ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి రుణం తీర్చుకుంటా….
– పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి
ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా, ఘనంగా జరిగాయి. అభివృద్ధికి మారు పేరు అయిన ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శాసన సభ్యురాలు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథిగా హాజరవ్వగా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.



ఆదివారం రాత్రి 12:00 గంటలకు స్టాఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన ఆమె ఆ తరువాత ఉదయం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో వారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం కొడకండ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు, తొర్రూరు పట్టణ నాయకులు, మహిళ నాయకులు వేరు వేరుగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తరువాత తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డులో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అక్కడి నుండి నేరుగా రాయపర్తి మండల కేంద్రానికి చేరుకొని అక్కడి నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు పెన్నులు, బుక్స్ పంపిణీ చేశారు. ఆ తరువాత రాయపర్తి మండలం, జింకరాం తండాలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ తరువాత దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామంలో ప్రేమ సదన్ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులు, అనాథల మధ్య జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి కేక్ తినిపించి, వారి కుటుంబం తరుపున నిత్యావసర వస్తువులు, బట్టలు, పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఇవే గాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఆరు మండల కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు ఘనంగా జరిపారు. కాగా ఆయా కార్యక్రమాలలో స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



ఆయా సందర్భాలలో ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి లు మాట్లాడుతూ, ఎంత సంపాదించినా సేవా కార్యక్రమాల వల్ల కలిగే సంతృప్తి మరెందులోనూ కలగదని అందుకే తమ కుటుంబం మొత్తం పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలకు అంకితమైందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అన్నదే తమ సంకల్పమని వారు తెలిపారు. తమను ఆదరించి గెలిపించిన పాలకుర్తి ప్రజలకు మేము రుణపడి ఉంటాం అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమాలలో తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు, ఆరు మండలాల అధ్యక్షులు, బంధు మిత్రులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే యశస్విని జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే పై నియోజకవర్గమే గాక, రెండు రాష్ట్రాల్లో వెల్లివిరుస్తున్న అభిమానం


పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి పై తను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమే గాక, రాష్ట్రం దాటి, ప్రక్క రాష్ట్రంలో కూడా అభిమానులు ఏర్పడి వారి జన్మదినం సందర్భంగా వారిపై ప్రేమలు, ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి. అందులో భాగంగా హనుమాండ్ల రాజేందర్ రెడ్డి గారి కుటుంబ అభిమాని, ఆంధ్రప్రదేశ్ వాసి రఘు పుల్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అలాగే కాకినాడలో మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో కూడా కేక్ కట్ చేయించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న ప్రజలు ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.

