Wednesday, June 10, 2026
23.8 C
Hyderabad

అసెంబ్లీకి రానోళ్ళు అవసరమా!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమైనది. అసెంబ్లీ, పార్లమెంట్ వంటి శాసన సభలు ప్రజల సమస్యలు చర్చించేందుకు, పాలనకు మార్గనిర్దేశం చేసేందుకు ఏర్పాటైన వేదికలు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో విమర్శలకు తావిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని ఏపీలో విపక్ష వైసీపీ అధినేత జగన్‌ మొండిపట్టుతో ఉన్నారు. ఇక తెలంగాణలో విపక్ష హోదా ఉన్నా, కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే చాలని ఆయన, అధికారం ఉంటే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదన్న ధోరణిలో ఈయనా ఉన్నారు. సాంకేతికంగా తమ ఎమ్మెల్యే పదవిని నిలుపుకోవడానికి మాత్రం ఇలా వచ్చి అలా వెళుతున్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తరవాత అసెంబ్లీకి రావాల్సిందే. సమస్యలపై చర్చించాల్సిందే. కనీసం సభకు కూడా వెళ్లకుండా జీతభత్యాలు మాత్రం ఠంచనుగా ఎత్తుకుంటున్నారు. ప్రజల సొమ్ము తింటున్న ఈ ఇద్దరు నేతలు ఇంత బాధ్యతారహితంగా ఉంటున్నారు. ఇలాంటి సమయాల్లో వారిని ఏం చేయాలి? వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులను చేయాలి. మళ్లీ ఎన్నికల్లో నిలబడకుండా చూడాలి.

ఇక ఈ ఇద్దరూ అధికారంలో ఉండగా అప్పులు చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్ప చేశారు. ఇప్పుడేమో ఉన్న ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అతి తక్కువ కాలంలో దేశంలో బహుశా ఇంతగా అప్పుల పాలైన రాష్టాల్రు లేవేమో! ఇబ్బడిముబ్డడిగా అప్పులు చేస్తూ, అనుత్పాదక రంగాలకు దుబారా చేసారు. వీటినే అభివృద్ధి, సంక్షేమం అంటూ నమ్మబలికారు. ఆర్థికంగానే గాక, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించకుంటే మట్టి కరచిపోతారని గతంలో అనేక ఉదంతాలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ, విపక్షాలను దెబ్బతీయడం, విమర్శలను సహించక పోవడం వంటి చర్యలతో ఇద్దరు సీఎంలు నిరంకుశంగా ఉంటున్నారు. అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా మరిన్ని అప్పులే చేస్తున్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో జగన్‌, విపక్షాలను అణచివేయడం, కేసులు పెట్టడంలో ప్రత్యేక శ్రద్ధగా పనిచేయడంతో ప్రజల్లో పలచనై, అధికారం కోల్పోయి, అసెంబ్లీకి రాలేని పరిస్థితిని కల్పించుకున్నారు. ఎదురు పార్టీ అనేదే లేకుండా, అణగదొక్కిన కేసీఆర్‌కు అదే ఎదురు తిరిగింది. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్న కుట్రతో చేసిన ప్రయత్నాలు బెడిసి, కాంగ్రెసే అధికారంలోకి వచ్చేలా విధి వింతనాటకం ఆడింది. దీంతో ఆయనా అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు.

గతంలో తెలంగాణలో టీడీపీని విలీనంచేసుకుని, కాంగ్రెస్‌, బీజేపీలకు ఉనికి లేకుండా పోవాలని కేసీఆర్‌ వేసిన ఎత్తుగడలు అంతా ఇంతా కావు. ఇప్పుడా రెండు పార్టీల దెబ్బకు బీఆర్‌ఎసే ఉనికిలేకుండా పోతోంది.
బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్లపాటు రాజ్యమేలారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను పట్టించుకోలేదు. తమ నిరంకుశానికి ప్రజాస్వామ్యం, అభివృద్ది ముసుగేలశారు. మమతా బెనర్జీ పుట్టుకు వచ్చారు. కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పెకిలించారు. అయితే ఆమె కూడా ఇప్పుడు అదే నిరంకుశ పాలన సాగిస్తున్నారు. అందుకే ఆమె పునాదులు కూడా కదులుతున్నాయి. బీజేపీ అక్కడ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణలో తొలుత తెలుగుదేశంను, ఆ తర్వాత కాంగ్రెస్‌ ను కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్‌, ఇప్పుడు అదీ నిర్వహించలేని ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయ్యారు. బెంగాల్ లో మమత చేసిన తప్పే, కేసీఆర్ తెలంగాణలో చేశారు. ఆ ఇద్దరు చేసిందే ఏపీలో జగన్‌ చేశారు. ఇప్పుడు వాళ్లు నామరూపాలు లేకుండా చేయాలనుకున్న పార్టీలు అధికారంలో ఉండటంతో ప్రతిపక్ష హోదా కోసం దేబిరించే, ఆ పదవి ఉన్నా అసెంబ్లీకి ముఖం చాటేసే నీచంలో ఉన్నారు.
అయితే, అసెంబ్లీకి వచ్చి తమ హయాంలో మంచిచేస్తే చెప్పుకోవాలి. విపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలి. సమస్యలపై ప్రభుత్వాల్ని నిలదీయాలి. కానీ అసెంబ్లీకి ముఖం చాటేయడమేంటి? ఒకందుకు ప్రతిపక్షంలో ఉండీ ఎన్ని అవమానాల్నైనా దిగమింగుకుంటూ అసెంబ్లీకి హాజరైన చంద్రబాబే వీళ్ళందరి కన్నా నయం. బీఆర్‌ఎస్‌ లో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా అంతా తామే అయి, కేసీఆర్‌, జగన్ లు కుటుంబ అవినీతి రాజకీయాలు నడిపారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాటి పర్యవసనాలను ఇంకా అనుభవించాల్సింది మిగిలే ఉంది. ప్రజలు, వారి మనోభావాలను విస్మరించి, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తే, ప్రజాక్షేత్రంలో ఎవరికైనా శిక్షలు తప్పవు.

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News