Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

సీఎం గారూ..! ముందున్న మూడేళ్ళే అసలైన పరీక్ష!!|EDITORIAL

విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచాయి. ఎంపీ, ఉప ఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల వరుస ఫలితాలు ఆయనకు రాజకీయంగా తిరుగులేని బలాన్నిచ్చాయి. పార్టీ ఢిల్లీ అధిష్ఠానం నుంచి ప్రశంసలు అందుకోవడం కూడా ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. కానీ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. ఇది ప్రతిపక్షానికి హెచ్చరిక అయితే, అధికార పక్షానికి మరింత బాధ్యతగా వ్యవహరించడానికి, ఆత్మపరిశీలనకు అవకాశం.

ఎన్నికల విజయాలు నాయకత్వ నైపుణ్యాన్ని సూచిస్తాయి. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయడం, పార్టీలో సీనియర్లను ఏకతాటిపై నడిపించడం వంటి వ్యూహాలు మంచి ఫలితాల్నిచ్చాయి. కాంగ్రెస్‌లో సహజంగా కనిపించే అంతర్గత అసమ్మతిలను అధిగమిస్తూ రేవంత్ తన స్థానాన్ని బలపరుచుకున్నారు. పదిలపరుచుకున్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. మంచినీరు, సాగునీటి సమస్యలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధరల కల్పనలో స్పష్టత అవసరం. నిరుద్యోగ సమస్య ఇంకా యువతను వేధిస్తోంది. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా, ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా అవినీతి పెరుగుతూనే ఉన్నది. రోజుకో చోట లంచం కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరం. విద్యుత్ శాఖలో ఉద్యోగుల సస్పెన్షన్లు జరిగినా, వ్యవస్థాపక సంస్కరణలు లేకపోతే సమస్య సమూలంగా పరిష్కారం కాదు.

మంత్రులపై ‘పర్సంటేజీల’ ఆరోపణలు ఉన్నాయి. వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వ ప్రతిష్ఠకు దెబ్బతీస్తున్నాయి. పాలనలో సమన్వయం, జవాబుదారీతనం ఇంకా పెరగాలి. ప్రజలకు చేరువైన పారదర్శక వ్యవస్థ అవసరం. అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే స్థానిక ఎన్నికల్లో వచ్చిన విజయాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతే, అవసరాలను తీర్చకపోతే అసంతృప్తి పెరగక మానదు.

స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా స్థానిక అంశాలతోనే ప్రభావితమవుతాయి. అధికార పార్టీవైపు ప్రజలు మొగ్గడం సహజం. సార్వత్రిక ఎన్నికలు మాత్రం రాష్ట్ర స్థాయి పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం వంటి విస్తృత అంశాలపై ఆధారపడతాయి. స్థానిక విజయాలు భవిష్యత్ సార్వత్రిక గెలుపునకు ఒక సానుకూలాంశమే తప్ప, అవే అసలైన విజయాలుగా ముందే భావించలేం.

2029లో జమిలి ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. అదే నిజమైతే రాజకీయ సమీకరణాలు మారవచ్చు. వచ్చే మూడేళ్ళు అధికార పార్టీకి అత్యంత కీలక కాలం. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పాలనలో గుణాత్మక మార్పులు తీసుకురావాలి. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వ్యవసాయ రంగానికి స్థిరమైన మద్దతు, పరిశ్రమల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.

నిరంతరం ప్రజల మనసు గెలుచుకోవాలంటే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News