Wednesday, June 10, 2026
25.8 C
Hyderabad

‘ట్రంప’రితనపు కుంపటి- ఆర్థిక సంక్షోభం!|EDITORIAL

ట్రంప్ టెంపరితనం, దుందుడుకు దూకుడు, అగ్రరాజ్య ఆధిపత్యపు పైత్యం మొత్తం భూమండలాన్నే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ప్రపంచాన్ని నడిపే చమురే ఇప్పుడా ప్రపంచ చమురును తీస్తున్నది. అన్ని రంగాలపై పడిన ప్రభావం అందరి ఉసురు తీస్తున్నది. మధ్య, దిగువ తరగతి ప్రజలే అధికంగా ఈ ప్రభావం బారిన పడుతున్నారు. ఐటీ రంగం కుదేలైంది. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు? ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. ధరలు పెరిగి, ధరణి సంక్షోభంలో కూరుకుపోయింది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టాయి. అమెరికా–ఇరాన్ ఘర్షణలు కేవలం యుద్ధానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అస్థిరం చేశాయి. ఇరాన్‌పై దాడులు, ప్రతిదాడుల హెచ్చరికలు, హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు మారితే దాని ప్రభావం నేరుగా భారత్ సహా అన్ని ప్రపంచ దేశాలపైనా పడుతోంది.

భారత్ తనకు అవసరమైన ముడి చమురులో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే భారత దిగుమతి వ్యయం వేల కోట్ల రూపాయల మేర పెరుగుతుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు. రవాణా ఖర్చులు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. నిత్యావసరాల నుంచి నిర్మాణ సామగ్రి వరకు అన్నింటిపై దాని ప్రభావం పడుతుంది. ఇప్పటికే విమానయాన రంగం అధిక ఇంధన వ్యయంతో సంక్షోభంలో ఉంది.

రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఇంధన వినియోగాన్ని తగ్గించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న “వర్క్ ఫ్రమ్ హోమ్” విధానం మళ్లీ చర్చకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ఐటీ నగరాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది ప్రతిరోజూ సగటున 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఇంధన వినియోగం, కాలుష్యం కలిసి నగర జీవనాన్ని భారంగా మారుస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మంది వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పని చేసినా నెలకు రూ.140 కోట్ల విలువైన ఇంధనం ఆదా కావచ్చు. దేశవ్యాప్తంగా ఐటీ హబ్‌లను కలిపి చూస్తే ఈ ఆదా వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.

కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం విజయవంతంగా అమలైంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసి కంపెనీల కార్యకలాపాలను కొనసాగించారు. అయితే ప్రస్తుతం చాలా ఐటీ సంస్థలు పూర్తిస్థాయి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆసక్తి చూపడం లేదు. కార్యాలయ సంస్కృతి, జట్టు సమన్వయం, డేటా భద్రత, ఉత్పాదకత వంటి అంశాలను కంపెనీలు కారణాలుగా చెబుతున్నాయి. కొన్ని సంస్థలు హైబ్రిడ్ విధానానికే పరిమితమవుతున్నాయి. అయినప్పటికీ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

ఇంధన సంక్షోభం మధ్య మరో పెద్ద దెబ్బ ఐటీ రంగానికే తగులుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాల కోతల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఓరాకిల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, భారత ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇచ్చిన కొన్ని క్యాంపస్ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకుంది. ఐఐటీ విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర అనిశ్చితిలో పడ్డారు. ఎందుకంటే చాలా కళాశాలల్లో “ఒక విద్యార్థికి ఒకే ఉద్యోగం” విధానం అమల్లో ఉంది. ఒక కంపెనీ ఆఫర్ పొందిన విద్యార్థి ఇతర అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఆఫర్లు రద్దవడంతో వారు మళ్లీ ఉద్యోగాల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక సిస్కో, లింక్డ్ ఇన వంటి సంస్థలు కూడా భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నాయి. కంపెనీలు ఇప్పుడు సంప్రదాయ ఉద్యోగాల కంటే కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలపై పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. ఫలితంగా సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ప్రజా రవాణాను బలోపేతం చేయడం, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అత్యవసరం. అదే సమయంలో ప్రజాప్రతినిధుల వ్యయ నియంత్రణ, ప్రభుత్వ దుబారా తగ్గింపు వంటి అంశాలపై పొదుపు నిర్ణయాలు జరగాలి.

ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడుతున్న ప్రతి ఉద్రిక్తత భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ సంక్షోభాలను పూర్తిగా అడ్డుకోవడం మన చేతుల్లో లేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ముందస్తు చర్యలు తీసుకోవడం మాత్రం ప్రభుత్వ బాధ్యత. లేదంటే ట్రంప్ రగిలించిన ఈ కుంపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాకుండా, భారత సామాన్యుడి జీవితాన్నీ మరింత భారంగా మార్చే ప్రమాదం ఉంది.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News