్రైవర్లకు ‘చేయూత’ కింద ఒక్కొక్కరికి రూ.15వేల నగదు జమ చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభంలోనే ఓ మహిళా డ్రైవర్‌, తమ ఇంట్లో ఎన్ని ఉచిత పథకాలు అందుతున్నాయో తెలిపారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా నగదు అందుతూ పోతే, రాష్ట్రం దివాళా తీయకుండా ఉంటుందా? పాలకులు దీన్ని ఎలా సమర్థించుకుంటారు?

ఇప్పటికే ఉభయ తెలుగు రాష్టాల్రు దివాళా దిశగా పయనిస్తున్నాయి. ఒకవైపు ఉచిత పథకాలు, మరోవైపు రాజకీయ నాయకుల ఖర్చులతో రాష్ట్రాలు కుదేలవుతున్నాయి. కేసీఆర్‌, జగన్‌ల కారణంగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి రూ.15 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. డ్రైవర్లకు రూ.15వేల నగదు బదిలీలు, మహిళలందరికీ ఉచిత బస్సులు, పెన్షన్లు, దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ రేషన్‌ కార్డులు, కిలో రూపాయికి సన్న బియ్యం పథకాలు, ఆరోగ్యశ్రీలు, ఉచిత విద్యుత్‌, రైతు రుణ మాఫీలు, రైతు భరోసాలు, రైత బీమాలు, ఫీ రియంబర్స్ మెంట్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డు హోల్డర్లకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు నెలనెలా రూ.2,500, స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు, యువతకు ఉపాధి హామీ, నిరుద్యోగ భ్రుతి… మహిళలకు ఉచిత బస్సు…డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పథకాల కంటే ఇవే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యంపోనవసరం లేదు. ఒక్క ఉచిత బస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.300కోట్లు ఖర్చు చేస్తున్నది.

ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉద్యోగాధికారులకు లక్షల్లో జీతాలు, రెండు పెన్షన్లు, రకరకాల ఖర్చులు, హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో నేతల పర్యటనలు వంటివన్నీ కలిసి తడిసి మోపెడు అవుతున్నాయి. దారిద్య రేఖకు ఎగువన ఉన్నవారు కూడా తెల్ల రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా వాటి పరిశీలనలే లేవు. రేషన్ కార్డుల సంస్కరణ నేటికీ చేపట్టకపోగా, అడిగిన వారికల్లా ఇస్తున్నారు. దీంతో రాష్ట్రాల్లో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని నిర్మించాలనే విషయంలో కూడా శాస్త్రీయత పాటించడం లేదు. ఇందిరమ్మ ఇళ్లకోసం నిజమైన అర్హులు అన్నది పక్కకు పోయి నేతలు ఎంపిక చేసిన వారి పేర్లు ముందుకు వచ్చాయి. రాష్ట్రమంతటా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే రాష్ట్ర బ్జడెట్‌ కూడా సరిపోదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియక ఇచ్చిన హామీలు ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపలేని స్థితి ఏర్పడింది. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక సీఎంలు తలలు పట్టుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యాపిస్తోంది. మరోవైపు ఉచిత పథకాల లబ్దిదారుల్లోనూ సంత్రుప్తి లేదు. తెలంగాణలో దాదాపు రూ.25వేల కోట్ల మేర రుణమాఫీ చేసినా ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేర లేదు. ఇటీవలి వరదల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేంద్రంపై ఆధారపడడం తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా చేసిందేవిూ లేదు. అందుకే రైతులు కూడా సంతృప్తిగా లేరు. రేషన్‌ కార్డుల పంపిణీ వ్యవహారంలో, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు స్వీకరణలో కూడా సరైన కసరత్తు జరగలేదు.
ఎపిలో పేదలకు ఇళ్ల విషయం లోనూ ఇదే జరుగుతోంది. అక్కడంతా అమరావతి, పోలవరం చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణ చేస్తున్నారు. చీప్‌ లిక్కర్‌ కేసులో ఇప్పుడు సొంతపార్టీ నేతలే దొరకడంతో తెలుగుదేశం ఇరకాటంలో పడింది. గతంలో రాష్ట్రాలను దివాళా తీయించిన కేసీఆర్, జగన్ బాటలోనే ప్రస్తుత సీఎంలు పయనిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దశలో ఆర్థిక భారంగా మారిన పథకాలను సమీక్షించాలి. ఉచిత పథకాలను రద్దుచేయాలి. లేదా క్రమబద్దీకరించాలి. రెండు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికైనా పరిస్థితులను మదింపు చేసుకుని, తగు దిదిద్దుబాటుకు దిగకపోతే, తెలుగు రాష్ట్రాలు మరింత దివాళా తీసే పరిస్థితి దాపురిస్తుంది.

Latest News

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

28-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు.ద్వాదశి ఉదయం 08.17 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం చిత్త ఉదయం 08.50 వరకు ఉపరి స్వాతి యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.20 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 08.17...

గాలి మేడలు!?|ADUGU TRENDS

ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది?...

‘ఎబోలా’ మళ్ళీ ముప్పేనా!? ఎలా?|EDITORIAL

కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్‌లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో...

27-05-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం-శుక్లపక్షం తిధి శు ఏకాదశి ఉదయం 07.43 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం హస్త ఉదయం 07.33 వరకు ఉపరి చిత్త యోగం వ్యతీపాత రాత్రి తెల్ల 04.33 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం...

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News