112 మంది అక్రమ వలసదారులతో ఇండియాకు మూడో విమానం
అమెరికాలో అక్రమ వలసదారుల పట్ల అమానుష తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. 116 మంది భారత అక్రమ వలసదారులతో శనివారం రాత్రి చండీఘడ్ కు విమానం చేరుకోగా, 112 మందితో మూడో విమానం ఆదివారం రాత్రి అమృత్సర్కు చేరుకుంది. విమానంలో తమ చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి నేరస్థుల్లా తీసుకువచ్చారని, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని అందులో ప్రయాణికుడు దల్జీత్ సింగ్ చెప్పారు. అలాగే విమానంలో తమను చూసిన తీరును, భయపెట్టిన విధానాన్ని అర్థం చేశాడు. దర్జీత్ సింగ్ తాను ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయానని చెప్పాడు.
శనివారం రాత్రి 11.35 గంటలకు సి-17 విమానం విమానాశ్రయం చేరుకోగా ఇమ్మిగ్రేషన్, వివరాల సేకరణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు పంజాబ్కు చెందిన వలసదారులను పోలీసు వాహనాలలో వారి ఇంటికి పంపించారు. రెండవ విమానం రావడానికి ముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విమానాశ్రయాన్ని సందర్శించి, డిపోర్టీల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అదే సందర్భంలో సీఎం మాట్లాడుతూ.. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాహనాలలో వారిని ఇళ్లకు పంపిస్తున్నట్టు చెప్పారు. భారతీయ అక్రమ వలసదారులతో వస్తున్న విమానాలను అమృత్సర్ విమానాశ్రయానికే ఎందుకు తీసుకువస్తున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని ఆరోపించారు.

