Wednesday, June 17, 2026
37.1 C
Hyderabad

మారణకాండకు మంగళం.. జనజీవన స్రవంతిలోకి ‘అడవి బిడ్డలు’!|MAOIST|CM|REVANTH REDDY

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల చారిత్రాత్మక లొంగుబాటు 

124 అత్యాధునిక ఆయుధాల అప్పగింత

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాట చరిత్రలో నేడు ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మి, ఏకంగా 130 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ భారీ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కేడర్, అదీ అత్యాధునిక ఆయుధాలతో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కుప్పలుతెప్పలుగా మారిన మారణాయుధాలు
లొంగిపోయిన మావోయిస్టులు తాము ఇన్నాళ్లూ అడవిలో వెంటబెట్టుకున్న 124 అత్యాధునిక తుపాకులను పోలీసులకు అప్పగించారు. వీటిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయుధాల స్థాయిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

స్వాధీనం చేసుకున్న ఆయుధాల జాబితా ఇలా ఉంది:

  • 31 AK-47 రైఫిళ్లు

  • 21 INSAS రైఫిళ్లు

  • 20 SLR రైఫిళ్లు

  • 1 INSAS LMG (లైట్ మెషిన్ గన్)

  • 18 .303 రైఫిళ్లు

  • 33 ఇతర రకాల తుపాకులు

తుడిచిపెట్టుకుపోయిన ‘తెలంగాణ రాష్ట్ర కమిటీ’

ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లొంగిపోయిన 130 మందిలో అగ్రశ్రేణి నాయకులు ఉండటం గమనార్హం.

  • రాష్ట్ర కమిటీ సభ్యులు: 03 మంది

  • రీజినల్ కమిటీ సభ్యుడు: 01 

  • డివిజనల్ కమిటీ సభ్యులు: 10 మంది

  • ఏరియా కమిటీ సభ్యులు: 46 మంది

  • పార్టీ సభ్యులు: 70 మంది

ఇటీవల కేంద్ర కమిటీ సభ్యులు దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి), దామోదర్, రాజిరెడ్డి వంటి దిగ్గజాలు లొంగిపోవడంతో, వారి అడుగుజాడల్లోనే మిగిలిన కేడర్ కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన ప్రకారం, ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ అనేది నామమాత్రంగా కూడా ఉనికిలో లేదు.

బుల్లెట్ వద్దు.. బ్యాలెట్ ముద్దు: ముఖ్యమంత్రి పిలుపు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. “శాంతియుత మార్గాల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని మన దేశం బలంగా నమ్ముతుంది. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. యుద్ధాలు చేస్తున్న దేశాలు కూడా చివరికి చర్చలకే మొగ్గు చూపుతున్నాయి. అడవిలో ఉన్న వారు కూడా హింసను వీడి ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని ఆయన కోరారు.

ప్రభుత్వం తరపున వరాల జల్లు:

లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని సీఎం స్పష్టం చేశారు.

  • ఇందిరమ్మ ఇళ్లు: లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ నివసించడానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు.

  • మెరుగైన వైద్యం: అడవిలో అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తారు.

  • ఆర్ధిక ప్యాకేజీ: ప్రస్తుతం ఉన్న పునరావాస ప్యాకేజీని మరింత పెంచి, వారు గౌరవప్రదంగా బతికేలా ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తాం.

  • కేసుల ఎత్తివేత: చట్టపరంగా అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గణపతికి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్

ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మాజీ చీఫ్ గణపతితో పాటు ఇతర కేంద్ర కమిటీ సభ్యులకు రేవంత్ రెడ్డి బహిరంగ పిలుపునిచ్చారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను.. మీరు బయటకు రండి, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఇటీవల అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా మావోయిస్టుల పునరావాసంపై చర్చించాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి

2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోవడం రేవంత్ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. “హింస ద్వారా ఏదీ సాధించలేం. అభివృద్ధి మార్గంలో పయనించి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలి” అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Latest News

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

జూన్ 16, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 06.37 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆరుద్ర రాత్రి 07.23 వరకు ఉపరి పునర్వసు యోగం గండ ఉదయం 07.29 వరకు ఉపరి వృద్ధి కరణం బవ ఉదయం 06.37...

జూన్ 15, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య ఉదయం 09.06 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మృగశిర రాత్రి 09.00 వరకు యోగం శూల ఉదయం 10.30 వరకు ఉపరి గండ కరణం నాగవ ఉదయం 09.06 వరకు ఉపరి...

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News