Friday, July 17, 2026
26.4 C
Hyderabad

Bc|బలహీన వర్గాలకు న్యాయం చేయడమే Government|ప్రభుత్వ లక్ష్యం|Goal

Assembly|శాసనసభలో CM|ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి|Revanth Reddy

తెలంగాణ శాసనసభ బీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బలహీన వర్గాలకు అనుమానం కలిగేలా అబద్ధపు ప్రచారాలు చేయొద్దని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరారు. Resrvations|రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వమే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. మొదట బీసీల వివరాలను సేకరించే బాధ్యత STATE BC COMMISSION|రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించామని చెప్పారు. అయితే, బీసీ కమిషన్ కాకుండా ప్రత్యేక డెడికేషన్ కమిషన్|DEDICATION COMMISSION ద్వారా సమాచార సేకరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ (30381/2024) వేశారని, ఆ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు వచ్చిన వెంటనే చిత్తశుద్ధితో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కుల సర్వే చేపట్టామని ఆయన తెలిపారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కుల సర్వే జరిపామని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నామని, అధికారుల కమిటీని, మంత్రులను బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పంపించి సమాచారాన్ని సేకరించామని ఆయన శాసనసభ్యులకు వివరించారు. న్యాయపరమైన సమస్యలను విశ్లేషించిన తరువాతే డెడికేషన్ కమిషన్ నియమించామని చెప్పారు. అలాగే ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశామని, ఏడాదిలో పకడ్బందీగా చట్టాన్ని రూపొందించి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గ తీర్మానం చేసి, శాసనసభలో ఆమోదం పొంది రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించామని తెలిపారు. అయితే, గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారని, ఆ బిల్లులు గత ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు గుదిబండగా మారిందని విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసే చర్యలు తీసుకువచ్చిందని, కానీ గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌ను కూడా రాష్ట్రపతికి పంపారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరవెనక లాబీయింగ్ కారణంగానే ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదని, అత్యవసరమైతే బిల్లును తిరిగి సభలో ఆమోదించుకుంటామని చెప్పారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల గంగుల కమలాకర్ సంతోషంగా ఉన్నారని, కానీ ఆయన పార్టీ నాయకులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీ కమిషన్ గానీ, డెడికేషన్ కమిషన్ గానీ ఏది అయినా తమ ఉద్దేశం బలహీన వర్గాలకు న్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లలేదని GANGULA KAMALAKAR|గంగుల కమలాకర్ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రధానికి ఐదుసార్లు లేఖ రాసినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, అందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని తెలిపారు. ఆ ధర్నాకు వివిధ రాష్ట్రాల 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, అయితే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మాత్రం పాల్గొనలేదని విమర్శించారు. దీంతో BRS|బీఆర్ఎస్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉందో…లేదో… అర్థమవుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లులు ఆమోదం పొందకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగించేలా ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే|Social Justice Day|గా జరుపుకోవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వందేళ్లుగా చేయని పనిని తమ ప్రభుత్వం ప్రారంభించిందని, ఆ ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. గంగుల కమలాకర్ బలహీన వర్గాల ప్రయోజనాల విషయంలోనైనా ఒత్తిడులకు లొంగరాదని కోరారు. బలహీన వర్గాలు ఒకరినొకరు అవమానించుకోవడం మానుకుని ఏకతాటిపై రావాలని సూచించారు. మొత్తంగా, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఈ లక్ష్యానికి అనుగుణంగానే అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News