Monday, July 20, 2026
25.8 C
Hyderabad

కాళేశ్వరం కలహాలతో కాలం వెళ్ళదీయలేరు!?|EDITORIAL

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం పారదర్శకంగా సాంకేతిక నివేదికలను ప్రజల ముందుంచాలి. పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించి, సమయబద్ధ కార్యాచరణ ప్రకటించాలి. అదే సమయంలో అవినీతిని చట్టపరంగా నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం పునరుద్ధరించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత త్వరగా రాజకీయ ఆరోపణలకు కూడా తెరపడుతుంది. ఈ వివాదం వల్ల రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైన ప్రధాన అంశాల్లో కాళేశ్వరం కుంగడం కూడా ఒకటి. నిర్మాణ లోపాలు, అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం వంటి ఆరోపణలే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా ఆరోపణలు నిరూపించడంలోనూ, ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందా?

కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు. దీని వ్యయం లక్ష కోట్లకు పైమాటే. రోజుకు రెండు నుంచి మూడు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తో పాటు అనేక పట్టణాలకు మంచినీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా లక్ష్యాలుగా ప్రకటించారు. ఇంత భారీ పెట్టుబడితో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటం రాష్ట్రానికి ఆర్థికంగానూ, వ్యవసాయపరంగానూ నష్టమే.

2023 అక్టోబరులో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం ప్రాజెక్టు విశ్వసనీయతపై తీవ్ర అనుమానాలకు దారితీసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) ప్రాథమిక నివేదికలో నిర్మాణ నాణ్యత, రూపకల్పన, నిర్వహణ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నివేదికను ఆధారంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని వాదిస్తోంది. అయితే ఇదే సమయంలో ప్రాజెక్టును పునరుద్ధరించి వినియోగంలోకి తేవడానికి సమగ్ర కార్యాచరణపై స్పష్టమైన సమాధానం లేదు.

అప్పటి ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి, ధరణి పోర్టల్ అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేసు వంటి అంశాలను కాంగ్రెస్ ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగించింది. అధికారంలోకి వచ్చాక విచారణలు, కమిషన్లు, ప్రకటనలకే పరిమితమైంది. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక అమలుపై న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురవగా, ఆరోపణలు చేసిన స్థాయిలో చట్టపరమైన చర్యలు మాత్రం కనిపించలేదు. ఒకప్పుడు కేసీఆర్, హరీశ్‌రావుల అరెస్టు వరకు ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ విమర్శలుగానే మిగిలిపోయాయనే అభిప్రాయం బలపడుతోంది.

బీఆర్ఎస్ కూడా రక్షణాత్మక స్థితి నుంచి ఎదురుదాడి వ్యూహాన్ని అవలంబిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పరిమిత స్థాయిలో నీటిని నిల్వ చేసి పంప్ హౌస్‌ల ద్వారా రిజర్వాయర్లను నింపవచ్చని వాదిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు నీరు అందించకుండా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. గోదావరి జలాలను దిగువ ప్రాంతాలకు వదిలేస్తూ తెలంగాణ ప్రయోజనాలను విస్మరిస్తోందని కూడా విమర్శిస్తోంది.

ప్రభుత్వం మాత్రం భద్రతకే ప్రాధాన్యమని, సాంకేతిక నిపుణుల సూచనలు విస్మరించలేమని చెబుతోంది. ఈ వాదనలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. నిజంగానే ప్రాజెక్టు ప్రమాదకర స్థితిలో ఉంటే, ఆ విషయాన్ని ప్రజలకు పారదర్శకంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రిటైర్డ్ ఇంజనీర్లు, జలవనరుల నిపుణులు, ప్రతిపక్ష నేతలు, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి అఖిలపక్ష సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

తాజాగా ధరణి అవకతవకలపై వేసిన ‘సెట్’ కూడా రాజకీయ విమర్శలకు దారితీసింది. ఆలస్యంగా వచ్చిన చర్యగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. హామీల అమలుకంటే గత ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రభుత్వం పరిమితమవుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావులు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను తీవ్రం చేస్తున్నారు. సింగరేణి, గనుల కేటాయింపులు, కాంట్రాక్టులు, కమీషన్ల వ్యవహారాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఒకప్పుడు బీఆర్ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన కాళేశ్వరం అంశమే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా భారంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం పారదర్శకంగా సాంకేతిక నివేదికలను ప్రజల ముందుంచాలి. పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించి, సమయబద్ధ కార్యాచరణ ప్రకటించాలి. అదే సమయంలో అవినీతిని చట్టపరంగా నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం పునరుద్ధరించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత త్వరగా రాజకీయ ఆరోపణలకు కూడా తెరపడుతుంది. ఈ వివాదం వల్ల రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే.!

Latest News

ఒక్క స్కూల్.. వేల మంది ఐఏఎస్‌లు!|SCHOOL|IAS

నేతర్‌హాట్ విద్యా మోడల్‌కు దేశమంతా ఫిదా|NETHERHAT|EDUCATIONAL MODEL ప్రకృతి రమణీయత ఉట్టిపడే కొండల నడుమ, చుట్టూ దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణం. ఒక సాధారణ పాఠశాలలా కనిపించే ఆ ప్రాంగణం.. యావత్ భారతదేశ పరిపాలనా...

జూలై 20, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి షష్ఠి ఉదయం 07.00 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 11.01 వరకు ఉపరి చిత్త యోగం శివ రాత్రి 11.07 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.00 వరకు ఉపరి...

మొగోల్లను గౌరవిద్దాం!?|ADUGU TRENDS

ఎర్రబస్సుల్ల ఎన్కటేం రాసుండేదో గుర్తుందా!? ఒకపాలి గుర్తు శేసుకోండ్రి. ‘పొగ తాగరాదు!’, ‘టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.’ ఇంక..? ‘టికెట్ లేని ప్రయాణం నేరం. రూ.500 వరకు జరిమానా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 19 నుండి జూలై 25 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో ఆదాయం...

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి...

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక...

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చవితి ఉదయం 08.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు ఉపరి ఉత్తర యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు ఉపరి పరిఘ కరణం భద్ర ఉదయం 08.30 వరకు ఉపరి...

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News