Monday, August 10, 2026
29.8 C
Hyderabad

కాళేశ్వరం కలహాలతో కాలం వెళ్ళదీయలేరు!?|EDITORIAL

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం పారదర్శకంగా సాంకేతిక నివేదికలను ప్రజల ముందుంచాలి. పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించి, సమయబద్ధ కార్యాచరణ ప్రకటించాలి. అదే సమయంలో అవినీతిని చట్టపరంగా నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం పునరుద్ధరించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత త్వరగా రాజకీయ ఆరోపణలకు కూడా తెరపడుతుంది. ఈ వివాదం వల్ల రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైన ప్రధాన అంశాల్లో కాళేశ్వరం కుంగడం కూడా ఒకటి. నిర్మాణ లోపాలు, అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం వంటి ఆరోపణలే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా ఆరోపణలు నిరూపించడంలోనూ, ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందా?

కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు. దీని వ్యయం లక్ష కోట్లకు పైమాటే. రోజుకు రెండు నుంచి మూడు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తో పాటు అనేక పట్టణాలకు మంచినీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా లక్ష్యాలుగా ప్రకటించారు. ఇంత భారీ పెట్టుబడితో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటం రాష్ట్రానికి ఆర్థికంగానూ, వ్యవసాయపరంగానూ నష్టమే.

2023 అక్టోబరులో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం ప్రాజెక్టు విశ్వసనీయతపై తీవ్ర అనుమానాలకు దారితీసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) ప్రాథమిక నివేదికలో నిర్మాణ నాణ్యత, రూపకల్పన, నిర్వహణ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నివేదికను ఆధారంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని వాదిస్తోంది. అయితే ఇదే సమయంలో ప్రాజెక్టును పునరుద్ధరించి వినియోగంలోకి తేవడానికి సమగ్ర కార్యాచరణపై స్పష్టమైన సమాధానం లేదు.

అప్పటి ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి, ధరణి పోర్టల్ అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేసు వంటి అంశాలను కాంగ్రెస్ ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగించింది. అధికారంలోకి వచ్చాక విచారణలు, కమిషన్లు, ప్రకటనలకే పరిమితమైంది. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక అమలుపై న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురవగా, ఆరోపణలు చేసిన స్థాయిలో చట్టపరమైన చర్యలు మాత్రం కనిపించలేదు. ఒకప్పుడు కేసీఆర్, హరీశ్‌రావుల అరెస్టు వరకు ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ విమర్శలుగానే మిగిలిపోయాయనే అభిప్రాయం బలపడుతోంది.

బీఆర్ఎస్ కూడా రక్షణాత్మక స్థితి నుంచి ఎదురుదాడి వ్యూహాన్ని అవలంబిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పరిమిత స్థాయిలో నీటిని నిల్వ చేసి పంప్ హౌస్‌ల ద్వారా రిజర్వాయర్లను నింపవచ్చని వాదిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు నీరు అందించకుండా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. గోదావరి జలాలను దిగువ ప్రాంతాలకు వదిలేస్తూ తెలంగాణ ప్రయోజనాలను విస్మరిస్తోందని కూడా విమర్శిస్తోంది.

ప్రభుత్వం మాత్రం భద్రతకే ప్రాధాన్యమని, సాంకేతిక నిపుణుల సూచనలు విస్మరించలేమని చెబుతోంది. ఈ వాదనలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. నిజంగానే ప్రాజెక్టు ప్రమాదకర స్థితిలో ఉంటే, ఆ విషయాన్ని ప్రజలకు పారదర్శకంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రిటైర్డ్ ఇంజనీర్లు, జలవనరుల నిపుణులు, ప్రతిపక్ష నేతలు, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి అఖిలపక్ష సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

తాజాగా ధరణి అవకతవకలపై వేసిన ‘సెట్’ కూడా రాజకీయ విమర్శలకు దారితీసింది. ఆలస్యంగా వచ్చిన చర్యగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. హామీల అమలుకంటే గత ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రభుత్వం పరిమితమవుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావులు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను తీవ్రం చేస్తున్నారు. సింగరేణి, గనుల కేటాయింపులు, కాంట్రాక్టులు, కమీషన్ల వ్యవహారాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఒకప్పుడు బీఆర్ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన కాళేశ్వరం అంశమే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా భారంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం పారదర్శకంగా సాంకేతిక నివేదికలను ప్రజల ముందుంచాలి. పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించి, సమయబద్ధ కార్యాచరణ ప్రకటించాలి. అదే సమయంలో అవినీతిని చట్టపరంగా నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం పునరుద్ధరించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత త్వరగా రాజకీయ ఆరోపణలకు కూడా తెరపడుతుంది. ఈ వివాదం వల్ల రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే.!

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News