గ్రాడ్యుయేట్, టీచర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 10 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 11న జరగనుండగా, ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. రేపు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

