Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

‘మమత’ను మరచి బెనర్జీ వ్యాఖ్యలు!?|EDITORIAL

మనిషిలో రాను రాను రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. సమాజంలో అత్యాచారాలు, హత్యలు, హత్యాకాండలు పెచ్చుమీరడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఏపీ, తెలంగాణ ఇలా దేశమంతటా అనేక రాష్ట్రాల్లో సభ్యసమాజం తలదించుకునేలా సంఘటనలు జరుగుతున్నాయి. చివరకు చిన్నారి బాలలపైనా కామాంధులు లైంగికదాడులకు పాల్పడడం దారుణం. బాలలపై ఉపాధ్యాయులే లైంగిక దాడికి తెగించడం దుర్మార్గపు చర్య. ఇలాంటి వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదు.

అక్కడక్కడా పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి. వెలుగు చూడనివెన్నో! కులాలు, మతాలు కలవని ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారు. పెళ్ళి కొడుకుల అడ్డు తొలగిస్తున్నారు. భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని, అనైతిక కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని, పిల్లల్ని, పిల్లలు ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని చంపడం వంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయంటే, వాటి పట్ల సమాజంలో భయం లేకపోవడం, చట్టాల్లో లొసుగుల వల్ల ప్రజల్లో ఇలాంటి పైత్యం పరాకాష్టకు చేరుతోంది. సైబర్ నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు కొదువే లేదు.

ఈ నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయి. అత్యాచార ఘటనపై స్పందిస్తూ, ‘అర్థరాత్రి ఆ అమ్మాయి ఒంటరిగా ఎందుకు బయటకు వచ్చింద?’ని పెడసరంగా ప్రశ్నించారు. ఒక సీఎంగా, అందునా మహిళ అయిన మమత ఇలాంటి విషయాల్లో అలా కనీస ఇంగితం లేకుండా మాట్లాడారు. గత కొన్నేళ్లుగా మహిళలపై నేరాల్లో బెంగాల్‌, కోల్‌కతా ముందువరసలో ఉంటున్నాయని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో వార్షిక నివేదికలు ఘోషిస్తున్నాయి. దుర్గాపూర్‌ అత్యాచార దుర్ఘటనను ఖండిస్తూ మహిళలు, విద్యార్థులు, డాక్టర్లు, సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే, దేశమంతా ఆవేదన పెల్లుబికుతుండగా, బాధ్యత కలిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత స్పందన బాధితురాలిని, కుటుంబ సభ్యులను, యావత్‌ మహిళాలోకాన్ని నివ్వెర పరచింది. ‘రాత్రిపూట క్యాంపస్‌ నుంచి బయటికి ఎందుకు వెళ్లింది? ఆ సమయంలో ఆమెకు ఏం పని?’ అని సీఎం యక్షప్రశ్నలు సంధించారు. అసహనం వ్యక్తం చేశారు. ‘ఏ సమయంలోనైనా బయటికి వెళ్లడం వ్యక్తుల ప్రాథమిక హక్కు అయినప్పటికీ, స్త్రీలు రాత్రుళ్లు రోడ్లపైకి రాకూడద’ని విరుచుకుపడ్డారు. ‘ప్రతి మహిళ ఇంటి ముందు పోలీసులను కాపలాగా పెట్టలేమం’టూ మహిళా భద్రతపై చేతులెత్తేశారు.
పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లో ఐక్యూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీ విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌ పరిసరాల్లో జరిగిన సామూహిక అత్యాచారం బెంగాల్‌లో మహిళా భద్రతా వైఫల్యాన్ని మరొకసారి బట్టబయలు చేసింది. ఒరిస్సాకు చెందిన విద్యార్థిని వైద్య విద్యనభ్యసించేందుకు ఆ కాలేజీలో చేరింది. శుక్రవారం రాత్రి తన స్నేహితునితో కలిసి డిన్నర్‌కు క్యాంపస్‌ వెలుపలికి వెళ్లగా విద్యార్థినిని మృగాళ్లు అటకాయించి చేతిలోని ఫోన్‌ను లాక్కొని, దగ్గరలోని దట్టమైన చెట్లలోకి బలవంతంగా లాక్కెళ్లి, అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం బయటికి చెబితే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని దుండగులు బాధితురాలిని భయపెట్టారు. ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బాధితురాలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. కాగా విద్యార్థినిని డిన్నర్‌కు బయటికి తీసుకెళ్లిన యువకుడు మధ్యలోనే పరారయ్యాడని అంటున్నారు. అందుకే అతనిపైనా అనుమానాలు కలుగుతున్నాయి. అత్యాచారంలో ఈ ఫ్రెండ్‌ పాత్ర తెలియాలంటే పోలీస్‌ దర్యాప్తు ముమ్మరంగా జరగాలి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని దుర్గాపూర్‌, కోల్‌కతా, బెంగాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్‌ బెంగాల్‌లో మహిళలకు సరైన భద్రత కల్పించాలని మమత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిరుడు ఆగస్టులో ఆర్‌జి కర్‌ హాస్పిటల్లో రాత్రిపూట వైద్య విధుల్లో ఉన్న లేడీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఉదంతం సంచలనమైంది. అయినా బెంగాల్లో మమతా బెనర్జీ పాలనతీరు మారలేదు. మహిళలకు రక్షణ కల్పించడం లేదు. దీనికి తోడు మమత చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ఆటవిక చర్యలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఆర్‌జికర్‌ హాస్పిటల్ ఘటనలో అసలు నిందితులను వదిలేసి ఓ అమాయకుడిని అందులో ఇరికించేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో సివిక్‌ పోలీస్‌ వలంటీర్‌ సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు పడింది. అసలు నిందితులను వదిలేశారని నేటికీ బాధితురాలి కుటుంబం పోరాడుతూనే ఉంది.

ఆర్‌జి కర్‌ ఘోరాన్ని మరవకముందే దుర్గాపూర్‌ దారుణం సంభవించింది. ఈ ఏడాది జులైలో దక్షిణ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థినులపై జరుగుతున్న వరుస అత్యాచారాలు విద్యా సంస్థలు, వాటి పరిసరాల్లో భద్రతా చర్యల డొల్ల తనాన్ని ప్రశ్నిస్తున్నాయి. పటిష్టమైన భద్రత, నిఘా, అప్రమత్తపు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి.

అత్యాచారం వంటి దారుణాలు జరిగినప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. మర్యాదగా ప్రవర్తించాలి. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసానివ్వాలి. వారిలో ఆత్మవిశ్వాసం కలిగించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలాలి. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు భిన్నంగా మాట్లాడటం మాత్రం ఎంతో కాలం అధికారాన్ని నిలపలేవు. పైగా ప్రజల్లో పలచన చేస్తాయి. ఈ మాత్రం మమతకు తెలియవనుకోలేం. కానీ ఆమె మాటలు బాధిత మహిళల్ని మరింతగా బాధకు గురిచేసే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News