Thursday, August 13, 2026
25.2 C
Hyderabad

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు.

మతాల పుట్టుకకు కారణాలు

వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు) చీలిపోయారు. ఈ నాలుగు వర్ణాలకు చెందనివారందరిని పంచమ వర్ణంగా పరిగణించారు. ఈ వర్ణం వారిని అత్యంత హేయమైన అంటరానివారిగా సమాజానికి దూరంగా జీవించేవారు. కుల వ్యవస్థ ఆధారంగా సమాజంలో నాలుగవ వర్ణమైన శూద్రులను, పంచమకులం వారిని సామాజిక వివక్షత మరియు లింగ వివక్షతకు గురిచేశారు. బ్రాహ్మణ ఆధిపత్యం, మహిళల స్వేచ్ఛ హక్కులను ప్రాముఖ్యత, లింగ సమానత్వాన్ని బోధిస్తూ సమాజంలో మతాలు ఆవిర్భవించాయి. వైదిక మతాల ఆధారంగా యజ్ఞయాగాలు కేవలం ఆధిపత్య వర్ణం వారికే చెందడం వల్ల సమాజంలో దిగువ వర్గం వారికి, ఎగువ వర్గం వారికి ఆర్ధిక సంక్షోభాన్ని కూడా సృష్టించాయి (యజ్ఞయాగాలు ఖర్చుతో కూడుకున్నవి). షోడశ కర్మలు చేసినవారికి మాత్రమే మోక్షం లభిస్తుందని జనాభాలో అత్యధికులైన స్త్రీలు మరియు శూద్రులు మోక్షానికి అనర్హులని ప్రకటించి వైదిక మతాన్ని సామాన్యులకు దూరం చేశారు. ఈ కాలంలో ముఖ్య మతాలైన బౌద్ధ, జైన సమానత్వానికి ప్రాధాన్యతనిస్తూ మోక్షం అందరికీ సమానం, సాధ్యమని ప్రకటించి సామాన్యులకు దగ్గరయ్యాయి. వీటి గురించి క్లుప్తంగా బౌద్ధ గ్రంథమైన అంగుత్తరనికాయ (పాళీ భాష)లో స్పష్టానంగా రచించబడ్డాయి. బౌద్ధ, జైన మతాల ఆవిర్భావానికి ఆనాటి స్వతంత్ర రాజ్యాలు కూడా దోహదపడ్డాయి. బౌద్ధ మతానికి చెందిన గౌతమ బుద్ధుడు మరియు జైన మతానికి చెందిన వర్ధమాన మహావీరుడు కూడా స్వతంత్ర రాజ్యాలకు చెందినవారే.

పైన తెలియచేసిన సామాజిక, ఆర్ధిక, మత పరిస్థితులు బౌద్ధ, జైన మత ఆవిర్భావానికి కారణమైయ్యాయి. వీటికి రాజుల ఆదరణ మరియు ప్రచార సంఘాల కృషి వలన దేశవ్యాప్తంగా అభివృద్ధిచెందాయి.

భారతదేశంలో ఆవిర్భవించిన అవైదిక (వైదిక మతం కాని) మరియు బ్రాహ్మణ వ్యతిరేక మతాల్లో బ్రాహ్మణా వ్యతిరేక మతాల్లో బౌద్ధం మతం అత్యంత ముఖ్యమైనది. ఈ మతం బుద్ధుని యొక్క బోధనల ద్వారా స్థాపించబడింది.

గౌతమ బుద్ధుడు (క్రీ.పూ.566-486)

గౌతమ బుద్ధుడు నేపాల్ పర్వత ప్రాంతంలో కపిలవస్తు నగరంలో క్రీ.పూ.566 లో శాక్య తెగలో (క్షత్రియ వంశానికి చెందినది) జన్మించాడు. తండ్రి పేరు శుద్ధోదనుడు. ఇతను కపిలవస్తు ప్రాంతానికి ఎన్నికల పరిపాలకుడిగా విధులు నిర్వర్తించేవాడు. తల్లి కోసల. రాజపుత్రిక. గౌతముడు కూడా రాజవంశానికి చెందినవాడే కాబట్టి ప్రజాతంత్ర, సమానత్వ భావాలు వారసత్వంగా వచ్చాయి. గౌతమ బుద్ధుడు పదహారేళ్ళ వయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. బుద్ధుని (బుద్ధుడు అనగా జ్ఞానం పొందినవాడని అర్థం) అసలు పేరు సిద్ధార్థుడు. అలరకలాయ, రుద్రక బుద్ధుడికి వేద విద్యను నేర్పారు. బుద్ధుని జీవితంలో గల అయిదు ప్రధాన సంఘటనలను పంచమహాకళ్యాణములు అంటారు. అవి 1) జననం, 2) మహాభినిష్క్రమణ, 3) సంబోధి, 4) ధర్మ చక్ర పరివర్తన, 5) మహాపరినిర్వాణ. ఈ పంచమహాకళ్యాణములకు 5 గుర్తులు కూడా ఉన్నాయి.

1) జననం : బుద్ధుడు నేపాల్ లోని లుంబినిలో జన్మించాడు. దీనికి గుర్తు తామరపువ్వు.
2) మహాభినిష్క్రమణ : బుద్ధుడు ఇంటిని విడిచి 29వ యేట సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. సమాజంలో వృద్ధుడు, రోగి, శవం మరియు సన్యాసిని చూసిన బుద్ధుడి మనసు వికలమై తన ప్రాపంచిక జీవితాన్ని వీడి సన్యాసాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. కంఠక అనే గుర్రాన్ని అధిరోహించి ఇంటి నుండి నిష్క్రమించడం వల్ల ఆ గుర్రమే దీనికి గుర్తుగా పరిగణిస్తారు.
3) సంబోధి : బుద్ధుడు జ్ఞానోదయం పొందిన సంఘటనను సంబోధి అంటారు. ఇది గయలోని ఫాల్గు నది ఒడ్డున బోధి వృక్షం (రావి చెట్టు) కింద 35వ యేట జ్ఞానోదయం కలిగింది. బౌద్ధులకు పవిత్రమైన బోధి చెట్టు దీనికి గుర్తు.
4) ధర్మ చక్ర పరివర్తన : గౌతమ బుద్ధుని తొలి బోధనను ధర్మ చక్ర పరివర్తన అంటారు. ఇది సారనాధ్ లోని జింకల వనంలో జరిగింది. దీనికి కొండన, భదీయ, వప్ప, మహనామా, అస్సగి అనే అయిదుగురు శిష్యులు తొలి బోధనకు హాజరయ్యారు. ఈ సారనాధ్ నే బౌద్ధమత జన్మస్థలంగా భావిస్తారు. దీనికి గుర్తు 8 ఆకులు కలిగిన ధర్మచక్రం.
5) మహాపరినిర్వాణ : గౌతమ బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేస్తూ 80వ యేట కుషి నగరంలో (ఉత్తర్ ప్రదేశ్) మరణించాడు. దీనినే మహాపరినిర్వాణ అంటారు. బుద్ధుడు సుమారు 45 ఏళ్ళ పాటు తన బోధనలను ప్రచారం చేసాడు. దీనికి గుర్తు స్థూపం.

బౌద్ధమత బోధనలు:

గౌతమ బుద్ధుడు 4 సత్యాలను తెలియచేసాడు.
1) ప్రపంచమంతా దుఃఖమయం.
2) కోరికలే దుఃఖానికి కారణం.
3) దుఃఖాన్ని నిరోధించవచ్చు.
4) దుఃఖాన్ని నిరోధించడానికి మార్గం ఉంది.
బౌద్ధ మతంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం అష్టాంగ మార్గం. దీని ద్వారా కోరికలను అదుపు చేసి దుఃఖాన్ని జయించవచ్చు. అవి 1) సరైన క్రియ, 2) సరైన దృష్టి, 3) సరైన వాక్కు, 4) సరైన లక్ష్యం, 5) సరైన మార్గం, 6) సరైన జీవనోపాధి, 7) సరైన చైతన్యం, 8) సరైన ధ్యానం.

ప్రత్యుత్తసముప్పద : బౌద్ధ మత సిద్ధాంతాల్లో ఇది కార్యాచరణ సంబంధం గురించి తెలియచేస్తుంది. దీని ప్రకారం కారణం మరియు ఫలితం లేకుండా ఏ మానవ చర్య జరగదు.

బౌద్ధ మతంలో నాలుగు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. అవి రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, కాశ్మీర్ లోని కుందలవనంలలో ఈ సమావేశాలు జరిగాయి. వైశాలి నగరంలో జరిగిన రెండవ సమావేశంలో బౌద్ధ మతం సుమారు 18 శాఖలుగా విడిపోయింది. కాశ్మీర్ లోని కుందలవనంలో జరిగిన సమావేశంలో ఈ 18 శాఖలు మహాయానం, హీనయానం అనే రెండు శాఖలుగా ఏర్పడ్డాయి.

బౌద్ధమత పవిత్ర గ్రంథాలు : 1) సుత్తపీటక , 2) అంగుత్తరనికాయ, 3) సంయుక్తనికాయ, 4) ఖుద్దక నికయ, 5) అభిదమ్మ పీటక, 6) వినయ పీటక.

ప్రాచీన కాలంనాటి బౌద్ధమత పండితులు : ఆచార్య నాగార్జునుడు, మైత్రేయనాథుడు, బుద్ధఘోషుడు, దిజ్ఞాగుడు, ధర్మకీర్తి.

బానోత్ కళ్యాణ్

Latest News

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

డిలిమిటేషన్ – ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|EDITORIAL

2026 ఏప్రిల్‌ 16న లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టబడింది. అధికారిక పార్లమెంటరీ రికార్డు ప్రకారం అది పెండింగ్‌లో ఉంది. ఇంత ప్రాధాన్యమైన రాజ్యాంగ సవరణను తగిన చర్చ లేకుండా ఆమోదించడమూ తప్పే. రాజకీయ...

ఆగస్టు 13, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం శ్రావణ మాసారంభం తిధి శు.పాడ్యమి రాత్రి 09.43 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.42 వరకు ఉపరి మఖ యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.53 వరకు పరిఘ కరణం కింస్తుఘ్నం ఉదయం...

గీ అవ్వ.. భలే బాద్దరిది!?|ADUGU TRENDS

గీ అవ్వ అందరసొంటి మామూలు అవ్వ కాదు. భలే బాద్దరిది. పేరుకే ముసలిది కనీ, వయసొళ్ళు కూడా సేయలేని పనులు శేసి సూపిత్తా0ది. ఏకంగా వింగ్ వాక్ శేసి అందరి మనసులను గెలిసి0ది....

పార్లమెంటులో చివరకు మిగిలేదేంటి?!|EDITORIAL

ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే, వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్‌ సరిగా పనిచేయాలి. ప్రజల...

ఆగస్టు 12, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య రాత్రి 11.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుష్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యతీపాత సాయంత్రం 05.28 వరకు ఉపరి వరీయాన్ కరణం చతుస్పాద మధ్యాహ్నం 12.31 వరకు ఉపరి...

జెరం గోలీలు బట్టలకేత్తండ్లు!?|ADUGU TRENDS

బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి...

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు?|EDITORIAL

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు? మరెక్కడైనా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని అమ్ముకునే వ్యక్తి కేవలం విద్యార్థులను మోసం చేయడం లేదు. మెరిట్‌, కష్టం, ప్రతిభపై ఉన్న...

ఆగస్టు 11, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి చతుర్దశి రాత్రి 01.32 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పునర్వసు ఉదయం 10.19 వరకు ఉపరి పుష్యమి యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర మధ్యాహ్నం 02.43...

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News