Monday, August 3, 2026
31.5 C
Hyderabad

రాజకీయ అవినీతికి అంతమెప్పుడు!?|EDITORIAL

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే ఒక చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నంతసేపు అవినీతికి పాల్పడటం, వేల కోట్లు వెనుకేసుకోవడం, అధికారం కోల్పోగానే అధికార పార్టీ అవినీతిపై పోరాటం చేయడం. ఇది ఇప్పుడు రాజకీయ సంస్కృతిగా మారిపోయింది. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా పరిస్థితి అదే. ఈ రాజకీయ దౌర్భాగ్యం వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈరోజు కోలుకోలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.

విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ పాలించిన ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ లు చేసిన ఆర్థిక దుర్వినియోగానికి బాధ్యత వహించాల్సిందే. అభివృద్ధి పేరుతో తీసుకున్న అప్పులు ప్రజలపై భారంగా మారాయి. కానీ ఈ అప్పులకు కారణమైన రాజకీయ నేతలెవ్వరూ బాధ్యత వహించడంలేదు. రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతే, రాజకీయ పార్టీలు మాత్రం అధికార మార్పిడితో సురక్షితంగా బయటపడుతున్నాయి.

ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోపణలు, ఈ–కార్ రేసు కేసులు ఈ రాజకీయ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచడంతో బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన “నోటీసులు కాదు, రాజకీయంగా పోరాడుదాం” అన్న వ్యాఖ్యలు చట్టం కంటే రాజకీయ బలం పెద్దదన్న భావనను ప్రతిబింబిస్తున్నాయి. విచారణ ఎదుర్కొనాల్సిన సమయంలో సవాళ్లు విసరడం రాజకీయంగా తప్పించుకునే వ్యూహంగా మారింది.

ఇదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఒకవైపు బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూనే, మరోవైపు తమ మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన టెండర్లు, బొగ్గు కుంభకోణంపై వచ్చిన ఆరోపణలు ప్రభుత్వ పారదర్శకతపై సందేహాలు కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీలకు వేల కోట్ల టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణలు తేలికగా తీసుకునేవి కావు. వీటిపై స్వతంత్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ ఆరోపణ–ప్రత్యారోపణల రాజకీయంలో ప్రజల ప్రయోజనం ఎక్కడా కనిపించదు. “వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి” అన్నట్లు, ఒక పార్టీ అవినీతిని మరో పార్టీ అవినీతి ఆరోపణలతోనే ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా నిజం మరింత మసకబారుతోంది. విచారణ సంస్థలు రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నాయన్న భావన ప్రజల్లో బలపడుతోంది. పైగా విచారణాధికారులను నేరుగా బెదిరించడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర కూడా ప్రశ్నార్థకమే. రాష్ట్రాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంగా నిజాయితీగా చర్యలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. బొగ్గు మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి పాత్ర ఏమిటి? సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు ఎందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు? అవినీతి ఆరోపణలు రాజకీయ అవసరాలకే పరిమితమవుతున్నాయా? అన్న అనుమానం తలెత్తుతోంది.

సింగరేణి వంటి కీలక ప్రభుత్వ సంస్థల్లో టెండర్ ప్రక్రియలపై వస్తున్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరం. మైనింగ్ టెండర్లు భౌగోళిక పరిస్థితులతో ముడిపడి ఉండటం వల్ల, పారదర్శకత అత్యవసరం. సైట్ విజిట్ చేసిన కంపెనీలకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం, అధికారుల అనిశ్చితి, రాజకీయ జోక్యం వంటివన్నీ అవినీతికి తలుపులు తెరుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన నైనీ కోల్‌బ్లాక్ టెండర్లలోనూ రాజకీయ అనుబంధాలు ఉన్న కంపెనీలకే లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పాలనలోనూ పునరావృతమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. పోలీసులు, అధికార నియంత్రణలో ఉన్న సంస్థలతో రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం. అందుకే అన్నా హజారే సూచించినట్లుగా, నిజంగా స్వతంత్రంగా పనిచేసే బలమైన లోక్‌పాల్ వ్యవస్థ అత్యవసరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా, భయం లేకుండా విచారణ చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదన్న భయం ఏర్పడుతుంది.

జగన్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరు చేసినా అవినీతి అవినీతే. ప్రజలు, మేధావులు, పౌర సంఘాలు కలిసి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. అవినీతి నుంచి బయటపడాలంటే లోక్‌పాల్ ఒక్కటే శరణ్యం. రాజకీయ సంకల్పం కావాలని నిర్వీర్యమవుతోంటే, ప్రజా ఒత్తిడే ఆ సంకల్పాన్ని సృష్టించాలి. లేదంటే ఈ ఆరోపణల రాజకీయాలు, అవినీతి చక్రం యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News