Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

FARM HOUSE|‘వ్యవసాయ క్షేత్రం’ రణ క్షేత్రం కాబోతోందా!?

సంచలనమైన CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డి CHALLENGE|సవాల్!
సీఎం ఛాలెంజ్ కు KCR|కేసీఆర్ FAMILY|ఫ్యామిలీ జవాబేంటి?
రేవంత్ అన్నంత పనీ చేస్తారా?
MINISTERS|మంత్రులను పంపుతారా? లేక తనే వెళతారా?
ఫాం హౌస్ పంచాయతీ పరాకాష్టకు…
ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే ఏంటి?
గులాబీల్లో గుబులు? హస్తంలో ఆందోళన?

కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ‘రామ’ బాణం విసిరితే, సీఎం మాజీ సీఎం కేసీఆర్ పై ‘ఫాం హౌస్’ అస్త్రం వదిలారా? రైతులకు వ్వయ‘సాయం’ విషయమై ప్రజాక్షేత్రంలో పట్టుపట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు, ఇప్పుడు కేసీఆర్ నివాసం ఉంటున్న వ్యవసాయ క్షేత్రాన్ని రణ క్షేత్రంగా మార్చబోతున్నాయా? భూమి పుత్రుల మెప్పు కోసం మాటల యుద్ధానికి దిగిన ఆ రెండు పార్టీలు సై అంటే సై అంటూ సవాళ్ళు విసురుకుంటున్నాయి. ప్రెస్ క్లబ్ కు రావాలని కేటీఆర్ సవాల్ తో కాంగ్రెస్ పై గెలిచామనుకుంటున్న బీఆర్ఎస్ సంబరం, 24 గంటలు గడవక ముందే సైలెంట్ అయింది. తెలివిగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ను కార్నర్ చేస్తూ, మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ‘మీరు అసెంబ్లీకి రండి.. లేదంటే నేనే మీ ఫాం హౌస్ కి వస్తాను. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ చేద్దాం. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నాను. మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటాం. మీ అనుభవం రాష్ట్రానికి ఉపయోగడాలి. అదీ కాదంటే మా మంత్రులను పంపిస్తా.. అదీ కుదరదంటే నేనే వస్తా…’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. సాధారణంగా అధికార పార్టీలు అసెంబ్లీ, చర్చకు భయపడతాయి. అందువల్ల అసెంబ్లీ పెట్టాలని, చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడమే ఇప్పటిదాకా చూశాం. అసెంబ్లీకి రా రమ్మని ప్రతిపక్ష నేతను ప్రభుత్వమే పిలవడం, ప్రతిపక్షం అందుకు భిన్నంగా కనిపించడం చాలా అరుదేగాక, ఆశ్చర్యం కూడా! అప్పుడెప్పుడో మల్కాజీగిరి ఎంపీగా కేటీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్ కెమెరాలు ఎగిరించిన కేసులో బాధితుడైన సీఎం రేవంత్ అన్నంత పనీ చేస్తారా? కేసీఆర్ ఫాం హౌస్ కు మంత్రులను పంపిస్తారా? లేక తానే వెళతారా? సీఎం సవాల్ కు కేసీఆర్ ఫ్యామిలీ సమాధానమేంటి? సీఎంను గోల్ గోల్ చేద్దామని బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ లో పడిందా? పొరపాటున కేటీఆర్ తొందరపడ్డారా? నిజంగా ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే ఏంటి? గులాబీల్లో శ్రేణుల్లో గుబులు, హస్తంలో ఆందోళన, రాజకీయాల్లో ఉత్కంఠ మొదలైంది. ఏం జరగనుంది?

హైదరాబాద్‌, జూలై 10 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సవాళ్ళు… ప్రతి సవాళ్ళు రాజకీయాల్లో షరా మామూలే! పరస్పరం సవాళ్ళు విసురుకోవడం తెలిసిందే. పొలిటికల్ మైలేజీ కోసమో, వ్యక్తిగత, పార్టీ పరమైన ప్రతిష్టల కోసమో, కేడర్ ను కాపాడుకోవడం కోసమో, నిత్యం వార్తల్లో ఉండటం కోసమో ఇలా చేయడం మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ పార్టీలకు చాలా సందర్భాల్లో ప్రజల కంటే కూడా పరిస్థితుల పట్లే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏ అవకాశాన్ని ఏవిధంగానైనా తమకు అనుకూలంగా మార్చుకోవడం పైనే వాటి ద్రుష్టి ఉంటుంది. రాజకీయాల్లో ఇవేవీ కొత్త కాకపోయినా, తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితిలో కొంత తీవ్రత ఎక్కువ కనిపిస్తోంది.

రైతులకు మీ కంటే మేమే ఎక్కువ చేశామన్న అంశంపై సవాల్, ప్రతి సవాళ్ళు మొదలయ్యాయి. జూలై 4న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి‘రాష్ట్రంలో రైతు రాజ్యం రావడానికి మేమే కారణమని, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికగా ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని, ఈ చర్చకు మోడీ వస్తారో, కిషన్ రెడ్డి వస్తారో, కేసీఆరే వస్తారో రావాల’ని సవాల్ విసిరారు. దీంతో కేటీఆర్ కల్పించుకుని కేసీఆర్ దాకా ఎందుకు నేనే వస్తానని, కొండారెడ్డిపల్లె, కొడంగల్, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. 72 గంటల్లోగా సీఎం స్పందించకపోతే, తాను జూలై 8న సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ కు వస్తానని, సీఎం రావాలని సవాల్ విసిరారు. పొన్నం ప్రభాకర్ వంటి మంత్రులు, జగ్గారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు క్లబ్ లు కాంపౌండ్లు కాదు అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రండని పిలుపునిచ్చారు. అయితే కేటీఆర్ 8న తన పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ కి చేరారు. సీఎం సవాల్ స్వీకరించి తాను వచ్చానని, సీఎం కోసం తన పక్కనే ఒక సీటును ఖాళీగా పెట్టి మరీ, ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం అనూహ్యంగా కేటీఆర్ ఊసే లేకుండా, మాజ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అక్కడే రైతు రాజ్యంపై చర్చిద్దామని, కేసీఆర్ ఎలాంటి అగౌరవం కలగకుండా చర్చ చేద్దామన్నారు. ఆయన అనుభవాలను రాష్ట్ర ప్రగతికి ఉపయోగిద్దామన్నారు. ఆయన రానంటే ఆయన ఉన్న ఫాం హౌస్ కే తన మంత్రులను పంపుతానని, కాదంటే తానే స్వయంగా వస్తానని సుతిమెత్తగా సవాల్ విసిరారు. ఈ సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమై, చర్చగా మారింది.

సాధారణంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధుల చర్చకు అసెంబ్లీయే అసలైన వేదిక కావడంతో సీఎం చేసిన సవాల్ న్యాయ, చట్టబద్ధంగానే కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, సాధారణానికి భిన్నంగా ప్రతిపక్షం చేయాల్సిన డిమాండ్ ను ప్రభుత్వమే చేయడం కొంత ఆశ్యర్యమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎం ను ప్రెస్ క్లబ్ కి రమ్మనడం తప్పు కాదు. సీఎం ప్రెస్ క్లబ్ కి వెళ్ళడం కూడా తప్పు కాదు. కానీ ఇలాంటి సవాల్ పై చర్చకు వెళ్ళడం అసాధారమవుతుంది. బహుషా సీఎం ఎలాగూ రారనే కేటీఆర్ క్లబ్ ను వేదికగా ఎంచుకుని ఉంటారు. పైగా ఆయన షెడ్యూల్ ఢిల్లీలో ఉండటం మరో కారణం కావచ్చు.

కానీ, అనూహ్యంగా సీఎం స్పందించడం, నేరుగా తానే ఫాం హౌస్ కి వెళతానని చెప్పడం కేసీఆర్ ఫ్యామిలీ సహా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘రైతు రాజ్యంపై అసెంబ్లీ, పార్లమెంట్ లో చర్చకు సిద్ధ’మన్న సవాల్ రూపంలో సీఎం రేవంత్ విసిరిన వలలో కేసీఆర్ కుటుంబం పడిందా? అనవసరంగా సీఎం సవాల్ కు కేటీఆర్ స్పందించారా? అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. కేటీఆర్ సీఎంకు విసిరిన సవాల్ సంబరం 24 గంటలు కూడా నిలవక ముందే సీఎం విసిరిన సవాల్ గులాబీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వస్తే అసెంబ్లీకి రా రానంటే చెప్పు నీవున్న కాడికే వస్తా. అదీ కాదంటే మా మంత్రులను పంపిస్తా… అనడం మామూలు సవాల్ గా మాత్రం కనిపించడం లేదని బీఆర్ఎస్ నేతలు కొందరు అంటున్నారు. గతంలో కేటీఆర్ ఫాం హౌస్ కు పోయి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన కేసులో బాధితుడిగా ఉన్న సీఎం, ఇప్పుడు కూడా అన్నంత పనీ చేస్తే ఏంటి? నిజంగానే మంత్రులనో పంపో, లేక తానే ఫాం హౌస్ కు వెళితే ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సీఎం రారని తెలిసీ, ప్రెస్ క్లబ్ లో చేసిని హడావుడి కంటే, ఇప్పుడు సీఎం చేసిన సవాల్ నే ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఏ విషయాన్నైనా తెగేదాకా లాగడం అవసరమా? ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసలే అసెంబ్లీకి వెళ్ళని ఈ పరిస్థితుల్లో ఈ సవాళ్ళు అవసరమా? అన్న ప్రశ్నలను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా జరగకపోయినా, నిజంగానే సీఎం ఫాం హౌస్ కు వెళితే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుంది? మైలేజీ ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ లో మరో ఆసక్తి చర్చ జరుగుతోంది. వ్యవసాయ క్షేత్రం పోరాటం రేవంత్ రెడ్డికి కలిసే వస్తున్నదట. మొత్తానికి అసెంబ్లీ చర్చ ఫాం హౌస్ రచ్చగా మారడం సర్వత్రా రాజకీయ ఉత్కంఠగా మారింది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News