గ వాల్లు ఇప్పటికే ఆలుమొగలు. గవాల్లకు పిల్లలు గూడా ఉన్నరు. గా పిల్లలు సదువుకుంటాండ్రు. గివీల్లు సంసారం కూడా శేసుకుంటాండ్రు. అయినా గవాల్లు కొత్తగా మల్లా మనువాడిండ్రు. మూడుమల్లేసుకున్నరు. ఏడడుగులు నడిసిండ్రు. గట్ల ఒక్కటి రెండు జంటలు కాదుల్లా.. ఏకంగా తొమ్మిది జంటలు కొత్తగ సామూహికంగ మల్లా మనువు సేసుకున్నరు. గీ ముచ్చట గా అన్నవరంల జరిగింది.

ఇశాఖ జిల్లా కొండకర్ర ఊరికి శెందిన 9 ఆలుమొగల జంటలు కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిల మల్లా పెండ్లి శేసుకున్నరు. బాసింగాలు కట్టుకున్నరు. జిలుకర బెల్లం పెట్టుకున్నరు. తలంబ్రాలు పోసుకున్నరు. దండలు మార్సుకున్నరు. రతం గూడ శేసుకున్నరు. ఐటెంక గా సత్యదేవున్ని దర్శించుకున్నరు. గీ మనువు మాకు మరింత ఆనందాన్ని కలిగించిందన్నరు.
ఇంతకీ గీ పెండ్లి మల్లెందుకు శేసుకున్నరంటే.. ఆనంద పురంల నారాయణ మూర్తి అనే ఓ గురువు గివీల్లకి ఓ ఉపదేశమిచ్చిండట. ఆస్తు సూడ్డానికి పోయిన గాయినె, ఆలుమగలు మద్దెల కలతలున్నయని, మొదటి పెండ్లి దోషాలున్నయని శెప్పిండట. గంతేకాక, అన్నవరం పోయి గా ఆలుమొగలు మల్లా మనువాడితే, గా దోషాలన్నీ పోతయన్నడట. గంతే గా గురువు మాట మీద గీ శిష్యులు అన్నవరం పోయిండ్రు. కొత్తగ పెండ్లి పిల్ల, పిల్లగాని లెక్క తయారైండ్రు. ఏం సక్కా, మనువాడిండ్రు. ఇగ గిప్పటి నుండి, గవాల్ల కాపురాలల్ల కలతలు పోయి, మంచిగుంటమని, అంతా మంచైదతని నమ్ముతాండ్రు. మరి, మీరేమంటరు?

