Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

సంక్షేమమా? సంక్షోభమా!?

ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. తెలంగాణ ధాన్యాగారం. దిగుబడులలో మనమే నెంబర్ వన్. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంది. కానీ అన్నపూర్ణను చేసిన రైతు అనాథగా మిగిలి, ధాన్యాగారం కాస్తా దళారులకు, మిల్లర్లకు ధనాగారంగా మారి, వరి ఉరైన నెంబర్ వన్ మనమే అవుతున్న దశలను చూస్తున్నాం. ముందు చూపు, విధానమంటూ లేకుండా సాగుతున్న పాలనలో సాగు సావు అవుతున్నది.

ఈ భూమి మీద రెండో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా, ప్రపంచంలోనే అత్యంత పెద్దరంగంగా, అత్యధికులు సాగుపై ఆధారపడే దేశంలో. ఓ వ్యవసాయ విధానమే లేకపోవడం విచిత్రం,. విడ్డూరం. దరిద్రం. రైతే రాజు. అన్నదాత. దేశానికి వెన్నెముక. అంటున్న పాలకులు రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ సంక్షోభ నివారణకి గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా, కనీస చట్టాలు కూడా చేయడం లేదు.

దేశంలోని అన్నదాతలను ఆదుకోవడంతో పాటు.. దేశానికి అన్నం పెట్టాలన్న దూరదృష్టి నేతల్లో కొరవడింది. ఏం చేస్తే దేశంలో ప్రజలందరికి ఆహార ధాన్యాలు దక్కగలవో చర్చించడం లేదు. సాగు చట్టాలను రద్దు చేసిన తరవాత కూడా కేంద్రం ఈ సమస్యలపై చర్చించడం లేదు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హావిూలు మాటలకే పరిమితం అయ్యాయి. సన్నకారు రైతులకు అండగా ఉన్నానని, ఏటా 6వేల కోట్లు వారి ఖాతాల్లో వేస్తున్నానని గొప్పగా ప్రకటించు కోవడం తప్ప బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టడం లేదు. నిజానికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం కాకుండా వ్యవసాయాన్ని ఆ డబ్బులను పండించే సాగుగా మార్చడం గురించి ఆలోచించడం లేదు. అలాగే వ్యవసాయాధారిత పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అభివృద్ది చేయాలి. దీంతో గ్రావిూణ వృత్తులకు కూడా ఆసరా దక్కుతుంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు. అకాల వర్షాలకు భారీగా పంటలు దెబ్బతింటున్న సందర్భంలో వారికి సకాలంలో పరిహారం అందడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 శాతానికంటే ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతింటేనే నష్ట పరిహారానికి సిఫార్సు చేస్తారు. పంటనష్టం అంతకు మించి ఉంటేనే వ్యవసాయాధి కారులు వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. బీమా చేస్తున్న రైతులకు పరిహారం అందేది నామమాత్రంగానే ఉంటుంది. ఈ నిబంధనలను మార్చాల్సి ఉంది. భారీ వర్షాలతో నష్టపోతే రుణాలు తీసుకున్నవారికి ఈ బీమాను అమలు చేయక పోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల ఉత్పత్తి ఆధారంగా ఎంత పంటనష్టం జరిగితే అంతే మొత్తాన్ని అందించనున్నారు. అకాల వర్షాలు భారీగా పంట నష్టాన్ని కలిగించి, రైతుకు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను కాపాడు కునేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.

ఇక పంటలను అమ్ముకోవడం ఓ పెద్ద ప్రహనంగా మారింది. ధాన్యం మార్కెట్లోకి తెచ్చిన తరవాత సవాలక్ష కొర్రీలు పెట్టి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. పక్కా మార్కెటింగ్‌ వ్యవస్థ, పంటలను కొనుగోలు చేసే వ్యూహం లేకుండా పోయింది. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌, నీటి సరఫరా, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, రైతు బీమా, సన్నాలకు క్వింటాకు అదనంగా రూ.500 వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టి పంటలు కొనుగోలు చేయకపోతే ఎలా? పంటలు అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధరల కోసం రైతులు రోడ్డెక్కితే రాజకీయం ఎలా అవుతుంది.? ఇది ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు. దేశం వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య. ఏ సీజన్‌కు ఆ సీజన్ లో సకాలంలో పంటలు కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తే చాలు. రైతు సమస్యలు సగం తీరినట్లే. కానీ మార్కెట్‌ యార్డుల్లో పడిగాపులు, ధరలు రాకపోవడం, తాలు, తరుగులతో నిలువు దోపిడీయే రైతులకు శాపంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వాల నిర్లక్ష్యాలు.

దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దాఖలాలే లేవు. ఎరువులు ఎంత ఎక్కువ వేస్తే అంత అధిక దిగుబడి వస్తుందని భ్రమపడుతున్నారు. దీంతో భూసారం దెబ్బతింటోంది. ఆ పంటలను తింటున్న ప్రజారోగ్యం పరేషాన్ గా మారింది. ఇందుకు భిన్నంగా రైతులకు తాయిలాలు ప్రకటిస్తూ ప్రభుత్వాలు రైతన్నలను మోసం చేస్తున్నాయి. నిర్ధిష్ట విధి విధానాలను రూపొందించాలి. వ్యవసాయ విధానాన్ని, పంటల క్యాలెండర్ ను ప్రకటించాలి. రైతులకు సరైన గైడెన్స్ అందేలా చూడాలి. ఇప్పుడున్న వ్యవసాయ పాలనా వ్యవస్థ సరిగా పని చేసేలా చర్యలు చేపట్టాలి. రైతు బీమా సరే, పంటల బీమా అమలు కావాలి. మిగతా కార్పొరేట్ వ్యవస్థల్లానే రైతులకు, వారి పంటలకు కూడా భరోసా ఉండాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పాలి. ప్రోత్సహించాలి. అన్నింటికంటే ముందు భూ సమస్యలను పరిష్కరించాలి. భూ కబ్జాలను అరికట్టాలి. ఇదంతా చూస్తుంటే ఇదేదో చైన్ సిస్టమ్ లా ఒకదానికి ఒకటి ముడి పడి ఉన్న అంశాలు.

ఏవేవో పరిశ్రమల కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్న పాలకులు, వాటి స్థాపనకు విలువైన మన భూములు ఇస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సరే, వాటి ద్వారా మనవాళ్ళకు అందుతున్న ఉద్యోగాలు ఎన్ని? వాటికంటే, పాలకులకు అందుతున్న మామూళ్ళే ఎక్కువ. ఇక మన వ్యవసాయ విధానాలను మన భూములు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాకుండా అధ్యయనం పేరుతో విదేశీ విహారాలు చేసి, వాటి విధానాలను మనమీద రుద్దడం సరికాదు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News