Sunday, July 26, 2026
23.8 C
Hyderabad

DEMOCRACY|ప్రజాస్వామ్యానికి PARTIES|పార్టీలే పట్టుగొమ్మలు!|EDITORIAL

POLITICAL PARTIES| రాజకీయ పార్టీలతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యయుత వాతావరణం పార్టీల్లో ఉంటేనే, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. రాజకీయ పరిస్థితులను బట్టే ఆయా రాజ్యాల్లో, దేశాల్లో, సమాజాల్లో మిగతా అన్ని పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థ ఏదైనా ఇవ్వాళ ఒక ప్రజాస్వామ్యానికే చోటుంది. మన దేశానికి వస్తే మనది సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర, స్వాతంత్ర్య, సమైక్య నినాదం కలిగిన లౌకిక రాజ్యాంగం. మనం లిఖించుకున్న రాజ్యాంగాన్ననుసరించి, పార్టీలు, ప్రభుత్వాలు, పాలన సాగుతున్నది. మన వ్యవస్థననుసరించి మన రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామికంగానే నడుచుకుంటున్నాయి. అయితే పార్టీల్లోనూ అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉంటేనే, ప్రజలు ఆయా పార్టీలను ఆదరిస్తారు. అందలమెక్కిస్తారు.

INDIA| భారతదేశం పునాదులే ప్రజాస్వామిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఇదే విధానం అవలంబించి, ప్రజల్లో ఉన్నంతకాలమే మనగలుగుతాయి. అలాకాకుండా ఏకపక్ష, నిరపేక్ష, నిరంకుశ, కుటుంబ పాలనకు తెగబడితే అవి కాలక్రమంలో తెరమరుగవుతాయి. స్వాతంత్ర్యానికి ముందే మన దేశంలో పలు పార్టీలు ఆవిర్భవించాయి. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన కాంగ్రెస్ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబరు 26, 1925 స్థాపించబడింది. 1964లో దీనిలోని అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)గా విడిపోయింది. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించింది. 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది. దేశంలో 2024 మార్చి 23 నాటికి, 6 జాతీయ పార్టీలు, 58 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. 2,763 ఇతర గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం కొన్న ప్రామాణికాల ఆధారంగా పార్టీల గుర్తింపు, హోదా, ఎన్నికల గుర్తు వంటివి కేటాయిస్తుంది. కాలక్రమంలో కొన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల స్థాయికి, కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల స్థాయికి ప్రజాదరణను బట్టి చేరాయి. పార్టీలు తమ లక్షణాలు, లక్ష్యాలు, ఆశయాలు, నడవడికను బట్టి ప్రజాదరణను పొందుతున్నాయి.

ఒక్కో సందర్భంలో ఒక్కో పార్టీ దేశ, రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేశాయి. జాతీయోద్యమంలో ఉదారవాదంలో కాంగ్రెస్, ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టు పార్టీలు, నయా ఉదారవాదం, హిందూ జాతీయ వాద భావజాలంతో బీజేపీ, బహుజన సామాజిక న్యాయ వాదంతో బీఎస్పీ, సంక్షేమ, ప్రజాభిప్రాయవాదంతో ఆమ్ ఆద్మీపార్టీ, తెలుగువారి ఆత్మగౌరవంతో తెలుగుదేశం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదంతో భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ ఆశయసాధన కోసం వైసీపీ, సామాజిక న్యాయం కోసం జనసేన, ముస్లీంల హక్కుల పరిరక్షణకు ఎంఐఎం లాంటి అనేక గుర్తింపు ఉన్న, గుర్తింపు లేని మరెన్నో పార్టీలు ఆవిర్భవించాయి.

రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం. ప్రజాభిమానాన్ని చూరగొనడం ద్వారా, ఎన్నికల్లో గెలిచి, అధికారాన్ని దక్కించుకోవడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయడం వాటి విధి. ప్రజల ఓట్ల కోసం అనేక విధాలుగా పాటుపడటం, ఆకర్షణలు, తాయిలాలు, ఓటర్లను నమ్మించడం, ఏదో విధంగా అధికారంలోకి రావడం కూడా నేడు పరిపాటైపోయింది. అలవిగాని హామీలు, వాటి అమలు కోసం అప్పులు, వాటిని తీర్చడం, వడ్డీలు కట్టడం కోసం మరిన్ని అప్పులు తెచ్చి, ఆ ఊబీలోకి దిగిపోయినవి కూడా ఎన్నో ఉన్నాయి. అలా అధికారంలోకి వచ్చిన పార్టీలు అనతి కలంలోనే కనుమరుగవుతున్నాయి. ఒకటి రెండు సార్లు అధికారంలో రావడానికి ప్రజలు అవకాశాలిచ్చి, ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారు.

కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓ ప్రభంజనంలా వచ్చింది. ఎందరో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది. తటస్థులు, అధికారులు వంటి వారు రాజకీయావకాశాలు పొందారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ హయాంలో కూడా ఉద్యమకారులనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. ఎంఐఎం తన నిర్ణీత పరిమితిలో పని చేస్తున్నది. వైఎస్సార్ మరణాంతరం ఏర్పడిన వైసీపీ విడివడిన ఆంధ్రప్రదేశ్ లో అధకారంలోకి రాగలిగింది. జన సేన అటు జాతీయ బీజేపీ, ఇటు రాష్ట్రీయ తెలుగుదేశంతో కలిసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగలిగింది. మధ్యలో వచ్చిన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. అనేక ఉద్యమ పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్ లో విలీనమయ్యాయి.

అయితే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, అందరికీ అవకాశాలు, ప్రజాదరణను బట్టి అవి మనుగడ సాధించడం, అధికారంలోకి రావడమో జరిగాయి. నిరంకుశంగా, ఉదారంగా వ్యవహరించిన నాయకత్వాల కారణంగా ఆయా పార్టీలు అంతరించడమో, వేరే పార్టీల్లో విలీనమవడమో, ప్రజాదరణ లేక పక్కన పడటమో జరిగిపోయాయి. అయితే పైకి ప్రజాస్వామికంగా కనిపించినా, పార్టీ అంతర్గతంగా ఒక కుటుంబం లేదా ఒక వర్గం లేదా ఒక కులం, ఒక ప్రాంతం ఆధిపత్యం అనివార్యంగా అన్ని పార్టీల్లోనూ అన్ని లక్షణాలు లేదా ఒకటి రెండు లక్షణాలు కనిపిస్తున్నాయి. కేంద్రీక్రుత రాజకీయాలు జాతీయ పార్టీల్లో, ఒకే కుటుంబం లేదా ఏకపక్షత ప్రాంతీయ పార్టీల్లోనూ అధికంగా కనిపిస్తున్నది. ఇలాంటి లక్షణాలు రానురాను పెరిగిపోతున్నాయి. దీని వల్ల పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం సన్నగిల్లిపోతోంది. ఏకస్వామ్యం, ఏక చత్రాధిపత్యం, నియంత్రుత్వం పెరిగిపోతున్నది. ఇలాంటి పార్టీలు బలం ఉన్నంత కాలం, ప్రజాదరణను పొందినంత కాలం, సాగినంత కాలం సాగదీస్తున్నాయి. తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే, దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నిరంతరం కాపాడుతూ, అందరికీ అవకాశాలు కల్పిస్తూ, సామాజిక న్యాయాన్ని అందివ్వగలిగిన పార్టీలు దీర్ఘకాలం ప్రజల్లో ఉంటున్నాయి.

నిరంతరం ప్రజల్లో ఉండేలా పార్టీని నిలపడంలో ఘనత తెలుగుదేశం నాయకత్వం విజయం సాధించింది. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల్లో నిలవడానికి టీడీపీ నాయకత్వం చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. అదే తెలంగాణలో బిఆర్‌ఎస్‌ నిత్యం సంక్షోభాలతో సాగుతోంది. కేసీఆర్ నిరంకుశ విధానాలు ఆ పార్టీని దెబ్బతీసాయి. జగన్‌ లాగే అప్పులు చేసి, రాష్టాన్న్రి దివాళా తీయించారు. ప్రజలు ఇలాంటి పార్టీ మనకొద్దని ఎన్నికల్లో ఓడించారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ కూడా తన విధానాలు మార్చుకోకుండా ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగ్టటుకుంది. బీజేపీలో మోడీ నిరంకుశ విధానాల వల్ల ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోతోంది. గతేడాది ఎన్నికల్లో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ బెడిసింది. బీజేపీ ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలతో గట్టెక్కింది. పార్టీలు వీటిని హెచ్చరికలుగా గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ఏ పార్టీ అయినా మట్టి కరవక మానదు. తాత్కాలిక ఉద్రేకాలతోనో తాయిలాలతోనో ప్రజలు ఎల్లకాలం దీవించరు. దేశమైనా, రాష్ట్రమైనా, రాజకీయ పార్టీలైనా ప్రజాస్వామ్య బద్దంగా సాగాల్సిందే.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News