గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి గ్రామీణ క్రీడల పోటీలు ఎంతో ఉపయోగపడతాయని పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ అన్నారు. పోటీ తత్వంతో క్రీడా స్ఫూర్తిని చాటుతూ యువత ఆటలు ఆడాలని చెప్పారు. ఐక్యతతో యువత సన్మార్గంలో నడవడానికి ఇలాంటి పోటీలు వేదికలు కావాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గూడూరు వాలీబాల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి గ్రామీణ వాలీబాల్ పోటీలు ఇవ్వాళ, రేపు రెండు రోజులపాటు జరుగుతున్నాయి. ఈ పోటీలను పాలకుర్తి ఎస్ ఐ దూలం పవన్ కుమార్ ప్రారంభించారు. ఈ క్రిడోత్సవాలల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 28 జట్లు పాల్గొంటున్నాయి. పలువురు గూడూరు గ్రామ ప్రముఖులు ఈ క్రీడల నిర్వహణకు తోడ్పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, S6 న్యూస్ ప్రతినిధి చెరిపెల్లి అశోక్,
బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు దుంపల్ సంపత్, బెల్లి సంపత్, మడత రాజు, యాదనాల రమేష్. గుగ్గిళ్ల రామస్వామి. గుగ్గిళ్ల శంకర్, చింతల్ నర్సిరెడ్డి, గూడూరు గ్రామ ప్రజలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ప్రతిభ ను వెలికితీయడానికి గ్రామీణ క్రీడలు దోహదం

