Sunday, July 26, 2026
23.8 C
Hyderabad

అంబేద్కర్ వేసిన బాటలే…రేపటి సమాజానికి వెలుగు రేఖలు!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. సమాజంలో వివక్ష, అసమానతలు తొలగిపోవాలని పరితపించారు. అందరికీ విద్య, ఆర్థిక స్వేచ్ఛ, ఓటు హక్కు ఉండాలని భావించారు. అంటరానివారికి రిజర్వేషన్లు మాత్రమేగాక, మహిళలకూ రిజర్వేషన్లు ఉండితీరాలని ఆనాడే బిల్లు తెచ్చారు. ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోతే, తన పదవికే రాజీనామా చేశారు. అంతిమంగా రాజ్యాధికారం మాత్రమే పేదల అన్ని సమస్యలకు పరిష్కారం కాగలదని గట్టిగా చెప్పారు. మతాన్ని, కులాన్ని నిర్మూలించాలన్నారు. భారత సమాజాన్ని, రాజకీయాల్ని బహుషా అంబేద్కర్ అంతగా ప్రభావితం చేసిన వారెవ్వరూ లేరు. అంబేద్కర్ ని రాజ్యంగ నిర్మాతగా మాత్రమేగాక, సమాజ, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్య దార్శనికుడిగా చూడాలి. అయితే, నాటి నుంచి నేటి దాకా, అంబేద్కర్ ను ఆరాధ్యుడిగా మార్చివేసిన పాలకులు, ఆయన ఆశయాలు, లక్ష్యాలను విస్మరించారు. అందరివాడైన అంబేద్కర్ ను కొందరి వాడిగా మార్చే ప్రయత్నమూ జరిగింది. జరుగుతూనే ఉంది. అంబేద్కర్ జయంతి, వర్ధంతిల సందర్భాల్లో ఆయన విగ్రహాలకు దండలు వేయడం, దండం పెట్టడం, ఆయన ఆశయాలకు నీళ్లొదలడం నేటి పాలకులకు అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది.

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర కాలంలో మన నాయకులంతా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దిశగానే పని చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు, నాయకులకు అంబేద్కర్ పేరును జపించడం ఓ ఫ్యాషన్ గా, స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఇదంతా కేవలం తమ ఓటు బ్యాంక్‌ ను పెంచుకోవడానికి, ఉన్నది కాపాడుకోవడానికి చేస్తున్న రాజకీయమే తప్ప మరోటి కాదు. నిజంగానే మనం అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామా? లేదా? అన్నది నేతలతో పాటు దళితులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, నాయకుల కుట్రలను దళితులు అర్థం చేసుకోవాలి. ఏటేటా అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం కొన్ని ప్రభుత్వ సంస్థలకు అంబేద్కర్ పేరు పెట్టడం, ఢిల్లీ నుండి గల్లీ దాకా ఆయన విగ్రహాలను పెట్టడం, దండలేయడం, దండం పెట్టడమే తప్ప, ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలపై చేస్తున్నదేంటో అవలోకనం చేసుకోవాలి. ప్రధాని మోడీ అయితే అంబేద్కర్‌ పేరు ఉచ్చరించ కుండా ఉండలేకపోతున్నారు. అంబేద్కర్ కు తామిచ్చిన గౌరవం మరెవరూ ఇవ్వలేదంటున్నారు. కానీ నిత్యం అంబేద్కర్‌ జపం చేస్తున్న వారంతా ఉన్నత కులాలు వారే. వారు ఏనాడు దళితులను ఉన్నతికి తీసకుని వచ్చేందుకు ప్రయత్నించడం లేదు. ఓ ఆదివాసీని రాష్ట్రపతిని చేయడం దళిత ఉద్ధరణగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒకటి రెండు పదవులు వారి మొహాన పడేసి దళిత దీనజన ఉద్ధరణ జరిగిందన్న ఆ ప్రచారాన్ని మనం నమ్మితే, మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుంది. దళిత ఉద్ధరణ గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్‌, జగ్జీవన్‌ రామ్‌కు ప్రధాని అయ్యే ఛాన్స్‌ వస్తే అడ్డుకున్న చరిత్రను మరచిపోగలమా? దళితుడినే తెలంగాణ సిఎం చేస్తానన్న కెసిఆర్‌ సైతం వారిని ఓటు బ్యాంక్‌ కోసం మభ్యపెట్టారు. తొలి దళిత ముఖ్యమంత్రి అంటూ ఊదరగొట్టి తెలంగాణ సమాజాన్ని మోసం చేసి, పదేళ్ల పాటు ఆయనే సిఎంగా కొనసాగారు. దళితబంధు పథకం పేరుతో అక్రమాలకు తెరతీసారు. రాజకీయ నాయకులు ఎలాగూ మంచి చేయరు. కనీసం ప్రజలుగా మనమంతా అంబేద్కర్ కి నివాళి అర్పించేందుకు ఆయన చూపిన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్‌ ఆనాడే ప్రకటించారు. దళితులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ అంటరానితనం, చిన్నచూపు చూడడం వేరుగా చూడడం వంటి సమస్యలు సమిసిపోవు.

ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్‌ నడిపే జాతీయోద్యమంలో అంటరానితనం నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్‌ సభ్యుల నుండి పూర్తిస్థాయిలో మద్దతు లభించనేలేదు. గాంధీజీ వర్ణ వ్యవస్థను భారత సమాజం ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని సమర్ధించాడు. అయితే, 1932లోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుండి కమ్యూనల్ అవార్డును పొంది, “డిప్రెస్డ్ క్లాసెస్” కోసం ప్రత్యేక ఓటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటింపచేసిన ఘనాపాటి అంబేద్కర్.

ఇప్పటికైనా దళితులు తెలివిడిని, ఐక్యతను ప్రదర్శించాలి. అంబేద్కర్‌ పేరుతో చేసే రాజకీయాలను తిప్పి కొట్టాలి. ఉన్నత కులాలు, రాజకీయ పార్టీలు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలి. తమను రాజకీయంగా వాడుకుంటున్న నేతల నిజస్వారూపాలను గుర్తించాలి. అందరికీ సమాన అవకాశాల కోసం పాటుపడాలి. ముఖ్యంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అప్పుడే అంబేద్కర్‌ ఆశయాలను సాధించగలం. అంబేద్కర్ దళితుడిగా అనుభవించిన అవమానాలు, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఎదుర్కొన్న వివక్షలు, తన లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యాలు, సమాజ, ఆర్థిక, రాజకీయ చైతన్యమున్నప్పటికీ, తనకు జరిగిన ఆటుపోట్ల నుండి రాటుదేలి, ప్రజలకు పోరాటదారులు చూపినాడు. ఇప్పటికీ, ఎప్పటికీ అంబేద్కర్ చూపిన బాటలే రేపటి సమాజానికి వెలుగు రేఖలు.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News