Friday, April 10, 2026
26.7 C
Hyderabad

అంతా పెద్దాయనే చేశారు!?|KCR|HARISHRAO|EATALA RAJENDER|KALESHWARAM COMMISSION

– అప్పుడు, SUB COMMITTEE|సబ్ కమిటీ కూడా వేశారు!
– CARPORATION|కార్పొరేషన్ ఏర్పాటు చేశారు!!
– CABINET|కేబినెట్ నిర్ణయాల మేరకే పనులు చేశారు!!!
– KALESHWARAM|కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల జవాబులు
– లోపల ఒకటి బయట మరొకటి చెప్పారా?
– TELANGANA|తెలంగాణ ప్రజల అనుమానాలు!?

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై KCR|కేసీఆర్ గుండెల్లో ఈటెలు దింపుతారనుకున్న EATALA RAJENDER|ఈటల మాటలు మాత్రమే చెప్పి వచ్చారా? కమిషన్ ముందు ఒకలా చెప్పి, బయట మరోలా మాట్లాడారా? చిక్కడు దొరకడులా సమాధానాలిచ్చారా? కమిషన్ కు తాను దొరకకుండా, కేసీఆర్ ను దొరక బుచ్చకుండా, హరీశ్ రావు కు ఎలాంటి హానీ జరగకుండా, అత్యంత జాగ్రత్తగా, తెలివిగా, లీగల్ గా కమిషన్ కు జవాబిచ్చారా? కమిషన్ ఎత్తుకు పై ఎత్తుగా జవాబిచ్చారా? ఇటు కాళేశ్వరం అవినీతి తనకంటకుండా అటు మరెవ్వరికీ అంటనివ్వకుండా, రాజకీయంగా తన భవిష్యత్తును మరింత భద్రం చేసుకున్నారా? కమిషన్ వేసిన, ప్రశ్నలు ఈటల చెప్పిన జవాబుల తీరును పరిశీలించినా, విచారణ అనంతరం బయటకు వచ్చిన ఈటల మాటలను విశ్లేషించినా అవుననే అనిపిస్తున్నది. పైగా తన నిజాయితీని, బీజేపీ నిబద్ధతను సమర్ధించుకుంటూ, కమిషన్ నివేదికను బటయ పెట్టాలని ఈటల చేసిన డిమాండ్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేదే. అయితే, ఎక్కడా బీఆర్ఎస్ కు గానీ, అప్పటి ప్రభుత్వానికి గానీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా జాగ్రత్త పడినట్లు ఆయన మాటలే అర్థం చేస్తున్నాయి. ఇవన్నీ ఆయన HARISH RAO|హరీశ్ రావుతో భేటీ అయింది నిజమేనన్నట్లు, పెద్దాయన డైరెక్షన్ లోనే నడుచుకున్నట్లు, బీఆర్ఎస్ తో అంటకాగినట్లు చెప్పకనే చెబుతున్నాయి.

‘‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి… అన్యుల మనముల్ నొప్పించక… తానొవ్వక…’’ అన్నట్లుగా అత్యంత ధన్యుడిగా కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు సమాధానాలిచ్చి బయట పడ్డారు మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజీగిరి ఎంపీఈటల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 113వ సాక్షిగా మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ ఈటలకు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ ను ఎక్స్ పర్ట్, టెక్నికల్, సబ్ కమిటీల నిర్ణయాలకు అంటగట్టి, ప్రాజెక్టు డిపిఆర్, నిర్మాణం బాధ్యతలని కేబినెట్ కి, తానే ఆర్థిక మంత్రినైనప్పటికీ, ఆ బాధ్యత తనకు లేనే లేదని చెప్పి ఈటల తప్పించుకున్నారు. ఇదే సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని, తనకు మంత్రి పదవినిచ్చిన కేసీఆర్ ని, హరీశ్ రావులని కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జవాబులిచ్చి తప్పించేశారు.

క్యాబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఈటెల చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కు సంబంధం లేదని, కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పని చేసిందని అన్నారు. తుమ్మడి హట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజీని కాదని, టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాధానం ఇచ్చారు. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. కేబినెటేనన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణంతో సంబంధం ఉందా? అంటే తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై అధికారం ఉండేదా అంటే తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ గురించి ఇంజనీర్లు చూసుకోవాలని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీ, సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఆర్థిక శాఖ ముందు పెట్టారని తెలిపారు.

మొదట రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయితే.. రైతుల డిమాండ్ మేరకు రూ.82 వేల కోట్లకు పోయిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 ఫీట్ల ఎత్తు నుంచి 148 ఫీట్లకు కుదించామన్నారు.

విచారణ తర్వాత బయటకు వచ్చిన ఈటల మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని ఆయనే చెప్పుకున్నారని, ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అని, అప్పుడు ఆయనే బాస్ అన్నారు.

మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పాప పంకిలంలోఈటల తాను ఇరుక్కోకుండా, అప్పటి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావును ఇరికించకుండా అత్యంత జాగ్రత్తగా సమాధానాలు చెప్పినట్లుగా తేలిపోయింది. పైగా, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలని, నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పటి దాకా ఊరుకునేది లేదని తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. అయితే 25 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నట్లు తెలిపారు. మరి పార్టీలు మారడం ఏ విలువల కిందకు వస్తుందో ఆయనే చెప్పాలి. ‘మా బతుకులో నిబద్ధతతో ఉంది… నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. కొందరు బట్టకాల్చి మీదేస్తే నాకేమీ కాదు’ అని కూడా అన్నారు. బహుషా తాను కమిషన్ ఎదుట చెప్పిన జవాబులపై వచ్చే విమర్శలను కూడా ఈటల ముందే ఊహించినట్లున్నారు.

ఈటెలను అడిగిన ప్రశ్నలు ఇవే!

కమిషన్: మూడు బ్యారేజీల నిర్ణయం ఎవరిది? ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?
ఈటెల: క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది… తర్వాతే నిర్మాణం జరిగింది.
కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా ?
ఈటెల: టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చింది. ఫైనల్‌గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం కేబినెట్ తీసుకుంది.
కమిషన్ : రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?
ఈటెల: మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. హరీష్ రావు చైర్మన్‌గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం. ఎక్స్ పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది.
కమిషన్: రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా?
ఈటెల: రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది.
కమిషన్: డీఆర్పీ కోసం 597.45 లక్షలు వ్యాప్కోన్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా?
ఈటెల: తెలీదు.
కమిషన్: డీపీఆర్ అప్రూవల్ కేబినెట్‌లో జరిగిందా?
ఈటెల: అన్ని అనుమతులు కేబినెట్లో తీసుకున్నాం.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు?
ఈటెల: నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్స్‌ పరిధిలోకి కార్పొరేషన్ రాదు.
కమిషన్: లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలి అనుకున్నారు?
ఈటెల: కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపేమెంట్ చేయాలని అనుకున్నాం. కానీ కార్పొరేషన్ ద్వారా నిధులు కలెక్షన్ కాలేదు.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణం బడ్జెట్‌ ద్వారా జరిగిందా?
ఈటెల: నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు.
కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు?
ఈటెల: ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్నా టెక్నికల్ టీం చెప్తుంది.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే?
ఈటెల: అదంతా ఫైనాన్స్‌ శాఖ కిందికి రాదు. ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News