Wednesday, June 10, 2026
23.8 C
Hyderabad

సీఎం గారూ..! ముందున్న మూడేళ్ళే అసలైన పరీక్ష!!|EDITORIAL

విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచాయి. ఎంపీ, ఉప ఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల వరుస ఫలితాలు ఆయనకు రాజకీయంగా తిరుగులేని బలాన్నిచ్చాయి. పార్టీ ఢిల్లీ అధిష్ఠానం నుంచి ప్రశంసలు అందుకోవడం కూడా ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. కానీ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. ఇది ప్రతిపక్షానికి హెచ్చరిక అయితే, అధికార పక్షానికి మరింత బాధ్యతగా వ్యవహరించడానికి, ఆత్మపరిశీలనకు అవకాశం.

ఎన్నికల విజయాలు నాయకత్వ నైపుణ్యాన్ని సూచిస్తాయి. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయడం, పార్టీలో సీనియర్లను ఏకతాటిపై నడిపించడం వంటి వ్యూహాలు మంచి ఫలితాల్నిచ్చాయి. కాంగ్రెస్‌లో సహజంగా కనిపించే అంతర్గత అసమ్మతిలను అధిగమిస్తూ రేవంత్ తన స్థానాన్ని బలపరుచుకున్నారు. పదిలపరుచుకున్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. మంచినీరు, సాగునీటి సమస్యలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధరల కల్పనలో స్పష్టత అవసరం. నిరుద్యోగ సమస్య ఇంకా యువతను వేధిస్తోంది. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా, ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా అవినీతి పెరుగుతూనే ఉన్నది. రోజుకో చోట లంచం కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరం. విద్యుత్ శాఖలో ఉద్యోగుల సస్పెన్షన్లు జరిగినా, వ్యవస్థాపక సంస్కరణలు లేకపోతే సమస్య సమూలంగా పరిష్కారం కాదు.

మంత్రులపై ‘పర్సంటేజీల’ ఆరోపణలు ఉన్నాయి. వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వ ప్రతిష్ఠకు దెబ్బతీస్తున్నాయి. పాలనలో సమన్వయం, జవాబుదారీతనం ఇంకా పెరగాలి. ప్రజలకు చేరువైన పారదర్శక వ్యవస్థ అవసరం. అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే స్థానిక ఎన్నికల్లో వచ్చిన విజయాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతే, అవసరాలను తీర్చకపోతే అసంతృప్తి పెరగక మానదు.

స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా స్థానిక అంశాలతోనే ప్రభావితమవుతాయి. అధికార పార్టీవైపు ప్రజలు మొగ్గడం సహజం. సార్వత్రిక ఎన్నికలు మాత్రం రాష్ట్ర స్థాయి పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం వంటి విస్తృత అంశాలపై ఆధారపడతాయి. స్థానిక విజయాలు భవిష్యత్ సార్వత్రిక గెలుపునకు ఒక సానుకూలాంశమే తప్ప, అవే అసలైన విజయాలుగా ముందే భావించలేం.

2029లో జమిలి ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. అదే నిజమైతే రాజకీయ సమీకరణాలు మారవచ్చు. వచ్చే మూడేళ్ళు అధికార పార్టీకి అత్యంత కీలక కాలం. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పాలనలో గుణాత్మక మార్పులు తీసుకురావాలి. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వ్యవసాయ రంగానికి స్థిరమైన మద్దతు, పరిశ్రమల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.

నిరంతరం ప్రజల మనసు గెలుచుకోవాలంటే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News