Friday, March 13, 2026
24.7 C
Hyderabad

మానవత్వమా నీ అడ్రసెక్కడ?|EDITORIAL

ఒక రోజు తేడాలో తెలంగాణలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు మొత్తం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నివ్వెరనొములా చేస్తున్నాయి. నిర్ఘాంతపరుస్తున్నాయి. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ళ బాలిక ధరిత్రిపై అదే స్కూల్ ఆయా లక్ష్మమ్మ దాడి చేసిన తీరు గగుర్పొడిచేలా ఉంది. కింద పడేసి, నేలకేసి బాది, కాలితో తొక్కి, గొంతు పిసికి, చెంపలపై కొట్టి, కొడుతూ, తిడుతూ చేసిన దాడి ఆమెలోని హింసా ప్రవృత్తికి పరాకాష్టగా నిలిచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై నర్సింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు చేసిన యాసిడ్ దాడి ఘటన మానవత్వంపై దాడిగా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో మౌనం వీడాలి. ప్రతి ఒక్క పౌరుడి నుండి పౌర సమాజం మొత్తం సమస్యను కేవలం పోలీస్‌, ప్రభుత్వాలపై నెట్టడం సరికాదు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మహిళలను గౌరవించాలి, రక్షించాలి, సమాన హక్కులతో కలిసి నడిచే సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని అందించాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

ఒక రోజు తేడాలో తెలంగాణలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు మొత్తం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నివ్వెరనొములా చేస్తున్నాయి. నిర్ఘాంతపరుస్తున్నాయి. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ళ బాలిక ధరిత్రిపై అదే స్కూల్ ఆయా లక్ష్మమ్మ దాడి చేసిన తీరు గగుర్పొడిచేలా ఉంది. కింద పడేసి, నేలకేసి బాది, కాలితో తొక్కి, గొంతు పిసికి, చెంపలపై కొట్టి, కొడుతూ, తిడుతూ చేసిన దాడి ఆమెలోని హింసా ప్రవృత్తికి పరాకాష్టగా నిలిచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై నర్సింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు చేసిన యాసిడ్ దాడి ఘటన మానవత్వంపై దాడిగా మిగిలిపోయింది.

ఈ రెండు ఘోర సంఘటనలు మనం ఏ దిశగా సాగుతున్నామని సమాజాన్నే కాక ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రశ్నిస్తునాయి. నిలదీస్తున్నాయి. మట్టిలో కలుస్తున్న మానవత్వానికి భయానక సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఈ దారుణాలు కేవలం నేరాలు మాత్రమే కాదు. మన సమాజంలో క్షీణిస్తున్న విలువలు, పెరుగిపోతున్న హింసాత్మక ధోరణులు, చిన్న చిన్న విభేదాలకే భయంకరమైన దాడులకు పాల్పడే దౌర్భాగ్యాన్ని, బాధితులను రక్షించడంలో వ్యవస్థల లోపాలను ఎత్తి చూపుతున్నాయి.

యూనిసెఫ్-2024 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా పిల్లలు, మహిళలు దాడులకు గురవుతున్నారు. 65 కోట్ల మంది అంటే ప్రతి 5గురిలో ఒకరు పరోక్షంగా ఆన్‌లైన్, మానసిక హింసలకు గురవుతున్నారు. భారతదేశంలో నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2023లోనే మహిళలపై 4,48,211 దాడుల కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్ష మంది మహిళలలో సగటున 66.2 కేసులు నమోదైనట్టు. తెలంగాణలో 2023లో 23,679 కేసులు నమోదయ్యాయి, ప్రతి లక్ష మంది మహిళల్లో 124.9 కేసులు నమోదయ్యాయి. ఇది దేశ సగటు రేటు 66.2తో పోలిస్తే రెండింతలు. ఆంధ్రప్రదేశ్ లో 2023లో 22,418 కేసులు నమోదయ్యాయి. ఇక పిల్లలపై హింస విషయంలో దేశంలో 2023లో 1,77,335 కేసులు నమోదు అయ్యాయి.

ఇలాంటి దాడులు ఆ ఒక్కరికే నష్టం కలిగించవు. ఆ కుటుంబంతోపాటు మొత్తం సమాజం మీద ప్రభావాన్ని చూపుతాయి. భద్రత లేని, నిత్యం ప్రమాదంలోనే ఉన్నామన్న భావన ప్రజల్లో భయానక మానసిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. నేరాలు పెరగడం ఒకవైపు, నేరస్థుల్లో శిక్షల భయం లేకపోవడం మరోవైపు, సమాజాన్ని అశాంతి దిశగా నెట్టేస్తున్నాయి.

న్యాయ వ్యవస్థ, పోలీస్ విభాగం, ప్రభుత్వ యంత్రాంగం పై నమ్మకం సన్నగిల్లడమేగాక, అవి బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాలు బలపడతాయి. నేరాలు జరిగాకే స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోగల సామర్థ్యం, చొరవ ఆ వ్యవస్థల్లో కనిపించాలి. తీవ్రమైన నేరాలకు దారితీసే సామాజిక కారణాలను గుర్తించి, వాటిపై అవగాహన, కౌన్సెలింగ్, కమ్యూనిటీ పోలిసింగ్ వంటి చర్యలు చేపట్టడం అత్యవసరం.

అన్నింటికంటే స్కూల్ నుండి కాలేజీల వరకు యువతలో విలువల విద్యను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. మహిళలపై దాడులు, చిన్నారులపై హింస వంటి దారుణాల మూలాల్లో పితృస్వామ్య ధోరణులు, కోప నియంత్రణలో వైఫల్యం, అసూయ, అసహనం వంటి మానసిక రుగ్మతలు ఉంటాయి. వీటిని విద్య ద్వారానే మార్చగలం. ఇంటి నుండి పాఠశాల, సమాజం వరకు పిల్లల్లో పరస్పర గౌరవం, బాధ్యత, సానుభూతి వంటి విలువలు పెంపొందితేనే సమాజంలో శాంతి నెలకొంటుంది. మరోవైపు, నేరాలకు పాల్పడినవాళ్ళకు గట్టి శిక్షలు పడి, అవి వెంటనే అమలయ్యేలా ప్రత్యేక కోర్టులు పనిచేయాలి. ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క.

ఈ నేపథ్యంలో మౌనం వీడాలి. ప్రతి ఒక్క పౌరుడి నుండి పౌర సమాజం మొత్తం సమస్యను కేవలం పోలీస్‌, ప్రభుత్వాలపై నెట్టడం సరికాదు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మహిళలను గౌరవించాలి, రక్షించాలి, సమాన హక్కులతో కలిసి నడిచే సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని అందించాలి.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News