Thursday, July 30, 2026
23.4 C
Hyderabad

ఎడిటోరియల్ : 11.03.2025

విపక్షాల సమర్థతకు విషమ పరీక్ష !

పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. దేశంలో ఉన్న సమస్సయల దృష్ట్యా ఈ సమావేశాలే కీలకం. ఈ సమావేశాల్లో ఏ అంశంపై చర్చించాలి..చర్చించకూడదు.. సభాసమయాన్ని సద్వినియోగం చేసుకోవడమెలా అన్నది కూడా విపక్ష కాంగ్రెస్‌ చతురతపై ఆధారపడి ఉంది. అలాగే విపక్షాలు కూడా సమర్థత ప్రదర్వించాల్సి ఉంది. కేవలం అల్లరి చేసి వాకట్లు చేయడమో. ప్రతిష్టంభనతో సభ వాయిదా వేయించడం వల్లనో సమస్యలు చర్చకు రావు. ఇది గమనించి కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే అది విపక్ష పార్టీగా విఫలం అయినట్లే. ప్రధానంగా డిటిమిటేషన్‌ భయాలు, జనగణన,జిఎస్టీ, నిరుద్యోగం, ఔషధధరలు, పెరుగుతున్న నిత్యావసర ధరలు వంటి ప్రధాన సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు డీలిమిటేషన్‌పై సర్వత్రా చర్చ నడుస్తోంది. దక్షిణాది రాష్టాల్ల్రో జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై బిజెపి లేదా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. తెలంగాణ బిజెపి నేతలు మాత్రం సీట్లు తగ్గవని అంటున్నారు. ఇంతకీ ఇప్పుడున్న సీట్లు తగ్గవా లేక, పెరిగే సీట్లు తగ్గవా అన్నది స్పష్టం చేయకుండా గోడవాటం పిల్లిలా వ్యవహరిస్తున్నారు. అమెరికా తరహాలోనే భారత్‌ కూడా ప్రజ్యాస్వామ్య వ్యవస్థ కలిగిన సమాఖ్య రాజ్యం. 1971లోని జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయనే వాస్తవాన్ని గుర్తించాము. అయితే ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి బదులు దాన్ని 2026 దాకా వాయిదా వేశాము. చివరి జనాభా గణన 2011లో జరిగింది. తదుపరి జనాభా గణన 2021లో జరగవలసి ఉండగా కోవిడ్‌ విలయం వల్ల వాయిదా వేశారు. 2021 నుంచి ఏదో ఒక సాకుతో జనాభా గణన జరగనే లేదు. తాజాగా కులగణన అంటూ కాంగ్రెస్‌ రాజకీయాలు మొదలు పెట్టింది. దీంతో సమాజంలో చీలిక తప్ప మరోటి రాదు. ఇది ఓ రకంగా అచ్చం రాజకీయ లబ్దికోసం చేస్తున్న డిమాండ్‌ తప్ప మరోటి కాదు. ఈ క్రమంలో 2026లో జనాభా గణన అనంతరం విధిగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగవలసి ఉన్నది. ప్రతి రాష్టాన్రికి కేటాయించే సీట్ల సంఖ్యను కూడా అప్పుడే నిర్ణయిస్తారు. జనాభా పెరుగుదల అదుపులేకుండా జరిగినందుకు కొన్ని రాష్టాల్రకు ప్రయోజనాలు కల్పిస్తారు. సంపూర్ణ ప్రజనన రేటు 2 శాతం, అంతకంటే తక్కువగా ఉండాలన్న నిర్దేశిత లక్ష్యాన్ని సాధించిన రాష్టాల్రను సీట్ల కుదింపుతో శిక్షించనున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలా కేవలం జనాభా ప్తరాపిదకిగా కాకుందా మధ్యేమార్గం అవలంబించాల్సిన అసవరం ఇప్పుడు కనిపిస్తోంది. పునర్విభజనతో దక్షిణాది రాష్టాల్రు తీవ్రంగా నష్టపోతాయని తమిళనాడు సిఎం స్లాలిన్‌ పోరుబాట పట్టారు. జనాభా నిష్పత్తి సూత్రానికి అనుగుణంగా ఆయా రాష్టాల్ర సీట్ల సంఖ్యను పునర్‌ నిర్దారించడం ద్వారా దక్షిణృాది రాష్టాల్రకు నషటం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్టాల్ల్రో ఇప్పుడు లోక్‌సభలో 129 స్థానాలున్నా వారి గళం పెద్దగా విన్పించడం లేదు. ఇప్పుడా సీట్ల సంఖ్య మరింతగా తగ్గితే దక్షిణాది ప్రతినిధుల మాటను కేంద్రం పట్టించుకోదు. సీట్ల సంఖ్య తగ్గించబోమనే హావిూలో నిజాయితీ కొరవడిరది. ఇదే సందర్భంలో జనాభా అత్యధికంగా ఉన్న యూపీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల సీట్ల సంఖ్యను పెంచబోమని కేంద్రం స్పష్టంగా ప్రకటించడం లేదు. సీట్ల సంఖ్య పునర్‌ నిర్దారణకు జనాభా నిష్పత్తి సూత్రాన్ని అనుసరించిన పక్షంలో దక్షిణాది రాష్టాల్ర బలం మరింతగా తగ్గిపోతుంది. పర్యవసానంగా పార్లమెంటులో దక్షిణాది వారి గళం వినిపించే వారి సంఖ్యా తగ్గుతుంది. ఈ రాష్టాల్ర సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం పెరుగుతంది. కొన్ని రాష్టాల్రకు సీట్ల సంఖ్యను కుదించాలన్నా, పెంచాలన్నా ఇప్పుడున్న సీట్ల సంఖ్యను అనివార్యంగా పెంచాలి. రాష్టాల్ర సైజు బట్టి సీట్లను పెంచడం కూడా ఆలోచించాలి. లోక్‌సభకు ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్యను విధిగా పెంచవలసి ఉంటుంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, 1977లో రాజ్యాంగానికి 42వ సవరణ జరిగింది. లోక్‌సభలో ప్రస్తుతం రాష్టాల్ర నుంచి ఎన్నికైన ప్రతినిధులు 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ఉన్నారు. అధికరణ 81లోని నిబంధన 2(ఎ) ప్రకారం ప్రతి రాష్ట్రం నుండి లోక్‌సభకు ఎంతమంది ఎన్నిక కావాలనే విషయం ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. జనాభాకు, లోక్‌సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంతవరకు అన్ని రాష్టాల్రకు ఒకే విధంగా ఉంటే పేచీ ఉండదు. ఇకపోతే ప్రధానంగా మరో రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంది. ఇప్పుడున్న ఎంపిలు, ఎమ్మెల్యేలు వరుసగా వారే ఎన్నికవుతూ వస్తున్నారు.. కలు,ధనబలం ద్వారా ఒక్కరే ఆరేడు పర్యాయాలు సభ్యులుగా ఉంటున్నారు. ఇది పోవాల్సిన అవసరం ఉంది. 140 కోట్లు ఉన్న దేశంలో కొందరే నిరంతరంగా చట్టసభలను గబ్బిలాల్లో పట్టుకుని వెళ్లాడుతున్నారు. ఇందులో అన్ని పార్టీల వారూ ఉన్నారు. ఇది పోతేనే దేశం బాగుపడదు. అలాగే ప్రజాస్వామ్యం బలపడదు. దీనిపై బిజెపి దృష్టి పెట్టాల్సి ఉంది. కనీసం రెండు టర్ములకు మించి ఎన్నిక కాకుండా రాజ్యాంగ సవరణ చేయాలి. మూడో దఫాలో అధికారం చేపట్టిన మోడీ అనేక ఆశలు కల్పించారు. ఇలాంటి సంస్కరణలు చేపడితే ప్రజలు ఆమోదిస్తారు. హర్షిస్తారు. రాజకీయ పార్టీల నేతలు జీవితాంతం చట్టసభల్లో తిష్టవేయకుండా చేస్తే..దేశ ప్రయోజనాలు కాపాడిన వారు అవుతారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ సచ్ఛీలతను చాటుకోవాల్సి ఉంది. ముందుగా మోడీ ఇందుకు సిద్దం కావాలి.

Latest News

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News