తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి విమర్శించారు. MMTS ట్రైన్ లో బాధితురాలపై అత్యాచారం యత్నం జరిగిందని, మహిళ కోచ్ లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారం యత్నం చేశాడన్నారు. ఆగంతుకుడు నుండి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్ నుండి కిందకు దూకితే అమ్మాయికి గాయాలు పాలై చికిత్స జరిగుతుందని జరిగిన సంఘటన గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్సులో , ట్రైన్స్ లో కూడా మహిళలు భద్రత కరువైందన్నారు. గత 15 నెలల్లో మహిళలు పై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి అన్నారు. మహిళల భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎంటీఎస్ రైలు బాధితురాలిను ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడం కాదు మహిళలకు భద్రత కల్పించాలి అని సీఎం రేవంత్ రెడ్డి కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అయినా, ఏ తల్లి అయినా సరే తన కూతుళ్లు భద్రంగా ఉండాలి అని కోరుకుంటుంది తప్ప అందాల పోటీ కోరుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా బాధితురాలికు సూపర్ స్పెషలిటి ఆస్పత్రిలో వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అప్పటి సిఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ మన రాష్ట్రంలో ఉందన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నేరాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని అయినా…. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

