Monday, March 16, 2026
29.3 C
Hyderabad

బీహార్‌ ఫలితాలు- రాజకీయ పాఠాలు!|EDITORIAL

బిహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు, దాని భాగస్వామ్య హాగఠ్ బంధన్ కూటమికి అనూహ్యం కావచ్చు. కానీ, బీజేపీకి, నితీశ్ కి మాత్రం వ్యూహాత్మకమే. ఎన్నికలను ఎత్తుగడగా సాగించి, ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. బిహార్ ఎన్నికలు నితీశ్, మోదీ, అమిత్‌ షాల వ్యూహంలోనే నడిచాయి. నితీశ్‌ను ముందు బెట్టి బీజేపీ ఎన్నికల యుద్ధం చేసి, గెలిచింది. బీజేపీకి ఒంటరిగా పూర్తి మెజార్టీని సాధించే అవకాశం ఉన్నా, నితీశ్‌ను కాంగ్రెస్ కు వదులు కోరాదన్న వ్యూహంతోనే ముందుకు సాగింది. అన్నింటికీ మించి ‘సర్‌’ తో ఓటర్ల సమీక్ష అనే ఎన్నికల సంఘం నిర్ణయం కూడా బీజేపీదే.
బిహార్ ఫలితాలు రాహుల్, తేజస్విల కళ్ళు తెరిపిస్తాయా? బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయా? వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలేవీ తన సొంత రాష్ట్ర బిహార్ ప్రజల ముందు పని చేయలేదు. రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం కాదు, వాటిని అమలు చేయడంలో ఆరితేరితేనే అధికారం అందివస్తుంది. ఈ ఫలితాలు బీజేపీయేతర అన్ని పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు, ఆర్జేడీకి గుణపాఠం కావాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

బిహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు, దాని భాగస్వామ్య పక్షాల మహాగఠ్ బంధన్ కూటమికి అనూహ్యం కావచ్చు. కానీ, బీజేపీకి, నితీశ్ కి మాత్రం వ్యూహాత్మకమే. ఎన్నికలను ఎత్తుగడగా సాగించి, ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. బిహార్ ఎన్నికలు నితీశ్, మోదీ, అమిత్‌ షాల వ్యూహంలోనే నడిచాయి. నితీశ్‌ను ముందు బెట్టి బీజేపీ ఎన్నికల యుద్ధం చేసి, గెలిచింది. బీజేపీకి ఒంటరిగా పూర్తి మెజార్టీని సాధించే అవకాశం ఉన్నా, నితీశ్‌ను కాంగ్రెస్ కు వదులు కోరాదన్న వ్యూహంతోనే ముందుకు సాగింది. అన్నింటికీ మించి ‘సర్‌’ తో ఓటర్ల సమీక్ష అనే ఎన్నికల సంఘం నిర్ణయం కూడా బీజేపీదే. బిహార్‌లో చొరబాటుదారులు ఓటర్లుగా మారి శాసించే స్థాయికి చేరారు. ఇది బెంగాల్‌, బిహార్‌ల్లోనే ఎక్కువ శాతంగా ఉంది. దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులను ఓటర్ల జాబితాలోంచి తొలగించే ప్రణాళికను సాహసోపేతంగా చేపట్టారు. రాహుల్‌ దీన్ని స్వాగతించి ఉంటే ఆయన ప్రతిష్ట పెరిగేది. పైగా ‘ఓట్ చోరీ’ పేరుతో ఆయన వ్యతిరించడంతో రాహుల్ పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పక్క ఇంట్లోనే దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసినా, ఏమీ చేయలేని ప్రజలు ఎన్నికల సంఘం వాటిని తొలగిస్తే స్వాగతించారు. అలాగే ఆ తొలగింపును వ్యతిరేకించిన రాహుల్‌ను తిరస్కరించారు.

అధికార జేడీ(యూ), బీజేపీల ఎన్డీఏ కూటమిని దించి ఈసారి ఎలాగైనా అధికారం చేపడదామని కలలు కన్న కాంగ్రెస్‌, ఆర్జేడీకి బిహార్‌ ఓటర్లు గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హైడ్రోజన్‌ బాంబు బీహార్‌లో తస్సుమంది. బిహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ జరిపిన ‘ఓట్‌ అధికార్‌ యాత్ర’ పెద్దగా ప్రభావం చూపలేదు. బిహారీలు మళ్లీ ఎన్డీఏకే జై కొట్టారు. ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ 122ను దాటి 202 స్థానాల్లో గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. బీజేపీ 89 సీట్లు, నితీశ్ జెడీయూ 85సీట్లు, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 19 సీట్లు గెలిచాయి. గెలుపు తమదేనన్న మహాగఠ్‌బంధన్‌, హాఫ్‌ సెంచరీని కూడా చేరుకోలేక పోయింది. 2020 ఎన్నికల్లో ఇదే ప్రతిపక్షం 114 స్థానాలు గెలిచింది. ఈ ఎన్నికల్లో అందులో సగం స్థానాలను కూడా దక్కించుకోలేక పోయింది.

చోరీ ఓట్ల గురించి సుప్రీంలో కేసు వేశారు. కానీ సుప్రీం చెప్పిన విధంగా అఫిడవిట్ దాఖలు చేయలేకపోయారు. ఆ విధంగా చూస్తే తొలగించిన ఓట్లలో చనిపోయినవారు, బిహార్‌ను వదిలి వెళ్లిన వారు లేదా దొంగతనంగా ఓటర్లుగా చేరిన వారని తేలిపోయింది. అందుకే రాహుల్‌ ఓట్‌ చోరీ ప్రచారం పనిచేయలేదు. రాహుల్‌తో మహా ఘఠ్ బంధన్‌లో తేజస్వీ యాదవ్‌ సహా వెంట ఉన్న పార్టీలను దెబ్బ కొట్టింది.

ఆపరేషన్‌ సిందూర్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఓటర్ల సవరణ వంటి కీలక అంశాలన్నింటినీ కాంగ్రెస్‌ వ్యతిరేకంచింది లేదా తిరస్కరించింది. బిహార్‌ రెండోదశ పోలింగ్ కు ముందు ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనను కాంగ్రెస్‌, నిఘా వైఫల్యంగా విమర్శించింది. అంతకుముందే భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిని ప్రస్తుతించలేకపోయారు. ఎవరు అధికారంలో ఉన్నా లేకున్నా నిఘా నిరంతరం కొనసాగుతుంది. ఇది కూడా ప్రజాగ్రహానికి కారణమైంది. అందుకే బీహార్‌లో మహాగఠ్‌బంధన్‌కు ఘోర పరాభవం ఎదురైంది.

దేశంలో కొత్తనీరు వస్తోంది. వారంతా దేశం ఏ దిశగా పయనిస్తుందో చూస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలుస్తున్నారు. మోదీతో రాహుల్‌ను పోల్చుకున్నప్పుడు వారు మోదీవైపు మొగ్గుతున్నట్లుగా ఉన్నారు. అలాగే లాలూ, నితీశ్ ల పరిపాలనను గమనిస్తూ, పోలుస్తున్నారు. బిహార్‌లో గత రెండు దశాబ్దాలుగా నితీశ్‌ కుమార్‌ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారు. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి స్థానంలో నితీశే కొనసాగుతున్నారు. 2014-2015లో మినహా బిహార్కు నితీశే సీఎం. అయితే ఈసారి నితీశ్‌ గెలుపు కష్టమని అంతా అంచనా వేశారు. వయసై పోయిందన్నారు. అయినా నితీశ్‌ మాత్రం ఎన్డీఏ ఛత్రం కింద అయితేనే విజయం సాధ్యమని నమ్ముకున్నారు. ఎన్నో కులమత రాజీలతో నిండిన బిహార్‌ రాజకీయాల్లో నితీశ్‌ తిరుగులేని నేతగా నిలిచారు. సాధారణ కుర్మీ కుటుంబంలో పుట్టిన నితీశ్‌, చిన్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1970 చివర్లో జేపీ ఉద్యమంతో ప్రజా జీవనంలోకి అడుగుపెట్టిన నితీశ్‌ రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది.

నితీశ్‌ ఎదుగుదల ఒక్కరోజులో జరిగిందేమీకాదు. ప్రశాంతత, పట్టుదల, కష్టపడి పనిచేయడం, అన్నింటికీ మించి రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేడం వంటివన్నీ ఆయన్ని రాటు దేలిన నేతగా మలిచాయి. ఎప్పటికప్పుడు కొత్త కూటములు కట్టడంలో దిట్ట. అవసరాన్ని మారిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నితీశ్‌ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. బిహార్‌ ప్రజల జీవితాలను మెరుగు పరిచిన నాయకుడిగా నితీశ్‌ మన్ననలు అందుకున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య ప్రమాణాలను బాగా మెరుగు పరిచారని పేరు సంపాదించారు.

లాలూ హయాంలో మొత్తం కుటుంబపాలన సాగింది. లాలూ లేదంటే రబ్రీ కాదంటే ఇప్పుడు తేజస్వీ వచ్చారు. కాంగ్రెస్‌లో కూడా అదే కనిపిస్తోంది. ఇవన్నీ నితీశ్ పంచన చేరిన బీజేపీ బాగా అధ్యయనం చేసి, ప్రచారం చేసింది. తగిన వ్యూహం పన్నింది. అందుకే గతం కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగింది.
బిహార్ ఫలితాలు రాహుల్, తేజస్విల కళ్ళు తెరిపిస్తాయా? బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయా? చూడాలి. వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలేవీ తన సొంత రాష్ట్ర బిహార్ ప్రజల ముందు పని చేయలేదు. రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం కాదు, వాటిని అమలు చేయడంలో ఆరితేరితేనే అధికారం అందివస్తుంది. ఈ ఫలితాలు బీజేపీయేతర అన్ని పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు, ఆర్జేడీకి గుణపాఠం కావాలి.

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News