Saturday, August 15, 2026
24.7 C
Hyderabad

పార్లమెంటుపై ప్రశ్నలకు బదులేవి!?|EDITORIAL

జెన్‌జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి వైఖరి ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరాలి. పార్లమెంట్‌ రాజకీయ బలప్రదర్శనకు వేదికగా కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా జరిగినప్పుడే ప్రజాస్వామ్య గౌరవం నిలుస్తుంది. లేదంటే సభా భవనం పవిత్రంగా ఉన్నా, అందులో జరిగే వ్యవహారాలు మాత్రం ప్రజల విశ్వాసాన్ని అపవిత్రం చేస్తూనే ఉంటాయి.

డా.మార్గం-అడుగు, ఎడిటోరియల్

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రాజకీయ రణరంగంగా మారడం దురదృష్టకరం. దేవాలయంగా భావించే పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందారోపణలతో 19 రోజుల విలువైన సమయాన్ని వృథా చేశాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించి, నినాదాలు, నిరసనలు, వాయిదాలతో కాలం వృథా చేయడం అత్యంత దారుణం.

2026 వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు 25 రోజుల వ్యవధిలో 19 సిట్టింగ్‌లతో నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ నిరంతర అంతరాయాల కారణంగా లోక్‌సభ పనితనం కేవలం 19 శాతానికి, రాజ్యసభది 39 శాతానికి పరిమితమైంది. ప్రశ్నోత్తరాల సమయం పరిస్థితి మరింత దారుణం. లోక్‌సభలో అది కేవలం 1 శాతం, రాజ్యసభలో 12 శాతం మాత్రమే పనిచేసింది. ఇంత తక్కువ స్థాయిలో సభా కార్యకలాపాలు సాగడం పార్లమెంటరీ చరిత్రలోనే అత్యంత ఆందోళనకరం.

ఈ వైఫల్యానికి బాధ్యత ఎవరిది? అధికార పక్షానిదా? ప్రతిపక్షానిదా? సమాధానం సుస్పష్టం. ఇద్దరిదీ. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంది. ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించే బాధ్యత ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పేలా ఒత్తిడి చేయడం కూడా అవసరమైన ప్రక్రియే. కానీ వెల్‌లోకి దూసుకెళ్లడం, నినాదాలతో సభను స్తంభింపజేయడం, చర్చకు అవకాశమే లేకుండా చేయడం పార్లమెంటరీ నిరసనకు ప్రత్యామ్నాయం కాదు. అదే సమయంలో ప్రతిపక్షం ఆందోళన చేస్తోందనే కారణంతో అధికార పక్షం కూడా ప్రతిగా నినాదాలు చేయడం, రాజకీయ ప్రత్యారోపణలకు సభను వేదికగా మార్చడం బాధ్యతాయుతమైన పాలనకు నిదర్శనం కాదు.

విద్యార్థుల ఆందోళన, పోలీసుల చర్యలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ ఈ సమావేశాలకు ప్రధాన అడ్డంకిగా మారింది. చివరకు ఆ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ప్రతిపక్షాలు స్పీకర్‌కు లేఖ ఇస్తే ప్రశ్నలకు సమాధానమిస్తానని, చర్చలో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. అయితే ప్రతిపక్షం ఆయన ప్రసంగాన్ని ‘లెక్చర్‌’గా అభివర్ణిస్తూ తిరస్కరించింది. ప్రభుత్వం చెప్పేది వినకుండా, తమ ప్రశ్నలకు సమాధానాలు కోరడం ఎలా సాధ్యం? చర్చ కోరినప్పుడు చర్చకు కూర్చోవడమే ఉత్తమ మార్గం. ప్రభుత్వ సమాధానం నచ్చకపోతే దానిని సభలోనే ప్రశ్నించవచ్చు.

అలాగే అధికార పక్షం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిపక్షం సభను అడ్డుకుంటే వారిని విమర్శించడం సులభం. కానీ సభ సజావుగా సాగేందుకు అవసరమైన రాజకీయ చొరవ, సంప్రదింపులు, రాజీ ప్రయత్నాలు ఎంతవరకు జరిగాయన్నది కూడా పరిశీలించాలి. ప్రభుత్వం వద్ద సంఖ్యాబలం ఉందని భావించి ప్రతిపక్షాన్ని పూర్తిగా పక్కన పెట్టడం కూడా సరైన పార్లమెంటరీ సంస్కృతి కాదు. పార్లమెంట్‌లో మెజారిటీకి పాలించే హక్కు ఉంటే, మైనారిటీకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయమే ప్రజాస్వామ్యానికి ప్రాణం.

ఈ సమావేశాల్లో మరో విరుద్ధ విదృశ్యాలు కూడా విస్పష్టంగా కనిపించాయి. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుంటే, అధికార పక్ష సభ్యులు కూడా ప్రతినినాదాలతో ఎదురుదాడికి దిగారు. ఒకరిని ఒకరు నిలదీయడంలో చూపిన ఉత్సాహం ప్రజా సమస్యలపై చర్చలో కనిపించకపోవడం బాధాకరం. పార్లమెంట్‌ బయట రాజకీయ ప్రచారం చేయడానికి ఎన్నో వేదికలున్నాయి. కానీ చట్టాలపై లోతైన చర్చ, బడ్జెట్‌పై పరిశీలన, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు, ప్రజా సమస్యలపై సమాధానాలు రాబట్టడానికి పార్లమెంట్‌కు ప్రత్యామ్నాయం లేదు.

ణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చెబుతున్నాయి. గత బడ్జెట్‌ సమావేశంలో లోక్‌సభ పనితీరు 93 శాతం ఉండగా, ఇప్పుడు అది 19 శాతానికి పడిపోయింది. అంటే ప్రజల తరఫున చట్టసభలో పనిచేయాల్సిన సమయం అత్యధికంగా వృథా అయిందన్నమాట. కొన్ని బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందడం కూడా మరో ఆందోళన. ఒక బిల్లును ఆమోదించడం మాత్రమే పార్లమెంట్‌ పని కాదు; దాని ప్రభావం ఏమిటి, ప్రజలకు ప్రయోజనం ఎంత, లోపాలేమిటి అనే అంశాలపై సభ్యులు చర్చించాలి.

ఇక పార్లమెంట్‌ సమయానికి ఆర్థిక విలువను కూడా ప్రజలు ప్రశ్నించాలి. ఎంపీలకు జీతభత్యాలు చెల్లించడం సహ, పార్లమెంట్‌ నిర్వహణకు ప్రజాధనం ఖర్చవుతుంది. అలాంటి వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా స్తంభింపజేయడం ప్రతి పౌరుడి పట్ల అన్యాయం. అయితే సభ్యుల జీతాలను ఆటోమేటిక్‌గా కోత విధించడం కంటే, సభా నియమాలను ఉల్లంఘించే సభ్యులపై ఇప్పటికే ఉన్న చర్యలను మరింత కఠినతరం చేయడం, నిర్దిష్ట జవాబుదారీతన వ్యవస్థను ఏర్పాటు చేయడం సముచితం.

పార్లమెంట్‌ ప్రజలది. పార్టీలు తాత్కాలికం. ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వతం. ఎన్నికల్లో గెలిచినవారు అధికారాన్ని ఆస్వాదించడానికి, ఓడినవారు కేవలం అడ్డుకోవడానికి ప్రజలు ఎంపీలను ఎన్నుకోలేదు. ప్రజల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని, దేశ భవిష్యత్తుకు అవసరమైన చట్టాలను రూపొందించాలని, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలపాలని ఎన్నుకున్నారు.

అందుకే ఈ 19 రోజుల వైఫల్యంపై అధికార, ప్రతిపక్షాలు రెండూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇకపై ప్రతి సమావేశానికి ముందు అన్ని పార్టీలతో తప్పనిసరి సంప్రదింపులు జరగాలి. సభను స్తంభింపజేసే సభ్యులపై క్రమశిక్షణ చర్యలు ఉండాలి. చర్చకు సిద్ధమైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షం వినాలి. ప్రశ్నించే ప్రతిపక్షాన్ని ప్రభుత్వం గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో నిరసనకు స్థానం ఉంది.. కానీ నిరసన పేరుతో ప్రజాస్వామ్యాన్నే నిర్వీర్యం చేసే హక్కు ఎవరికీ లేదు.

జెన్‌జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి వైఖరి ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరాలి. పార్లమెంట్‌ను రాజకీయ బలప్రదర్శన వేదికగా కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా మార్చినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం నిలుస్తుంది. లేదంటే సభ భవనం పవిత్రంగా ఉన్నా.. అందులో జరిగే వ్యవహారాలు మాత్రం ప్రజల విశ్వాసాన్ని అపవిత్రం చేస్తూనే ఉంటాయి.

Latest News

గిట్ల కూడా బోనం!?|ADUGU TRENDS

జివ్వ కో రుసి, పుర్రె కో బుద్ధి అన్నరు. ఒక్కొక్క లు ఒక్కో తీరన్న మాట! మొన్నీ మద్దెల ఓ పొల్ల, కాల్లకు గిర్రలు కట్టుకొని, గుడికిపోయింది. గది గూడ బోనమెత్తింది. ఇగో గీ...

ఆగస్టు 14, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం తిధి శు.విదియ రాత్రి 08.20 వరకు ఉపరి తదియ నక్షత్రం మఖ ఉదయం 06.50 వరకు ఉపరి పుబ్బ యోగం పరిఘ మధ్యాహ్నం 12.36 వరకు ఉపరి శివ కరణం బాలవ ఉదయం...

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు. మతాల పుట్టుకకు కారణాలు వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు,...

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

డిలిమిటేషన్ – ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|EDITORIAL

2026 ఏప్రిల్‌ 16న లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టబడింది. అధికారిక పార్లమెంటరీ రికార్డు ప్రకారం అది పెండింగ్‌లో ఉంది. ఇంత ప్రాధాన్యమైన రాజ్యాంగ సవరణను తగిన చర్చ లేకుండా ఆమోదించడమూ తప్పే. రాజకీయ...

ఆగస్టు 13, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం శ్రావణ మాసారంభం తిధి శు.పాడ్యమి రాత్రి 09.43 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.42 వరకు ఉపరి మఖ యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.53 వరకు పరిఘ కరణం కింస్తుఘ్నం ఉదయం...

గీ అవ్వ.. భలే బాద్దరిది!?|ADUGU TRENDS

గీ అవ్వ అందరసొంటి మామూలు అవ్వ కాదు. భలే బాద్దరిది. పేరుకే ముసలిది కనీ, వయసొళ్ళు కూడా సేయలేని పనులు శేసి సూపిత్తా0ది. ఏకంగా వింగ్ వాక్ శేసి అందరి మనసులను గెలిసి0ది....

పార్లమెంటులో చివరకు మిగిలేదేంటి?!|EDITORIAL

ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే, వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్‌ సరిగా పనిచేయాలి. ప్రజల...

ఆగస్టు 12, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య రాత్రి 11.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుష్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యతీపాత సాయంత్రం 05.28 వరకు ఉపరి వరీయాన్ కరణం చతుస్పాద మధ్యాహ్నం 12.31 వరకు ఉపరి...

జెరం గోలీలు బట్టలకేత్తండ్లు!?|ADUGU TRENDS

బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి...

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు?|EDITORIAL

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు? మరెక్కడైనా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని అమ్ముకునే వ్యక్తి కేవలం విద్యార్థులను మోసం చేయడం లేదు. మెరిట్‌, కష్టం, ప్రతిభపై ఉన్న...

ఆగస్టు 11, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి చతుర్దశి రాత్రి 01.32 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పునర్వసు ఉదయం 10.19 వరకు ఉపరి పుష్యమి యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర మధ్యాహ్నం 02.43...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News