Wednesday, August 19, 2026
28.1 C
Hyderabad

నేడు గూడూరులో… ప్రభంజన్ సంస్మరణ సభ!|PRABHANJAN YADAV

భారీగా తరలి రానున్న అభిమానులు
తగిన ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు

జనగామ/పాలకుర్తి, జూలై 25(అడుగు న్యూస్):
ఇటీవల అకాల మరణం చెందిన PROFESSOR| ప్రొఫెసర్ PRABHANJAN KUMAR YADAV| ప్రభంజన్ కుమార్ యాదవ్ దశదిన కర్మను ఆయన సొంత ఊరు జనగామ జిల్లా, పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఆయనకిష్టమైన సత్యశోధక విద్యా పీఠం ఆవరణలో ఘనంగా సంస్మరణసభగా నిర్వహించేందు కు ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సభకు తరలి వచ్చే వేలాది మందికి భోజన వసతి కల్పించాలని సంకల్పించారు. అవసరమైన ఫ్లెక్సీలు, వేదిక, మైకు, షామియానా, కుర్చీలు వంటివి సమకూరుస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆయన సతీమణి మంచిర్యాల మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖా ప్రభంజన్. తల్లి కొమురమ్మ, తమ్ముళ్ళు రమేశ్ తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

HYDERABAD| హైదరాబాద్ లో తన నివాసంలో ఈ నెల 16న తెల్లవారు జామున 06:00 గంటలకు ప్రముఖ సామాజిక బహుజన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త, సామాజిక తెలంగాణ సాధన సమితి చైర్మెన్ ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి మృతదేహాన్ని స్వగ్రామమైన గూడూరుకు తీసుకువచ్చి ఘనంగా అంతిమయాత్ర నిర్వహించి, వైద్య విద్యార్థుల ప్రయోగ పరీక్షల నిమిత్తం జనగామ మెడికల్ కాలేజీకి వారి దేహాన్ని అందించారు. ప్రభంజన్ ఐఐఎస్ అధికారిగా, ప్రొఫెసర్ గా, బహుజన ఉద్యమ రూపకర్తగా, అనేక ఉద్యమాల్లో పాల్గొనడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి కూడా మిత్రులు, ఉద్యమకారులు, అభిమానులు, ఊహించని విధంగా భారీగా తరలివచ్చే అవకాశం వుంది. ఆరోజు నుండి ఇంకా నిత్యం వివిధ ప్రాంతాల నుండి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ పార్టీల నాయకులు గూడూరు గ్రామానికి వచ్చి వారి సతీమణి, డా. రేఖ, తల్లి కొమురమ్మ, వారి సోదరులు రమేష్ తదితర కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేన్నారు. ఈ పరిస్థితులను బట్టి వేయి మందికి పైగా మిత్రులు, అభిమానులు ఈ రోజు నిర్వహించే దశదినకర్మ, సంస్మరణ సభకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ అంచనాకు వచ్చారు. సంస్మరణ సభకు వచ్చే అభిమానులకు, మిత్రులకు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్న ప్రభంజన్ మిత్రులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

సామాన్య కుటుంబంలో జన్మించిన యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ చిన్నప్పటి నుంచే తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాలైన పేద ప్రజల పక్షాన రచనలు చేస్తూ, ఉద్యమాలు నిర్మిస్తూ, పోరాటాలు చేస్తూ బహుజన ఉద్యమ నేతగా ఎదిగారు. బహుజన రాజ్యాధికారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. మండల్ టీవీని స్థాపించారు. జర్నలిజం ప్రొఫెసర్ గా, విద్యావేత్తగా, సామాజిక శాస్త్రవేత్తగా ఆయన అనేక మంది శిష్యులను సంపాదించుకున్నారు. ఉద్యమాల్లోనూ అయనకు అనేక మంది పాలోవర్లు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం మొదటి బ్యాచ్ వద్దే నిలిచిపోగా, దాన్ని పునరుద్ధరించడంతోపాటు ఆశాఖ ఏర్పాటులో ప్రొఫెసర్ ప్రభంజన్ శ్రమ మరువలేనిది. ఆ సమయంలో ఆయన వెంట డా. మార్గం లక్ష్మీనారాయణ కూడా వెంట ఉన్నారు. ఆతర్వాత డా. మార్గం, డా. రాపోలు సత్యనారాయణ కూడా బీసీజే విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ప్రొ.ప్రభంజన్, డా.మార్గం బీసీజే కోర్సు రైటర్లుగా కూడా వ్యవహరించారు. పలు సెమినార్లను నిర్వహించారు. ఆ తర్వాత ప్రభంజన్ తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజం శాఖ ఏర్పాటులో కీలకంగా పని చేశారు. జర్నలిస్టుగా, ఐఐఎస్ అధికారిగా, కేంద్ర ప్రణాళికశాఖలో, ఆల్ ఇండియా రేడియోలో, యూనివర్సిటీల్లో పలు హోదాల్లో ప్రభంజన్ పని చేశారు. దళిత, బహుజన ఉద్యమాల రూపకల్పనలో భాగంగా ఆయన అనేక వేదికల ఏర్పాటు చేశారు. ఆయా వేదికల్లో ఉపన్యాసాలిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను రూపొందించే పనిలో ఉండగానే ఆయనను అకాల మరణం కబళించింది. ఆయన మృతి ఆయన కుటుంబంతోపాటు, దళిత బహుజనుల ఉద్యమానికి తీరని లోటును కలిగించింది. ఆయన అభిమానులను, మిత్రులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఆయనకు వివిధ రాష్ట్రాల్లో శిష్యులు, మిత్రులు, అభిమానులు ఉన్నారు. ఆయన మరణాన్ని ఆయా రాష్ట్రాల బీసీ ఉద్యమ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది. అందుకే ఆయన సంస్కరణ సభకు తరలివచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సంస్మరణ సభకు ఎంతమంది తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.

బహుజన ఉద్యమ నేతల మృతికి దశదినకర్మ రోజును సంస్మరణ దినంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రజా పాటల గీతాలాపనతో, ఘనంగా నివాళులర్పిస్తూ, మృతి చెందిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం రివాజుగా మారింది. బహుజన ఉద్యమాల నేతలు, అభిమానులు హాజరై ఈ కార్యక్రమాలను నిర్వహించేవారు. అదే విధంగాసంస్మరణ సభను మాత్రం విజయవంతం చేయాలనే పనిలో ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు, అభిమానులు, నిమగ్నమయ్యారు.

Latest News

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 16 నుండి ఆగస్టు 22 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు....

గీ మిఠాయి మస్తు పిరం. కిలోకి 51 యేలే!|ADUGU TRENDS

ధర అదిరింది కదా! యే తియ్ మిఠాయి కి గంత ధరే0ది? అనుకుంటా0డ్లా? ఔ మల్ల నిజంగానే గా మిఠాయి కి గంత ధర ఎందుకంటే గా మిఠాయిల బంగారం కలిపిండ్రు. గది...

స్వాతంత్ర్యం, విద్వేషం విధ్వంసం, విషాదం!?|EDITORIAL

స్వాతంత్య్రం మనకు గొప్ప వరం. విభజన దాని వెంటే వచ్చిన మహా విషాదం! ఆ చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసుకోవడం ఏ పార్టీనీ అవమానించడానికి కాదు. భవిష్యత్తులో మతం, ప్రాంతం, భాష పేరుతో సమాజం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News