Friday, March 13, 2026
24.7 C
Hyderabad

ASSEMBLY|అసెంబ్లీ వేదికగా… సమరానికి సై!|WAR

చట్ట సభల్లో వార్!?
మాటల యుద్ధం!!
కయ్యానికి CONGRESS|కాంగ్రెస్ సిద్ధం
దండెత్తనున్న BRS|గులాబీ గళం
కథన రంగంలోకి BJP|కమలదళం
మూమెంట్ ను బట్టి AIMIM|ఎంఐఎం
అస్త్రశస్త్రాలతో అధికార పక్షం
కత్తులు నూరుతున్న విపక్షాలు
ఆరు గ్యారెంటీలే వాటి అస్త్రాలు
రాష్ట్రం దివాళే అభివ్రుద్ధికి ఆటంకం
బీసీలకు 24శాతం రిజర్వేషన్ల బిల్లు, జీవో
సెప్టెంబర్ రెండో వారంలోనే స్థానిక నోటిఫికేషన్
కాళేశ్వరం అవినీతిపై కమిషన్ నివేదిక బహిర్గతం
ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక భారాలే GOVERNMENT|సర్కార్ కు శస్త్రాలు
వాడివేడిగా ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు

ఓవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశ పెట్టొద్దని హై కోర్టులో భంగపడ్డ మామా అల్లుళ్ళు కేసీఆర్, హరీశ్ రావులు, తాజాగా మధ్యంతర దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అసెంబ్లీలో చర్చించినా సరే, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు ఆ నివేదికనే సస్పెండ్ చేయాలని వారు కోరారు. మరోవైపు ఈ రోజే అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి, చర్చించేందుకు సర్కార్ సంసిద్ధమైంది. ఇదే కాకుండా, అధికార పక్షం, ప్రతిపక్షంపై మరిన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది. బీసీలకు 24శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చించి, ఆ వెంటనే జీవోను తేనుంది. సెప్టెంబర్ రెండో వారంలోనే స్థానిక నోటిఫికేషన్ వెలువడేలా చకచకా పావులు కదుపుతోంది. ఇంకా.. ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక భారాలు వంటి, శస్త్రాలను సంధించడానికి సిద్ధం చేసుకుంది. ప్రతిపక్షాలని పూర్తిగా కట్టడి చేయడానికి ప్రత్యేకంగా తమ డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన సెలెక్టెడ్ టీమ్ కు తగిన తర్ఫీదు ఇచ్చి, తయారు చేసుకుంది. అయితే, ప్రతిపక్షం రాష్ట్రంతో సంబంధంలేని యూరియాను, అరిగిపోయిన రికార్డుగా మారిన ఆరు గ్యారెంటీలను, ప్రకృతి వైపరీత్యమైన వర్షాలను అస్త్రాలను చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తమ ఉనికిని చాటుకోవడానికి బీజేపీ రెఢీ అంటున్నా, యూరియా సరఫరా, బీసీ బిల్లు వంటి అంశాలు ఆ పార్టీకి ముగుతాడు వేస్తున్నాయి. ఎంఐఎం సందర్భాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో సిద్ధంగానే ఉంది. అసెంబ్లీ సమరానికి సై అంటున్నపార్టీలతో సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి. కాగా, కాలం కలిసొచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్, ఆగస్టు 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సీన్ రివర్స్ అయింది. సిన్మా అసాధారణంగా ప్రతిపక్షానికి కనిపిస్తోంది. ఆడ లేక ఓడే అధికార పార్టీ, ఆడించే స్థానానికి చేరింది. తెలంగాణలో నేటి నుండి జరుగనున్న ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఒక విచిత్ర పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలంటే అధికార పార్టీకి ఎక్కడో బెరుకు, వెన్నులో వణుకు ఉంటాయి. కానీ ఈసారి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్సాహంగా ఉరుకలు వేస్తోంది. సభకైనా, సవాళ్ళకైనా, సమరానికైనా సై అంటున్నది.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బయటి చలిని మరిపించే, వాడి వేడిగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రతిపక్షమే డిఫెన్స్ లో ఉంది. అధికార పక్షం అఫెన్స్ లో ఉంది. మిగతా పార్టీలు అసలు ఈ ఆట ఆడాలో తెలియని ఆయోమయంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది.
అందుకు తగ్గ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుని అన్నింటికీ సంసిద్ధంగా ఉంది. కానీ, ప్రతిపక్షం మాత్రం ఈ సారి సభకు భయపడుతున్నట్లుగా ఉంది. బెరుకుగా, వణుకుగా కనిపిస్తోంది. మాటల్లో ఉండే వాడి, వేడి మెల్లగా కొరవడుతోంది. కాళేశ్వరం అవినీతిపై వేసిన కమిషన్ నివేదిక ఆపార్టీకి ఆశనిపాతంగా, భీతావహంగా మారింది. అందుకే మామా అల్లుళ్ళ కోర్టుల గుమ్మాలను ఎక్కుతూ, మొక్కుతూ ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వంటివేవోవో వారు వదలించుకున్నా, విదిలించుకున్నా, వారిని వదిలేలా లేవు. వదిలించేలా సీఎం లేరు. కోర్టులు, నిబంధనలు, సభా నియమాలు, చివరకు కాలం కూడా వారికి కలిసి వచ్చేలా లేవు. బీఆర్ఎస్ ను అధికార పార్టీ అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ప్రజా కోర్టు బోనులో దోషిగా నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

మరోవైపు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై త్వరలోనే వెలువడనున్న నోటిఫికేషన్ ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిర చేయనున్నాయి. అరిగిపోయిన ఆరు గ్యారెంటీల గ్రామఫోన్ రికార్డు కూడా వారిని గట్టెక్కించేలా కనిపించడం లేదు. అసెంబ్లీలో పడే అవినీతి మచ్చతోనే స్థానిక సమరానికి వెళ్లాల్సిన పరిస్థితిని రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షానికి కల్పించనున్నారు.

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బయటి చలిని మరిపించే, వాడి వేడిగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రతిపక్షమే డిఫెన్స్ లో ఉంది. అధికార పక్షం అఫెన్స్ లో ఉంది. మిగతా పార్టీలు అసలు ఈ ఆట ఆడాలో తెలియని ఆయోమయంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది.
కయ్యానికి మేం సైతం అంటున్నకమల దళం, ప్రధాన ప్రతిక్షం బీఆర్ఎస్ ల మధ్య కాంగ్రెస్ ఉన్నా, వేటికవే ఆ పార్టీలను కట్టడి చేయడానికి ప్రభుత్వం రెఢీ అయిందని తెలుస్తోంది. అందుకు అంశాల వారీగా, బీఆర్ఎస్ ను, బీజేపీని, అవసరమైతే ఎంఐఎంను కూడా అడ్డుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అటు భాజాపా, భారాసా మధ్యలో కాంగ్రెస్
ఎంఐఎం కూడా వారి స్థాయిలో వారు తమ మంత్రి వర్గాన్ని, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలలో తగిన సబ్జెక్ట్, వాగ్ధాటి ఉన్న వారిని గుర్తించి, వేర్వేరుగా తయారు చేసినట్లు తెలుస్తోంది. సభలో అధికార పార్టీని ఇరుకున పెట్టే అంశాలు వచ్చినప్పుడు వ్యవహరించే తీరుతోపాటు, ఎదురుదాడి చేసేందుకు తగిన తర్ఫీదు ఇచ్చినట్ల సమాచారం. ఈసారి ప్రతిపక్షాలను అష్ట దిగ్బంధనం చేసి, అన్ని విధాలుగా పై చేయి సాధించాలని పాకులాడుతున్నట్లుగా సమాచారం.

సీఎం సహా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్, సీతక్క, పొన్నం, లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మందుల సామెల్, వేముల వీరేశం, కడియం, దానం వంటి ఎమ్మెల్యేలు మండలిలో మరికొందరిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

దీనికి దీటుగా కాగ్ నివేదికలు, ఆరు గ్యారెంటీల అమలు, ప్రభుత్వంలో అవినీతి, యూరియా, వర్షాకాల వైపరీత్యం, రైతాంగ సమస్యలు వంటి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
ఇక మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ యథావిధిగా ఈసారి కూడా అసెంబ్లీకి హాజరయ్యేలా లేరు. దీంతో ఆ భారతమంతా కేటీఆర్, హరీశ్ రావులు, మధ్య మధ్య జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి వారిపై పడనుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగున్నాయి.

సర్కార్ లో వర్షాతిరేకాలు!
కాంగ్రెస్ కు కలిసొచ్చిన ‘కాలం’

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడో లేదో తెలియదు కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కాలం కలిసే వచ్చింది. తెలంగాణలో నిన్న మొన్నటి దాకా కురుస్తూనే ఉన్న భారీ వర్షాలు కాంగ్రెస్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే, సర్కార్ లో మాత్రం వర్షాతిరేకాలు వెల్లడవుతున్నాయి. కరువు నుంచి కరువు తీరా పడిన వానలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కలిసివచ్చిందనే చెప్పాలి. వర్షాల్లేక రైతుల ఆందోళన ప్రభావం నేరుగా ప్రభుత్వంపై పడింది. మరోవైపు అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర ఖజానా వెక్కిరిస్తోంది. అప్పులకు వడ్డీలు కట్టలేని దీన స్థితి దిక్కుమాలి ఉంది. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దైన్యం దర్జాగా తిష్టేసిం. రెగ్యులర్ పథకాలకు కూడా నిధుల కొరత తిక్కలేపుతోంది. యువ వికాసం లాంటి పథకాలను లాంచ్ చేయలేక లబోదిబోమంటున్నది సర్కార్.
ఈ సమయంలోనే వానలు లేక దిగాలు పడిన రైతులు నేరుగా సర్కార్ నే టార్గెట్ చేశారు. వర్షాల్లేవ్, రైతు బంధు వస్తదో రాదో? పంట నష్టాలు ఎలాగూ సర్కార్ ఇవ్వదు. వీటిని ఎవరు భరించాలె? సర్కార్ వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ మరీ రైతులు తిట్టిపోశారు. ఇక ఇప్పుడు వద్దంటే వానలు కురిసి రైతులు పంటల పనుల్లో బిజీగా మారారు. ఎవరి పనుల్లో వారున్నారు. దీంతో రైతుల నుంచి, కాలం కావడంలేదన్న ఇతర అన్ని వర్గాల నుంచి సర్కార్ పై వ్యతిరేకత తగ్గిందనే చెప్పాలి. జనగామ జిల్లా లాంటి ఎత్తైన మెట్ట ప్రాంతాల్లో మాత్రం వర్షాలు సాధారణ స్థాయిలో కూడా కురవలేదు. పైగా, చెరువులు, కుంటలు నిండక, కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు ఇంకా వర్షాకాలం మిగిలే ఉన్నందున అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, నిన్న, మొన్నటి పరిస్థితుల కంటే ఓవర్ ఆల్ గా సర్కార్ పై వ్యతిరేకత చాలా వరకు తగ్గింది.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News