Saturday, August 1, 2026
29.7 C
Hyderabad

‘మమత’ను మరచి బెనర్జీ వ్యాఖ్యలు!?|EDITORIAL

మనిషిలో రాను రాను రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. సమాజంలో అత్యాచారాలు, హత్యలు, హత్యాకాండలు పెచ్చుమీరడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఏపీ, తెలంగాణ ఇలా దేశమంతటా అనేక రాష్ట్రాల్లో సభ్యసమాజం తలదించుకునేలా సంఘటనలు జరుగుతున్నాయి. చివరకు చిన్నారి బాలలపైనా కామాంధులు లైంగికదాడులకు పాల్పడడం దారుణం. బాలలపై ఉపాధ్యాయులే లైంగిక దాడికి తెగించడం దుర్మార్గపు చర్య. ఇలాంటి వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదు.

అక్కడక్కడా పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి. వెలుగు చూడనివెన్నో! కులాలు, మతాలు కలవని ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారు. పెళ్ళి కొడుకుల అడ్డు తొలగిస్తున్నారు. భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని, అనైతిక కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని, పిల్లల్ని, పిల్లలు ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని చంపడం వంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయంటే, వాటి పట్ల సమాజంలో భయం లేకపోవడం, చట్టాల్లో లొసుగుల వల్ల ప్రజల్లో ఇలాంటి పైత్యం పరాకాష్టకు చేరుతోంది. సైబర్ నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు కొదువే లేదు.

ఈ నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయి. అత్యాచార ఘటనపై స్పందిస్తూ, ‘అర్థరాత్రి ఆ అమ్మాయి ఒంటరిగా ఎందుకు బయటకు వచ్చింద?’ని పెడసరంగా ప్రశ్నించారు. ఒక సీఎంగా, అందునా మహిళ అయిన మమత ఇలాంటి విషయాల్లో అలా కనీస ఇంగితం లేకుండా మాట్లాడారు. గత కొన్నేళ్లుగా మహిళలపై నేరాల్లో బెంగాల్‌, కోల్‌కతా ముందువరసలో ఉంటున్నాయని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో వార్షిక నివేదికలు ఘోషిస్తున్నాయి. దుర్గాపూర్‌ అత్యాచార దుర్ఘటనను ఖండిస్తూ మహిళలు, విద్యార్థులు, డాక్టర్లు, సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే, దేశమంతా ఆవేదన పెల్లుబికుతుండగా, బాధ్యత కలిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత స్పందన బాధితురాలిని, కుటుంబ సభ్యులను, యావత్‌ మహిళాలోకాన్ని నివ్వెర పరచింది. ‘రాత్రిపూట క్యాంపస్‌ నుంచి బయటికి ఎందుకు వెళ్లింది? ఆ సమయంలో ఆమెకు ఏం పని?’ అని సీఎం యక్షప్రశ్నలు సంధించారు. అసహనం వ్యక్తం చేశారు. ‘ఏ సమయంలోనైనా బయటికి వెళ్లడం వ్యక్తుల ప్రాథమిక హక్కు అయినప్పటికీ, స్త్రీలు రాత్రుళ్లు రోడ్లపైకి రాకూడద’ని విరుచుకుపడ్డారు. ‘ప్రతి మహిళ ఇంటి ముందు పోలీసులను కాపలాగా పెట్టలేమం’టూ మహిళా భద్రతపై చేతులెత్తేశారు.
పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లో ఐక్యూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీ విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌ పరిసరాల్లో జరిగిన సామూహిక అత్యాచారం బెంగాల్‌లో మహిళా భద్రతా వైఫల్యాన్ని మరొకసారి బట్టబయలు చేసింది. ఒరిస్సాకు చెందిన విద్యార్థిని వైద్య విద్యనభ్యసించేందుకు ఆ కాలేజీలో చేరింది. శుక్రవారం రాత్రి తన స్నేహితునితో కలిసి డిన్నర్‌కు క్యాంపస్‌ వెలుపలికి వెళ్లగా విద్యార్థినిని మృగాళ్లు అటకాయించి చేతిలోని ఫోన్‌ను లాక్కొని, దగ్గరలోని దట్టమైన చెట్లలోకి బలవంతంగా లాక్కెళ్లి, అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం బయటికి చెబితే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని దుండగులు బాధితురాలిని భయపెట్టారు. ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బాధితురాలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. కాగా విద్యార్థినిని డిన్నర్‌కు బయటికి తీసుకెళ్లిన యువకుడు మధ్యలోనే పరారయ్యాడని అంటున్నారు. అందుకే అతనిపైనా అనుమానాలు కలుగుతున్నాయి. అత్యాచారంలో ఈ ఫ్రెండ్‌ పాత్ర తెలియాలంటే పోలీస్‌ దర్యాప్తు ముమ్మరంగా జరగాలి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని దుర్గాపూర్‌, కోల్‌కతా, బెంగాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్‌ బెంగాల్‌లో మహిళలకు సరైన భద్రత కల్పించాలని మమత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిరుడు ఆగస్టులో ఆర్‌జి కర్‌ హాస్పిటల్లో రాత్రిపూట వైద్య విధుల్లో ఉన్న లేడీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఉదంతం సంచలనమైంది. అయినా బెంగాల్లో మమతా బెనర్జీ పాలనతీరు మారలేదు. మహిళలకు రక్షణ కల్పించడం లేదు. దీనికి తోడు మమత చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ఆటవిక చర్యలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఆర్‌జికర్‌ హాస్పిటల్ ఘటనలో అసలు నిందితులను వదిలేసి ఓ అమాయకుడిని అందులో ఇరికించేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో సివిక్‌ పోలీస్‌ వలంటీర్‌ సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు పడింది. అసలు నిందితులను వదిలేశారని నేటికీ బాధితురాలి కుటుంబం పోరాడుతూనే ఉంది.

ఆర్‌జి కర్‌ ఘోరాన్ని మరవకముందే దుర్గాపూర్‌ దారుణం సంభవించింది. ఈ ఏడాది జులైలో దక్షిణ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థినులపై జరుగుతున్న వరుస అత్యాచారాలు విద్యా సంస్థలు, వాటి పరిసరాల్లో భద్రతా చర్యల డొల్ల తనాన్ని ప్రశ్నిస్తున్నాయి. పటిష్టమైన భద్రత, నిఘా, అప్రమత్తపు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి.

అత్యాచారం వంటి దారుణాలు జరిగినప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. మర్యాదగా ప్రవర్తించాలి. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసానివ్వాలి. వారిలో ఆత్మవిశ్వాసం కలిగించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలాలి. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు భిన్నంగా మాట్లాడటం మాత్రం ఎంతో కాలం అధికారాన్ని నిలపలేవు. పైగా ప్రజల్లో పలచన చేస్తాయి. ఈ మాత్రం మమతకు తెలియవనుకోలేం. కానీ ఆమె మాటలు బాధిత మహిళల్ని మరింతగా బాధకు గురిచేసే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

Latest News

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News