దగ్గరుండి ఏర్పాట్లు చేసి అన్ని తానైన ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ మనుమడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం దశదినకర్మ, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని తామై సంతాప సభ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల రామచంద్రం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. చిట్యాల రామచంద్రం పాలకుర్తి ప్రాంతానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో పాలకుర్తి గ్రామ రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజా నాయకుడి సంతాప సభ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, వివిధ పార్టీల , కులసంఘాల నాయకులు, గ్రామస్థులు, ప్రజలు తదితరులు పాల్గొని, రామచంద్రంకి నివాళి అర్పించారు.


