Friday, July 17, 2026
26.4 C
Hyderabad

నిరర్థకంగా పార్లమెంట్‌ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ అత్యంత కీలకం. ప్రజల తరఫున చట్టాలు రూపొందించే పవిత్ర స్థానం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సిసలైన వేదిక. కానీ, ఇటీవలి కాలంలో పార్లమెంట్‌ సమావేశాల్లో పస లేకుండా పోయింది. రాజకీయ పార్టీల ఎజెండాగా మారింది. పరస్పర దూషణల పర్వంగా జరుగుతోంది. అత్యంత నిరర్ధకంగా మారి, ప్రజాధనం ఫలితం లేకుండా వ్రుథాగా పోతోంది.

జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’పై మాత్రమే చర్చ జరిగింది. ఈ అంశంపై ఓ స్పష్టత వస్తుందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఆశించారు. రెండు రోజుల సుదీర్ఘ చర్చ, ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం తర్వాత కూడా జవాబులేని ప్రశ్నలు అనేకం మిగిలిపోలాయి. పహల్గామ్‌ సంఘటనలో భద్రతా వైఫల్యం, ఉగ్రవాదుల ఆచూకీ, నుంచి కేవలం 88 గంటల్లోనే యుద్ధ విరమణ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.

బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ పేరిట జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ గురించి విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే సమయంలో దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని ఒక్క రాయపుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే లక్షకు పైగా బోగస్‌ ఓట్ల పోలింగ్‌ జరిగిందని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. దీనిపై చర్చించి ఏకాభిప్రాయంతో ఎన్నికల సంస్కరణలను తెచ్చి ఉంటే అధికార పార్టీకి గౌరవం దక్కేది. దేశానికి ప్రయోజనం కలిగేది. పర్మినెంట్‌ ఓటర్ల ముసాయిదా ఉండేలా చేయించుకునే అవకాశం ఉండేది.

పార్లమెంటు సమావేశాలు ఒకప్పుడు అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలతో ఎంతో ఆసక్తిగా ఉండేవి. సమస్యలపై చర్చకు ప్రభుత్వాలు కూడా అనుమతించేవి. చర్చలు హుందాగా జరిగేవి. ఈ రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు అనేక కారణాల వల్ల నిరర్థకంగా మారుతున్నాయి. సమావేశాలు జరుగుతున్న రోజుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ ఈ రాజ్యాంగ అవసరం మొక్కుబడిగ మారింది. 1960లలో పార్లమెంట్‌ సమావేశాలు ఏడాదికి సగటున 120 రోజులపాటు సాగేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 60-70 రోజులకు మించడం లేదు.

సమావేశాలలో వాదనలు, చర్చల కంటే వాదోపవాదనలు, వివాదాలు, కేకలు, గుంపులుగా నినాదాలు, సభలోంచి వాకౌట్ చేయడం లాంటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు నామమాత్రంగాగా సభను అడ్డుకుంటున్నాయి. అధికార పక్షం కూడా చర్చలకు తావీయకుండా, తమ పనిని ఒడ్డెక్కించుకుంటున్నది. ఫలితంగా ప్రజల డబ్బులతో నడిచే ఈ సభలు ప్రజలకు ఉపయోగపడకుండా, కేవలం రాజకీయ స్టంట్‌గా మారిపోతున్నాయి.

వాయిదా తీర్మాణాలు అత్యంత ఆందోళనకరమైన అంశం. ఓ రోజుకి సగటున లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నా, సభ వాయిదాలతో అవన్నీ వృథా అవుతున్నాయి. ఇలా పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో నిర్వీర్యంగా సభలు నడవడం చాలా విచారకరం. దేశానికి కీలకమైన బిల్లులు, చట్టాలు పార్లమెంటులో సరైన చర్చ లేకుండానే ఆమోదం పొందుతుండటం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతోంది. అంతేకాకుండా, మీడియా, సోషల్ మీడియా ప్రభావంతో నాయకులు సభల్లో మాట్లాడే విషయంలోనూ హంగులు చూపించడం ప్రారంభించారు. ప్రజల ఆకర్షణ పొందడానికి ఎమోషనల్ స్పీచ్‌లు, నినాదాలు, నిరసనలే ఎక్కువగా చేస్తున్నారు గానీ, శాస్త్రీయంగా విశ్లేషించి సమస్యలపై పరిష్కారాలు చర్చించేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఇటీవలి కాలంలో అధికార పార్టీలు ప్రతిపక్షాల విమర్శలను సహించలేకపోతున్నాయి. అలాగే ప్రతిపక్షాలు కూడా సమస్యలపై సభా నిబంధనలు, సమాచారంతో కాకుండా కేవలం అడ్డంకులు సృష్టించే దిశగానే స్పందిస్తునాయి. ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకోవడం, మైకులు కట్ చేయడం, బుల్డోజింగ్ చేస్తున్నది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల దుర్వినియోగమే.

ఇలాంటి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఏంటి? పార్లమెంటు సమావేశాల రోజులను నిర్ధారిత పరిమితిలో ఉండేలా నిబంధనలు పెట్టాలి. సభల నిర్వహణ ఖర్చుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. సభల సమయంలో ప్రవర్తించే తీరు, నిబంధనల ఉల్లంఘనలకు ఖచ్చితమైన శిక్షలు విధించాలి. సభ్యులు తమ ప్రసంగాలను నిర్మాణాత్మకంగా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందించాలి. ముఖ్యంగా, స్పీకర్‌కు మరింత అధికారాలు ఇవ్వడం ద్వారా సభలో క్రమశిక్షణను పాటించేలా చర్యలు తీసుకోవాలి.

తద్వారా పార్లమెంటు నిజంగా ప్రజల సమస్యలపై చర్చించే వేదికగా మారుతుంది. ప్రభుత్వం తీసుకురాబోయే బిల్లులు సరైన విచారణకు లోనవుతాయి. ప్రతిపక్షాల వాణి ప్రభుత్వానికి వినిపించే అవకాశాలు కలుగుతాయి. ప్రజలు తమ ప్రతినిధుల పనితీరును సమీక్షించే అవకాశం పొందుతారు.

పార్లమెంట్‌ ఒక చట్టసభ మాత్రమే కాదు, అది ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అలాంటి పార్లమెంటు సమావేశాలు ఈ విధంగా నిరర్థకంగా మారిపోవడం సిగ్గుచేటు. ప్రజల ఆశలతో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర వేదికను రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకే వాడుకుంటే, ప్రజలకే గాక, ప్రజాస్వామ్యానికి కూడా నష్టమే. కాబట్టి, పార్లమెంట్‌ సమావేశాల ప్రభావాన్ని పెంచేలా, వాటిని ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా మలుచుకోవాల్సిన అవసరం మనం గుర్తించాలి. లేదంటే ‘పార్లమెంట్’ అనేది కేవలం నిరర్ధక వేదికగా మిగిలిపోతుంది.

ప్రజాస్వామ్య భవితవ్యాన్ని పరిరక్షించాలంటే, పార్లమెంటు సమావేశాలు ప్రజా ప్రయోజనాలపైనే దృష్టి కేంద్రీకరించాలి. అదే సమకాలీన భారతావనికి అత్యవసరమైన మార్గం.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News