Monday, July 27, 2026
23.4 C
Hyderabad

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్!
తప్పెవరిది? శిక్షలెవరికి?
మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి?
దళారుల ప్రమేయం నిజం కాదా?
మార్కెటింగ్ శాఖదే బాధ్యతా?
కేంద్రం ఎందుకు స్పందించదు?
వరంగల్ జేడీఎం సప్పెన్షన్!
7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు
సీసీఐ పత్తి అవినీతిపై ‘అడుగుగ్రౌండ్ రిపోర్ట్

దేశమంతటా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా పత్తి కొనుగోలు చేస్తోంది. ప్రతిసారీ సీసీఐ కొనుగోళ్ళ కంటే కూడా కొనుగోల్ మాల్ మీదే వివాదాలు ఎక్కువగా ముసురుకుంటున్నాయి. గతేడాది జరిగిన అవినీతిపై తాజాగా మార్కెటింగ్ శాఖ అధికారులకు నోటీసులివ్వడం ఒక ఉన్నతాధికారిని సస్పెండ్ చేయడం వాదాస్పదమే కాకుండా, చర్చనీయాంశంగా మారింది. అవినీతిలో అనేక మంది పాలు పంచుకున్నా, ఒక్క మార్కెటింగ్ శాఖ మీదే చర్యలెందుకు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? కేంద్ర సంస్థల వైఫల్యాలపై కేంద్రం ఎందుకు స్పందించదు? ఏటేటా దగా పడుతున్న రైతులు సంధిస్తున్న ప్రశ్నలెన్నో?

(అడుగు ప్రత్యేక ప్రతినిధి)

తెలంగాణలో భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలులో తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పేరుతో జరిగిన అవినీతిలో బాధ్యులెవరు? సీసీఐ అధికారుల పాత్ర ఎంత? మార్కెటింగ్ శాఖ అధికారుల బాధ్యతెంత? మొత్తం అవినీతిలో ఒక్క మార్కెటింగ్ శాఖ అధికారులను మాత్రమే భాద్యులను చేయడం సబబేనా? అసలు అవినీతి ఎలా జరిగింది? ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు?

గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాల వ్యవహారంలో 84 మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేయగా, తాజాగా మార్కెటింగ్ శాఖ వరంగల్ జేడీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారిని సస్పెన్షన్ చేయడం వివాదాస్పదంగానేగాక, చర్చనీయాంశంగా మారింది.

ఇదీ వెసలుబాటు
పట్టాదారు పాసు పుస్తకాలు లేని కౌలు రైతులు, పోడుభూములు చేసే రైతులకు సరైన పత్రాలు లేని కారణంగా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వెసలుబాటు కల్పించింది. ఈ వెసలుబాటు ఆసరాగా దళారులతో కలిసి, మిల్లర్లు, అధికారులు అక్రమాలకు తెరలేపారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. కొందరి పేర్లతో నేరుగా దళారులు, మిల్లర్లు, అధికారులు కలిసి దోచేశారు.

దందా సాగిందిలా?
తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులంతా భాగవస్వాములే. ముందుగా వ్యవసాయ అధికారులు పత్తి రైతులను గుర్తిస్తూ, వారు సాగు చేసిన భూములు, పండిన పత్తికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఆ ధ్రువీకరణ పత్రాల్లో రాసిన ఒక ఎకరా పంటకు బదులు ఒకటి పక్కన సున్నా పెట్టి పది, అంతకు మించి 19 ఎకరాలు పత్తి పండినట్లుగా మిగతా అధికారులు, మిల్లర్లు కలిసి నమోదు చేశారు. ఆ మేరకు మిల్లర్ల పత్తినే తిరిగి మిల్లర్లకు పెడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి సొమ్ముని తలా ఇంత పంచుకున్నారు.

మిల్లులే వేదికగా పత్తి కొనుగోలు
భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలును వ్యవసాయ మార్కెట్లల్లో కాకుండా పత్తి మిల్లులే వేదికగా చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ బాధ్యత తీసుకున్నా.. సీసీఐ కొనుగోలులో తప్పులు జరగడానికి ఒక్క మార్కెట్ అధికారులే కారణమా? పత్తి మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేదా? పత్తి కొనుగోళ్లు పరిశీలించే సీసీఐ అధికారులకు బాధ్యత లేదా? అవినీతిలో రైతు సరుకుల విక్రయ దారులు, దళారుల ప్రమేయం లేదా? తప్పంతా మార్కెటింగ్ శాఖదేనా?

పత్తిపాపం తలా పిడికెడు
సీసీఐ కొనుగోలులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు.. పత్తి మిల్లర్లు, సీసీఐ అధికారులు, దళారులు, మార్కెట్ సిబ్బంది అవినీతి విషయంలో అందరి బాధ్యత ఉంది. కానీ తప్పులు అందరు చేస్తే మార్కెటింగ్ శాఖ అధికారులకు మాత్రమే శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం అని సీసీఐ కొనుగోలు మాల్ తో పరిచయం ఉన్న వారు ప్రశ్నిస్తున్నారు.

పత్తి పాపాన్ని పంచుకున్నారు
సీసీఐ కొనుగోలులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి అనేది నిజం. పత్తి మిల్లర్లు, సీసీఐ, మార్కెట్ అధికారులు అందరూ ఏకమై పత్తి కొనుగోలులో పెద్ద మొత్తం దోపిడీ చేశారు. కానీ, మార్కెటింగ్ శాఖ పెద్దలు మాత్రం జేడియం తో పాటు ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెన్షన్ చేసింది. ఇందులో కొందరు రాజకీయ నాయకులకు సైతం డబ్బులు అందాయి. చివరికి రైతు సంఘ నాయకులకు.. మీడియా మిత్రులకు డబ్బులు ఇచ్చి మరీ, సీసీఐ పత్తి కొనుగోలు అవినీతి బయటికి పొక్కకుండా నోర్లు మూయించారు.

బాధ్యులపై కేసులేవి?
సీసీఐలో జరిగిన అవినీతి విషయంలో కేవలం మార్కెటింగ్ శాఖ ఉద్యోగులపై వేటు వేసి చేతులు దులుపుకోకుండా అవినీతిలో భాగం పంచుకున్న పత్తి మిల్లర్లు సీసీఐ అధికారులు, రైతు సరుకుల విక్రయదారులు, దళారులు, మార్కెటింగ్ సిబ్బంది, దడ్వాయిలు అందరిపై కేసు నమోదు చేయాలి. తప్పు చేసిన వారిని జైల్లో వేసి శిక్షించాలి.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News