Friday, July 17, 2026
24.5 C
Hyderabad

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP
-బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP
-జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA

తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా లాంచ్ అవ్వాల్సిన జనసేనకు కొందరు ఔత్సాహిక తెలంగాణవాదుల చర్యల వల్ల, గ్రాండ్ ఎంట్రెన్స్ దొరికింది. మరి గ్రాండ్ సెల్రబేషన్స్ చేసుకునే స్థాయికి ఆపార్టీ చేరుతుందా? లేక బీజేపీ ప్లాంటెడ్ పార్టీగా మిగిలిపోతుందా? లేక ఆ పార్టీకి తోక పార్టీగా నిలుస్తుందా? ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న జనసేనాని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే కన్నేశారు. అయితే, తెలంగాణలో ఏపీ తరహాలో సక్సెస్ అవుతుందా? జన సేనతో లాభమెవరికి? నష్టమెవరికి? బీజేపీకి లాభిస్తుందా? బీఆర్ఎస్ ను కాదని తెరమీదకొచ్చి కవిత టీఆర్ఎస్ కు నష్టం చేస్తుందా? మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కిందకు నీళ్లు తెస్తుందా?

తెలంగాణలో జనసేనకు జనాదరణ దక్కేనా?

తెలంగాణ రాజకీయాల్లో జనసేన మరో కొత్త చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఎదిగిన జనసేన ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారిస్తోంది. ఇటీవల పార్టీ కార్యకలాపాలు, నేతల ప్రకటనలు, హైదరాబాద్‌లో సంస్థాగత విస్తరణ ప్రయత్నాలు చూస్తే జనసేన తెలంగాణలో కూడా రాజకీయ స్థానం కోసం సిద్ధమవుతోంది. అయితే, తెలంగాణ జనం జనసేనను ఆదరిస్తారా? లేక అది బీజేపీకి అనుబంధంగా తోక పార్టీగానే మిగిలిపోతుందా?

వాస్తవానికి తెలంగాణలో జనసేన ప్రవేశం కొత్తదేమీ కాదు. పార్టీ ఆవిర్భావమే హైదరాబాద్ లో జరిగింది. 2014 మార్చి 14న మాదాపూర్ లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతిఏటా ఆవిర్భావ ఉత్సవాలు జరుపుతున్నారు. మరైతే ఇదే హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా కార్యాలయం ప్రారంభించడంలో అర్థముందా? అసలు ఆంతర్యమేంటి?

జనసేన ఆవిర్భావ సమయంలోనే తెలంగాణలో విస్తరించాలని ప్రయత్నించింది. అయితే తెలంగాణ ఉద్యమం అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ భావోద్వేగాలు, స్థానిక నాయకత్వ లోపం కారణంగా పార్టీ బలపడలేకపోయింది. దాంతో ఏపీలో పాగా వేయడానికి పూనుకున్నది. మొదటిసారి విఫలమైనా, రెండోసారి కూటమి పొత్తు ఎత్తులో సక్సెస్ అయింది. అయితే, తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నించడం వంటి పరిణామాల మధ్య జనసేన తన అవకాశాలను వెతుక్కుంటోంది.

తెలంగాణలో 3.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 40 శాతానికి పైగా యువతే. రాష్ట్ర జనాభాలో పట్టణ ప్రాంతాల వాటా కూడా 39 శాతానికి పైగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో యువత, మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు గణనీయంగా ఉన్నాయి. ఈ వర్గాలపై జనసేన ప్రభావం చూపగలదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కానీ, ఓట్లేయడంలో యువత, పట్టణ, నగర జనాభా అనాసక్తంగా ఉంది. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఉన్న వ్యక్తిగత అభిమానులు రాజకీయ మద్దతుగా మారితే పార్టీకి కొంత ప్రయోజనం కలగవచ్చు.

అభిమానులు, ఓటర్లు ఒకటే కాదన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనసేన తొలి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. కానీ, 2024లో తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు కారణంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలు గెలుచుకుంది. నూటికి నూరు శాతం విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితం కేవలం జనసేన సొంత బలాన్ని కాకుండా కూటమి రాజకీయాల ప్రభావాన్ని కూడా ప్రతిబింబించింది.

ఇక్కడే తెలంగాణలో జనసేన భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తుతున్నాయి. పార్టీ సొంత రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటుందా? లేక బీజేపీతో కలిసి పనిచేసే మిత్రపక్షంగానే మిగిలి పోవాలనుకుంటుందా? ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు రెండో అవకాశానికే ఎక్కువ బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే బలమైన సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లను సాధించింది. ఎనిమిది లోక్ సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు ప్రత్యేక రాజకీయ వ్యాక్యూంను ఏర్పరచుకోవడం అంత సులభం కాదు.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తి కోసం కొంతమంది యువత, పట్టణ ఓటర్లు ఎదురుచూస్తున్నారనే వాదన ఉంది. జనసేన ఆ ఖాళీని భర్తీ చేయగలదా? అన్నది కీలక ప్రశ్న. ఇందుకోసం కేవలం పవన్ కళ్యాణ్ ప్రజాదరణ సరిపోతుందా? గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణం అవసరం. స్థానిక సమస్యలపై స్పష్టమైన వైఖరి, తెలంగాణకు ప్రత్యేక రాజకీయ అజెండా, విశ్వసనీయ నాయకత్వం కూడా అవసరం.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనసేనకు తొలి పరీక్షగా నిలువనున్నాయి. హైదరాబాద్‌లో పార్టీకి ఉన్న అభిమాన వర్గం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది అప్పుడే స్పష్టమవుతుంది. ఒకవేళ పార్టీ గణనీయమైన ఓటు శాతం సాధిస్తే భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించవచ్చు. లేకపోతే జనసేన ప్రభావం సోషల్ మీడియా చర్చలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ అస్తిత్వ గుర్తింపు, స్థానిక నాయకత్వం, సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషిస్తాయి. బీఆర్ఎస్ మనుగడ కూడా తెలంగాణ భావజాలంపైనే ఆధారపడింది. కాంగ్రెస్ ప్రస్తుతం సంక్షేమం, ప్రజాపాలనతో ముందుకెళ్తోంది. బీజేపీ జాతీయ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలతో అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన తన ప్రత్యేకత ఏమిటో ప్రజలకు చెప్పగలగాలి. కేవలం ఏపీలో సాధించిన విజయాన్ని తెలంగాణలో పునరావృతం చేయడం అంత సులువు కాదు.

మొత్తంగా చూస్తే తెలంగాణలో జనసేనకు అవకాశాలు ఉండొచ్చు. కానీ ఆ అవకాశాలు ఇంకా రాజకీయ బలంగా మాత్రం కనిపించడం లేదు. అభిమానాన్ని ఓట్లుగా, ఓట్లను సంస్థాగత బలంగా, బలాన్ని ఎన్నికల విజయంగా మార్చే సామర్థ్యాన్ని పార్టీ సమకూర్చుకుని, నిరూపించుకోవాలి. లేకపోతే అది బీజేపీ మిత్రపక్షంగానే, తోకపార్టీగానే మిగిలిపోతుంది. తెలంగాణ రాజకీయాల్లో నిజమైన శక్తిగా ఎదగాలంటే జనసేన తన స్వంత అస్తిత్వాన్ని నిర్మించుకోవాల్సిందే. రాబోయే జీహెచ్‌ఎంసీ, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా నిలవనున్నాయి.

——-

డా. మార్గం లక్ష్మీ నారాయణ,
సమాజ, రాజకీయ విశ్లేషకులు,
చీఫ్ ఎడిటర్ – అడుగు డిజిటల్ మీడియా.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News