Friday, April 10, 2026
26.7 C
Hyderabad

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి… చైతన్య దీప్తి
-మిడ్కో మొదటి వర్ధంతి నేడు

హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్):
విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే ఏడాది నిండింది. ఈ సందర్భంగా ఆమె జ్ఞాపకాలను ఆమె స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఆమె గురుతులను నెమరు వేసుకుంటున్నారు.

పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, పోరాటాల పురిటి గడ్డ, కడవెండి గ్రామంలో 1970 అక్టోబర్‌లో జన్మించిన రేణుక, చిన్ననాటి నుంచే చదువులో ఆసక్తి చూపింది. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆమె జీవితం సాడా సీదా గానే ప్రారంభమైనా, కాలక్రమేణా విప్లవ మార్గాన్ని ఎంచుకుని అసాధారణంగా మారింది. కుటుంబంలో ఎదురైన సమస్యలు, సమాజంలోని అసమానతలు ఆమెను ఆలోచింపజేశాయి. తిరుపతిలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో మహిళా సంఘాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకుంది. అదే సమయంలో విప్లవోద్యమంతో పరిచయం పెరిగి, పెద్దదై, చివరికి పూర్తికాల కార్యకర్తగా మారింది.

రేణుక వ్యక్తిత్వంలో సాహిత్యం ఒక ముఖ్య భాగం. ఉద్యమంలోకి పూర్తిగా చేరకముందే కథలు రాయడం ప్రారంభించిన ఆమె ‘భావుకత’ వంటి కథల ద్వారా పాఠకులకు పరిచయమైంది. రేణుక, నిర్మల, జమీన్, మిడ్కో వంటి కలంపేర్లతో రచనలు చేసింది. ‘మిడ్కో’ అనే పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గోండీ భాషలో మిడ్కో అంటే ‘మిణుగురు’ అని అర్థం. ఆమె రచనలు కూడా అటువంటి వెలుగులా ముసురుకున్న పాఠకుల చీకట్ల మనసులను తాకాయి. దండకారణ్యంలో ఆదివాసీల జీవన సంగ్రామాన్ని ప్రతిబింబించేలా ‘దమయంతి’ పేరుతో పుస్తకం రాయడం ద్వారా ఆమె రచయిత్రిగా తన స్థాయిని నిరూపించింది. ఆమె కథలు స్త్రీల అంతఃసంఘర్షణలు, సమాజంతో వారి పోరాటం, విప్లవ దృక్పథం వంటి అంశాలను సున్నితంగా ప్రతిబింబిస్తాయి.

వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న రేణుక, వాటిని తన బలంగా మార్చుకుంది. చిన్న వయసులోనే జరిగిన వివాహం విఫలమవడంతో విడాకులు తీసుకుంది. అనంతరం చదువును కొనసాగిస్తూ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంది. విప్లవ నాయకుడు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిని వివాహం చేసుకున్న ఆమె, కొద్ది కాలానికే ఆయన ఎన్‌కౌంటర్‌లో మరణించడం వల్ల తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ తన బాధను వ్యక్తిగతంగా మోస్తూ, ఉద్యమంలో మరింత కట్టుబాటుతో పనిచేసింది. విశాఖ ప్రాంతంలో పని చేసి, తరువాత దళాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలిగా, రాష్ట్రస్థాయి నాయకురాలి, కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగింది. పార్టీలో మహిళలకు ఉన్న పరిమిత అవకాశాల మధ్య ఆమె ఎదుగుదల ప్రత్యేకంగా నిలిచింది.

రేణుక కథలు చదివినవారికి ఆమె ఆలోచనా లోతు స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీ జీవితంలోని బాధలు మాత్రమే కాకుండా, వారి శక్తి, సృజనాత్మకత, పోరాటస్ఫూర్తిని కూడా ఆమె కథల్లో చూపించింది. విప్లవోద్యమం స్త్రీలను ఎలా మారుస్తుందో, వారికి ఎలా కొత్త ప్రపంచాన్ని అందిస్తుందో ఆమె రచనలు తెలియజేస్తాయి. కుటుంబం, పితృస్వామ్యం, లైంగిక అసమానత వంటి సమస్యలను చారిత్రక దృష్టితో విశ్లేషిస్తూ, వాటి పరిష్కారంగా విప్లవాన్ని చూపింది. ‘మెట్ల మీద’ కథాసంపుటి ద్వారా ఆమె రచనలు మరింత విస్తృతంగా పాఠకులకు చేరాయి. విప్లవం అంటే కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, సృజనాత్మకత, మానవత్వం, సమానత్వం కలగలిసిన సమగ్ర ప్రక్రియ అని ఆమె తన రచనల ద్వారా స్పష్టం చేసింది.

వ్యక్తిగతంగా ఆమెను కలిసినవారు ఆమె స్వభావాన్ని సున్నితంగా, ప్రశాంతంగా వర్ణిస్తారు. ఎక్కువగా మాట్లాడని ఆమె, తన పనితోనే తనను వ్యక్తపరచేది. సహచరులతో ఆప్యాయంగా మెలుగుతూ, చిన్న చిన్న విషయాల్లోనూ శ్రద్ధ చూపేది. క్యాంపుల్లో కలిసి గడిపిన వారు ఆమె స్నేహభావాన్ని గుర్తుచేసుకుంటారు. సాధారణ జీవనశైలి, కట్టుబాటు, క్రమశిక్షణ ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన లక్షణాలు.

రేణుక మరణం ఆమె కుటుంబానికి, సహచరులకు, సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా ఆమె ఉద్యమాన్ని వదలలేదు. చివరకు ఎదురైన పరిస్థితుల్లో మరణించడం ఆమె జీవితం ఎంత కఠిన మార్గంలో సాగిందో చూపిస్తుంది. అయినప్పటికీ ఆమె ఆశయాలు, ఆమె రాసిన పదాలు ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. తల్లిదండ్రులకు ఎంతో ముద్దుబిడ్డగా ఉన్న రేణుకను కోల్పోవడం వారి జీవితాల్లో అనంత విషాదాన్ని మిగిల్చింది.

రేణుకను స్మరించుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తిని గుర్తుచేసుకోవడం కాదు, ఒక భావజాలాన్ని, ఒక పోరాటాన్ని, ఒక సాహిత్య ప్రస్థానాన్ని స్మరించుకోవడం. మిడ్కోగా ఆమె వెలిగించిన కాంతి ఇప్పటికీ పాఠకులలో, ఉద్యమకారులలో వెలుగుతోంది. ఆమె కథలు, ఆమె జీవితం, ఆమె ఆశయాలు కొత్త తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. సమానత్వం కోసం, న్యాయం కోసం, స్త్రీ విముక్తి కోసం ఆమె నడిచిన మార్గం చరిత్రలో నిలిచిపోతుంది. రేణుక లాంటి మహిళలు సమాజాన్ని మార్చే శక్తి కలవారని ఆమె జీవితం స్పష్టం చేసింది. ఆమె జ్ఞాపకాలకు నివాళిగా, ఆమె ఆశయాలను కొనసాగించడం సమాజం బాధ్యతగా మిగులుతోంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News