Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

ప్రగతి పథంలో పాలకుర్తి

వందకు వంద శాతం రిజర్వాయర్లు పూర్తి
పార్టీని కాపాడే బాధ్యత మీది
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది
పిచ్చి ప్రేలాపణలు, తుచ్ఛ ప్రచారాలు మానుకోండి
లాలూ‘ఛీ’లు పడకండి… లూజ్ టాక్ చేయకండి
బదనాం చేయాలని చూస్తే భరతం పడతా?
పజీత చేయాలని చూసే వారి పని పడతా?

పార్టీ అంటే నేనో, లేక మరెవరో కాదు. పార్టీ అంటే బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు మాత్రమే కాదు. పార్టీ అంటే కార్యకర్తలు, పార్టీ అంటే ప్రజలు… మీరంతా పార్టీని కాపాడండి.. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. కాదని పార్టీని పజీత చేయాలని చూస్తే, వారి పనిపడతా… బదనాం చేసే వారి భరతం పడతా? అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి హెచ్చరించారు. పాలకుర్తిని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నాది… పార్టీని కాపాడే బాధ్యత కార్యకర్తలు, ప్రజలు తీసుకోవాలని హితవు పలికారు. చివరకు పార్టీ కార్యాలయానికి ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానులను కూడా కొందరు ప్రతిపక్షనేతలు బెదిరించే నీచ స్థాయికి దిగజారారని, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని, కొందరు ముసలి నక్కలు, కుయుక్తులు పన్నుతున్నాయని ఎద్దేవా చేశారు. అలాంటి వారెవరినీ వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో కొత్త భవనంలో పార్టీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన ఎమ్మెల్యే ఘాటుగానే మాట్లాడారు.

గత పాలకులు తమ కాలంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడుతాయోననే భయంతో తప్పుడు ప్రచారాలు, పిచ్చి ప్రేలాపనలకు దిగుతున్నారన్నారు. చివరకు పార్టీ కార్యాలయానికి ఇచ్చిన యజమానిని కూడా బెదిరించారు. భయపెట్టించారు. అయినా ధైర్యంగా నిలబడి, కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం కోసం తమ ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యాలయం నుండే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయాలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే చమత్కరించారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కష్టపడి సైనికుల్లా పనిచేసి గెలిపించారో, అదే విధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనమంతా శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఆ రోజు అధికార దుర్వినియోగానికి, అవినీతికి, అక్రమాలకు ఎదురు తిరిగి, నాకు అండగా నిలబడి, ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు. మీరు లేకుండా నేను లేను. పార్టీ లేదు. అప్పటి లాగే ప్రజల, కార్యకర్తల అండదండలు మాకు కావాలని, ఇంతకుముందు కన్నా ఎక్కువ కష్టపడాలి. పార్టీని మీరు కాపాడాలి. మిమ్మల్ని మేము కాపాడుతాం. మీ మంచి చెడు చూసే బాధ్యత మాది. మీకు అండగా నిలబడతానని ఆమె అన్నారు. పాలకుర్తి పురోగతికి పాటు పడతామని ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, పార్టీ అభివ్రుద్ధి పనులు, అమలవుతున్న పథకాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. మన పథకాల గురించి ప్రజలకు చెప్పండి. మనం చేసే మంచిని చర్చించాలి. మనం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సింది మీరే అన్నారు.

అయితే, కొందరు పనిగట్టుకుని మరీ.. పార్టీపై, ప్రభుత్వ పథకాలపై, మాపై లూజ్ టాక్ చేస్తున్నారని తెలిసింది. అలాంటి వారి వెంట పడతాను. వారి భరతం పడతా. పార్టీలోనే ఉంటూ, కోవర్టులుగా పని చేస్తున్న వారి రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేస్తానని హెచ్చరించారు. ఇలాంటి వారికి మన చేసే అభివ్రుద్ధితోనే బుద్ధి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

తాను పాలకుర్తి ప్రగతి కోసం అహర్నిశలు పాటు పడుతున్నానని చెప్పారు. ఒక్కొక్క పని కోసం నేను చేస్తున్న కష్టం మీకేం తెలుసు. ఏయే ప్రాంతాల్లో ఏమేం చేయాలన్నదానిపైనే నేను ఆలోచిస్తున్నాను.
ఈ మధ్య కాలంలో సిఆర్ఆర్ఎంఆర్ కింద 50 కోట్ల నిధులు తెచ్చాను. మన పాలకుర్తి బస్టాండ్ కూడా మనం అనుకున్నట్లు అభివృద్ధి చేసి చూపిస్తాను. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు వందకు వంద శాతం పూర్తి చేస్తాను. దేవరుప్పుల మండలంలో రూ.150 కోట్లతో 131 కెవి సబ్ స్టేషన్ మంజూరు అయింది. కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ పెట్టిన… కొద్ది రోజుల్లోనే మంజూరు అయితది. కొడకండ్లలో టెక్స్టైల్ పార్క్ కూడా చేసి చూపిస్తా… రాయపర్తి మండలంలో రూ.14 కోట్లతో గోదాము మంజూరు అయింది. టెండర్లు కూడా పూర్తి అయినాయి. పాలకుర్తిలో 50 పడకల హాస్పిటల్ కు టెండర్లు పూర్తి అయి అగ్రిమెంట్ కూడా ఈ మధ్య అయిపోతుంది. తొర్రూరులో కూడా 100 పడకల హాస్పిటల్ కూడా అయిపోతుంది. అలాగే తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి వచ్చిన నిధుల నుండి రూ.5 కోట్లు కేటాయించిన… అట్లనే మొన్న డిప్యూటీ సీఎం భట్టి గారి పేషీలో 3 గంటలు కూర్చున్న… మిగతా ఎమ్మెల్యేలు విసుగు వచ్చి వెళ్ళిపోయినా సరే, నేను మాత్రం వెళ్ళి మాట్లాడి రూ.20 కోట్ల నిధులు తెచ్చాను. అని ఎమ్మెల్యే వివరించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. ఇవి అన్ని నేను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నా… నాకు ప్రచారం డంబాచారం కాదు కావలసింది. మనల్ని నమ్ముకున్న పాలకుర్తి ప్రజలకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం అన్నారు. ఎమ్మెల్యే అయిపోయిన.. ఇక నాకేంటి? అని చేతులు ముడుచుకుని చైర్ లో కూర్చోవడం కాదు, గెలిపించిన ప్రజల కష్టాలు తీర్చడం, కష్టపడి గెలిపించిన కార్యకర్తలను కాపాడుకోవడం. అవే నేను చేయాల్సింది నేను చేస్తున్నా అని యశస్వినీ రెడ్డి వివరించారు. నేను దీనిని శ్రమ అనుకోవడం లేదు. బాధ్యతగా భావిస్తున్న…ఇది నా కర్తవ్యం. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన… చేస్తున్న… ప్రజలకు సేవ చేస్తుంటే ఆనందంగా కూడా ఉన్నది. పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News