Friday, July 31, 2026
25.7 C
Hyderabad

నన్నెవరూ Gandhibhavan|గాంధీ భవన్‌కు పిలవలేదు…

గాంధీ భవన్ లో Konda Murali|కొండా మురళీ |Warangal

TELANGANA| తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత గందరగోళం సాగుతోంది. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇందుకోసం ఆయన గాంధీ భవన్‌కు రాగా, పార్టీ అధిష్ఠానం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. MALLU RAVI| మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీకి ఆయన పూర్తి స్థాయిలో తన వాదనలు వినిపించారు. మాట్లాడాల్సిన అంశాలు స్వయంగా చెప్పారు. కొన్నింటిని వాయిస్ ద్వారా, మరికొన్నింటిని వ్రాతపూర్వకంగా వినతి పత్రాల రూపంలో సమర్పించారు.

గాంధీ భవన్‌కు తనను ఎవ్వరూ ఆహ్వానించకపోయినా, పార్టీపై, TPCC CHIEF| పీసీసీ చీఫ్ MAHESH KUMAR GOUD| మహేష్ కుమార్ గౌడ్‌పై అభిమానంతోనే వచ్చానని కొండా మురళి స్పష్టం చేశారు. పార్టీ కమిటీ ఎదుట తనపై ఎలాంటి ప్రశ్నలు రాకపోయినా, తానే స్వయంగా ఆరోపణలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తాను బద్ధమైన వర్గస్థుడినని, బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. తనను బెదిరించే ప్రయత్నాలు చేయొద్దని, చావుకే భయపడని వ్యక్తినని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మురళి, పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తాను, తన భార్య KONDA SUREKHA| కొండా సురేఖ ఇద్దరూ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి వచ్చామని అన్నారు. ఇదే సమయంలో పార్టీలోకి వచ్చి పదవులను ఆస్వాదిస్తూ, రాజీనామా చేయని KADIYAM SRIHARI| కడియం శ్రీహరి వివాదాస్పద పాత్ర పోషిస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోకి ఆయన వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయని, వరంగల్ జిల్లాలో శాంతిని దెబ్బతీసే విధంగా పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సురేఖ, సీతక్కల మధ్య తప్పుడు ప్రచారాలతో విభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

PARKAL| పరకాల నియోజకవర్గం తమదేనని స్పష్టం చేసిన మురళి, REVURI PRAKASH REDDY|రేవూరి ప్రకాష్ రెడ్డిని తాము గెలిపించామన్నారు. తాము నిస్వార్ధంగా మద్దతు ఇచ్చినా, ఇప్పుడు రేవూరి మరిచిపోయి గుడుపుటాని రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. NAINI RAJENDER REDDY| నాయిని రాజేందర్ రెడ్డి తనకు సంబంధం లేని నియోజకవర్గాల్లోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వ పోస్టులను సంపాదించుకుంటున్నాడని ఆరోపించారు. ఈ తరహా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మచ్చ తేల్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇందిర అనుచరులపై కడియం శ్రీహరి టార్చర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరకు రాజకీయంగా ఎదురుదెబ్బ ఇచ్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. VEM NARENDER REDDY| వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కోల్పోయిన ఘటనకు తానే కారణమన్న కోపంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. కానీ తాను పార్టీ మారిన సమయంలో అన్ని నిబంధనలకు కట్టుబడి, నియమానుసారం రాజీనామా చేసి వచ్చినట్లు గుర్తు చేశారు. తనతో పాటు 26 మంది కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ గూటికి తెచ్చిన ఘనత తనదేనని చెప్పారు.

ఇంత జరుగుతున్నా, పార్టీ నాయకత్వంపై గౌరవం ఉంచుతున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లపై నమ్మకం ఉందని తెలిపారు. వారి పాత్రను పక్కదారి పట్టించే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు. పార్టీ పెద్దలు సమస్యలను సీరియస్‌గా తీసుకుని పరిష్కారం చేయాలని సూచించారు.

ఇక మల్లు రవికి ఇచ్చిన లేఖలోనూ కొండా మురళి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మంత్రి PONGULETI SRINIVAS REDDY| పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేఖ మంత్రిత్వ పదవికి భంగం కలిగించేందుకు కడియం విష ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. రేవూరి, గండ్రలు తమ మద్దతుతో గెలిచి ఇప్పుడు వ్యతిరేక శిబిరంగా మారారని తెలిపారు.

మొత్తంగా, కాంగ్రెస్‌లోనూ ప్రాంతీయ ఆధిపత్య పోరాటాలు, విభేదాలు పార్టీకి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా మురళి లేఖపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే ఈ వ్యవహారం, రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News