Friday, April 10, 2026
26.7 C
Hyderabad

నన్నెవరూ Gandhibhavan|గాంధీ భవన్‌కు పిలవలేదు…

గాంధీ భవన్ లో Konda Murali|కొండా మురళీ |Warangal

TELANGANA| తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత గందరగోళం సాగుతోంది. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇందుకోసం ఆయన గాంధీ భవన్‌కు రాగా, పార్టీ అధిష్ఠానం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. MALLU RAVI| మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీకి ఆయన పూర్తి స్థాయిలో తన వాదనలు వినిపించారు. మాట్లాడాల్సిన అంశాలు స్వయంగా చెప్పారు. కొన్నింటిని వాయిస్ ద్వారా, మరికొన్నింటిని వ్రాతపూర్వకంగా వినతి పత్రాల రూపంలో సమర్పించారు.

గాంధీ భవన్‌కు తనను ఎవ్వరూ ఆహ్వానించకపోయినా, పార్టీపై, TPCC CHIEF| పీసీసీ చీఫ్ MAHESH KUMAR GOUD| మహేష్ కుమార్ గౌడ్‌పై అభిమానంతోనే వచ్చానని కొండా మురళి స్పష్టం చేశారు. పార్టీ కమిటీ ఎదుట తనపై ఎలాంటి ప్రశ్నలు రాకపోయినా, తానే స్వయంగా ఆరోపణలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తాను బద్ధమైన వర్గస్థుడినని, బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. తనను బెదిరించే ప్రయత్నాలు చేయొద్దని, చావుకే భయపడని వ్యక్తినని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మురళి, పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తాను, తన భార్య KONDA SUREKHA| కొండా సురేఖ ఇద్దరూ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి వచ్చామని అన్నారు. ఇదే సమయంలో పార్టీలోకి వచ్చి పదవులను ఆస్వాదిస్తూ, రాజీనామా చేయని KADIYAM SRIHARI| కడియం శ్రీహరి వివాదాస్పద పాత్ర పోషిస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోకి ఆయన వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయని, వరంగల్ జిల్లాలో శాంతిని దెబ్బతీసే విధంగా పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సురేఖ, సీతక్కల మధ్య తప్పుడు ప్రచారాలతో విభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

PARKAL| పరకాల నియోజకవర్గం తమదేనని స్పష్టం చేసిన మురళి, REVURI PRAKASH REDDY|రేవూరి ప్రకాష్ రెడ్డిని తాము గెలిపించామన్నారు. తాము నిస్వార్ధంగా మద్దతు ఇచ్చినా, ఇప్పుడు రేవూరి మరిచిపోయి గుడుపుటాని రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. NAINI RAJENDER REDDY| నాయిని రాజేందర్ రెడ్డి తనకు సంబంధం లేని నియోజకవర్గాల్లోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వ పోస్టులను సంపాదించుకుంటున్నాడని ఆరోపించారు. ఈ తరహా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మచ్చ తేల్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇందిర అనుచరులపై కడియం శ్రీహరి టార్చర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరకు రాజకీయంగా ఎదురుదెబ్బ ఇచ్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. VEM NARENDER REDDY| వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కోల్పోయిన ఘటనకు తానే కారణమన్న కోపంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. కానీ తాను పార్టీ మారిన సమయంలో అన్ని నిబంధనలకు కట్టుబడి, నియమానుసారం రాజీనామా చేసి వచ్చినట్లు గుర్తు చేశారు. తనతో పాటు 26 మంది కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ గూటికి తెచ్చిన ఘనత తనదేనని చెప్పారు.

ఇంత జరుగుతున్నా, పార్టీ నాయకత్వంపై గౌరవం ఉంచుతున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లపై నమ్మకం ఉందని తెలిపారు. వారి పాత్రను పక్కదారి పట్టించే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు. పార్టీ పెద్దలు సమస్యలను సీరియస్‌గా తీసుకుని పరిష్కారం చేయాలని సూచించారు.

ఇక మల్లు రవికి ఇచ్చిన లేఖలోనూ కొండా మురళి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మంత్రి PONGULETI SRINIVAS REDDY| పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేఖ మంత్రిత్వ పదవికి భంగం కలిగించేందుకు కడియం విష ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. రేవూరి, గండ్రలు తమ మద్దతుతో గెలిచి ఇప్పుడు వ్యతిరేక శిబిరంగా మారారని తెలిపారు.

మొత్తంగా, కాంగ్రెస్‌లోనూ ప్రాంతీయ ఆధిపత్య పోరాటాలు, విభేదాలు పార్టీకి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా మురళి లేఖపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే ఈ వ్యవహారం, రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News