Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

ఎమ్మెల్యే సంచలనాలు!

ఆ మాటల మర్మమేంటి?!

జడ్చర్ల ఎమ్మెల్యే టార్గెట్ ఎవరు?!

అన్యాయమైతున్న ఆ రైతులు ఎవరు?

ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నదెవరిని?

ప్రభుత్వంలో ఉన్న కొంత మంది ఆ పెద్దలు ఎవరు?

ఈ గజిబిజి గందరగోళం కంటే సీఎం జోక్యం చేసుకుంటే పోలా?

హైదరాబాద్ లో జనవరి 31వ తేదీ రాత్రి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ సమావేశం నిర్వహించి సెన్సేషన్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, వారం తిరగక ముందే మరో సంచలనానికి తెర లేపారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను నిశ్శబ్దంగా ఉండలేనని, రైతుల కోసం తెగించి మాట్లాడతానని స్పష్టం చేశారు. “నేను బయటికి వచ్చి ఈ విషయం చెబుతున్నా. ఇప్పుడు ఆ పెద్దవాళ్లు నన్ను చంపేస్తారా, లేక రైతులకు న్యాయం చేస్తారా అనేది చూడాలి” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమై, చర్చనీయాంశంగా మారాయి.

జనవరి 31న ఏడుగురు ఎమ్మెల్యేలతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఎమ్మెల్యే అనిరుధ్ కీలక సమావేశం నిర్వహించారు. భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్), మురళీ నాయక్ (మహబూబాబాద్) కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూలు), సంజీవరెడ్డి (నారాయణఖేడ్), అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), బీర్ల అయిలయ్య (ఆలేరు) లు తెలిసో, తెలియకో హాజరయ్యారు. ఎందుకు భేటీ అయ్యారన్న అంశం పై ఎవరూ పెదవి విప్పలేదు. అనిరుధ్ రెడ్డి మాత్రం మా సమస్యలను మేము చర్చించుకున్నాం. వేరే ఉద్దేశాలు లేవని, మామూలు మీట్ గా తేల్చి చెప్పారు. ఇది కాస్త సంచలనం అయింది. సీఎం రేవంత్ రెడ్డి గతంలోలా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, మంత్రులు ఎమ్మెల్యేలను వారి విజ్ఞాపనలను లెక్కచేయడం లేదన్న వార్తలు గుప్పుమన్నాయి.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు లేక తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అవేదన చెందుతున్నట్లుగా “అడుగు” ఎమ్మెల్యేల మనోగతం గా వారి అభిప్రాయాలను సైతం బయట పెట్టింది. వెంటనే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి రంగంలోకి దిగారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయిన ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో ఇంటలిజెన్స్ ఆరా! దాకా పరిస్థితులు వెళ్లాయి. మల్లు రవి మీడియా తో మాట్లాడుతూ ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయాలు తప్ప అందులో రాజకీయ అంశాలేవి లేవని తేల్చేశారు. తమ భేటీ కి ఏ ప్రాధాన్యం లేదని ఎంపీ మల్లు రవి చెప్పడాన్ని అనిరుద్ రెడ్డి విమర్శించారు. రెండు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లందరితో కలిపి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలేవైనా సరే తన దృష్టికి తేవాలని సీఎం ఎమ్మెల్యేలకు చెప్పారు. మంత్రులు సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఆదేశించారు. అంతేకాదు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇది గడిచిన రెండు మూడు రోజుల్లోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి మాటల తూటాలు పేల్చారు.

ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే, ఎవరా పెద్దలు అనే విషయాన్ని మాత్రమ చెప్పడం లేదు. బహుశా అది బ్రహ్మ రహస్యం కావచ్చు. అన్యాయమైపోతున్న ఆ రైతులు ఎవరు? అన్న విషయంలోనూ క్లారిటీ లేదు. ఆ రైతులు రాష్ట్ర రైతులా? తన నియోజకవర్గ రైతులా? వాళ్ళు నష్ట పోతున్న అంశాలు కూడా వెల్లడి చేయడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఆయన చెబుతున్నట్లుగా నష్టపోతున్న రైతులు ఎవరన్న గుట్టు ఆయనే విప్పాలి. “నేను బయటికి వచ్చి ఈ విషయం చెబుతున్నా. ఇప్పుడు ఆ పెద్దవాళ్లు నన్ను చంపేస్తారా, లేక రైతులకు న్యాయం చేస్తారా అనేది చూడాలి” అంటూ ఆయన మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రైతుల న్యాయానికి ఎమ్మెల్యే ప్రాణానికి ఉన్న లెంక ఏంటో తేలాలి? అయితే ఆ పెద్దవాళ్ళు ఒక ఎమ్మెల్యేని సైతం చంపగలిగిన వారా? వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారా?! ఒక ఎమ్మెల్యే ఈ స్థాయి మాటలని ఊరకనే కొట్టిపారేయలేం. అలాగని అలా వదిలేయలేం. ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తి మాటలను ఏ విధంగా తీసుకోవాలి? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం అయితే ఆయన సమస్యను కూడా వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి. ప్రభుత్వ పరమైతే వెంటనే తగు విధంగా సీఎం దృష్టికి, అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు. కానీ, స్పష్టత లేని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యల వల్ల అటు రాజకీయాల్లో ఇటు నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా గందరగోళం ఏర్పడుతున్నది. ప్రభుత్వానికి, సీఎం కి కూడా చెడ్డ పేరు వస్తున్నది. వెంటనే సీఎం ఈ అంశంపై స్పందించాలి. తగు విచారణ చేపట్టాలి. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన లేదా రైతుల సమస్యపై స్పష్టతనివ్వాలి. ఎమ్మెల్యేగా స్థానికం నుండి సీఎం దాకా తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చు. లేదంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ సంచలనాలు మాని, బాధ్యత గల ప్రజా ప్రతినిధి కాబట్టి, తన ప్రాణాలు కాపాడుకుంటూనే, రైతులకు న్యాయం జరిగే విధంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడితే బెటరేమో!

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News