Friday, July 17, 2026
26.4 C
Hyderabad

ఉగ్రమూకలను తుడిచి పెట్టడమే తక్షణ కర్తవ్యం|EDITORIAL

దేశ భద్రతను సవాలు చేస్తున్న ఉగ్రవాద శక్తులను సమూలంగా తుడిచి పెట్టకపోతే, అవి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్రసామగ్రి స్వాధీనం వంటి సంఘటనలు దేశమంతటా ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశపు యువతను, చదువుకున్న వర్గాలను సైతం తమ వలలో వేసుకుని, మన వేళ్ళతో మన కళ్ళనే పొడిచిన విధంగా ఉగ్రదాడులకు తెగబడటం అత్యంత భయంకరంగా ఉంది. దేశంలోనే అంతర్గతంగా ఉగ్రశిక్షణనిస్తున్న, ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళపై దృష్టి పెట్టి, గుట్టుమట్లు విప్పి పెట్టి, మట్టు పెట్టాల్సిందే! దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం మన అందరి సమిష్టి బాధ్యత. తక్షణ కర్తవ్యం.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

దేశ భద్రతను సవాలు చేస్తున్న ఉగ్రవాద శక్తులను సమూలంగా తుడిచి పెట్టకపోతే, అవి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్రసామగ్రి స్వాధీనం వంటి సంఘటనలు దేశమంతటా ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశపు యువతను, చదువుకున్న వర్గాలను సైతం తమ వలలో వేసుకుని, మన వేళ్ళతో మన కళ్ళనే పొడిచిన విధంగా ఉగ్రదాడులకు తెగబడటం అత్యంత భయంకరంగా ఉంది.

ఇంతకాలం పాకిస్తాన్‌ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించి దాడులు చేస్తూ ఉండేవారు. తాజాగా మనవాళ్ళకే ఉగ్రవాద శిక్షణనిచ్చి, మనపైకే ఎగదోసి, మానవబాంబులై మన వాళ్ళనే హంతమొందిస్తున్నట్లుగా తాజా ఢిల్లీ పేలుళ్ళ ఘటన తేల్చేసింది. ఇది కేవలం మన భద్రతను మాత్రమేగాక, మన సామాజిక, మానసిక జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. దేశంలోనే అంతర్గతంగా ఉగ్రశిక్షణనిస్తున్న, ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టి, గుట్టుమట్లు విప్పి పెట్టి, వాళ్ళని మట్టు పెట్టాల్సిందే.

పాక్‌లో ఉన్న మసూద్‌ అజర్‌ అనే ఉగ్రవాది జైషే మహమ్మద్‌ అనే సంస్థను స్థాపించి భారత్‌పై ఉగ్రదాడులు చేయించాడు. 2001లో పార్లమెంట్ పై దాడి, 2019లో పుల్వామా ఘటనకు కూడా అతడే కారణం. ఇప్పుడతని సోదరి సదియా కూడా మహిళా విభాగాన్ని నెలకొల్పి, మహిళలను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో పట్టుబడిన మహిళా వైద్యురాలు ఈ కుట్రలో భాగమని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు వైద్య సేవల ద్వారా ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు, ఇలాంటి ప్రాణాలు తీసే, విధ్వంసక రక్తపాత కార్యక్రమాల్లో పాల్గొనడం దేశానికి హానికరం.

ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ కగార్‌లాంటి భారీ శోధనను అంతర్గతంగా చేపట్టాలి. ఇల్లిల్లూ జల్లెడపట్టి గాలించి, ప్రతి అనుమానాస్పద వ్యక్తిని విచారించాలి. ఉగ్రవాద మూలాల తుడిచివేతకు గూఢచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. సరిహద్దుల్లోని చొరబాట్లను అడ్డుకోవడమే కాకుండా దేశంలోపల పాకిస్తాన్‌ మద్దతుతో పనిచేస్తున్న నెట్‌వర్క్ లను పూర్తిగా ధ్వంసం చేయాలి.

ఫరీదాబాద్‌ లో 2,900 కిలోల పేలుడు పదార్థం, రైఫిళ్లు, పిస్టళ్లు స్వాధీనం కావడం దేశానికి పొంచి ఉన్న ఉగ్ర ముప్పు గుట్టు విప్పింది. ఈ ఘటనల వెనుక జైషే మహమ్మద్‌, అన్సర్‌ ఘజ్వవత్‌ ఉల్‌ హింద్‌ సంస్థల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ సంస్థలు పాక్‌లో ఉన్నప్పటికీ, భారత్‌లో వాటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్‌ టెర్రరిజం పేరుతో మతాన్ని వక్రీకరించి విధ్వంసకారక మార్గంలో నడిపిస్తున్నారు. ఇలాంటి వారిని ఏ కలుగుల్లో ఉన్నా పట్టి, ప్రత్యేక కోర్టుల ద్వారా తక్షణ శిక్షలు అమలు చేయాలి.

పహల్గాం హత్యాకాండ తర్వాత భారత సైన్యం పాక్‌పై దాడి చేసి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినా, పాక్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. సరికదా, వారు మరింత రెచ్చిపోయి దేశ వ్యతిరేక చర్యలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎర్రకోట ఘటనే దీనికి నిదర్శనం. సాయంత్రం చోటుచేసుకున్న పేలుడు ఘటనకు కొద్ది గంటల ముందే ఫరీదాబాద్‌లో ఉగ్రవాద సామగ్రి పట్టుబడడం యాదృచ్ఛికం కాదు. ఇది పాక్‌ పన్నాగమేనని స్పష్టమవుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే అత్యవసర సమీక్షలు నిర్వహించి ఉగ్రవాదులపై కఠిన చర్యలకు హెచ్చరించారు. భూటాన్‌ పర్యటనలో ఉన్న మోదీ “ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టం” అని ప్రకటించడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. కానీ ప్రజలు కోరుకుంటున్నది కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం.
ఉగ్రవాదంపై యుద్ధం తాత్కాలికం కాదు. ఇది నిరంతర కర్తవ్యం. దేశంలోని ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి సాధారణ ప్రజల దాకా అందరూ ఉగ్రవాద వ్యతిరేక శక్తులుగా మారాలి. పాక్‌పై మరలా కఠిన వైఖరిని అవలంబించకపోతే ఇటువంటి దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయి. భారత్‌తో పెట్టుకోవడానికి ఉగ్రవాదులకు ఉచ్చపడాలి.

దేశ భద్రత, ప్రజల ప్రాణాలు రాజకీయాల కంటే ముఖ్యమైనవి. ఈ దేశ గడ్డపై ఉగ్రవాదం మూలం మిగలకుండా అంతమొందించాల్సిందే. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించి, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం మన అందరి సమిష్టి బాధ్యత. తక్షణ కర్తవ్యం.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News